యాప్నగరం

Karnataka Travel: అంతర్జాతీయ ప్రయాణికులకు కర్ణాటక ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు..!

ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక (Karnataka Covid-19 Guidelines) ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ రాష్ట్రంలో కొవిడ్-19 వైరస్‌ను నిరోధించడానికి తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 27 Dec 2022, 2:52 pm
Samayam Telugu covidtravel-thumb
చైనాతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న (Rising Covid-19 Cases) కేసుల నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి భారతదేశం ముందుజాగ్రత్త చర్యలను వేగవంతం చేస్తోంది. అదే విధంగా ఇతర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే కర్ణాటక ప్రభుత్వం కూడా రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ విషయంపై మాట్లాడిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.. కొవిడ్-19 నివారణ చర్యలను రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే వైరస్‌ను అదుపులో ఉంచడానికి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు.

  • కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినట్లుగా 2 శాతం అంతర్జాతీయ ప్రయాణికులకు ర్యాండమ్ టెస్టులు నిర్వహించనున్నారు.
  • బెంగుళూరు, మంగళూరు విమానాశ్రయాల్లో లక్షణాలతో కనిపించిన అంతర్జాతీయ ప్రయాణికులను కొవిడ్ ప్రోటోకాల్ ప్రకారం క్వారంటైన్‌కు తరలిస్తారు. కేసుల పరిస్థితులను బట్టి వైద్య సదుపాయాలు కల్పిస్తారు. ప్రయాణికులు అవసరమైతే తర్వాత సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లొచ్చు.
  • అలాగే ఎవరైనా పాజిటివ్‌గా తేలి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే.. అందుకు అయ్యే ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
  • ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నాక నమూనాలు అందజేసి తర్వాత విమానాశ్రయం నుండి వెళ్లిపోవచ్చు. అప్పుడు కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి. ఒకవేళ తర్వాత వారికి లక్షణాలు కనిపించడం మొదలైతే వెంటనే స్థానిక ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలి.
  • అలాగే పాజిటివ్‌గా తేలినవారిని, 25 కన్నా తక్కువ CT వాల్యూ కలిగినవారిని జినోమ్ సీక్వెసింగ్ కేంద్రానికి తరలిస్తారు. ఎందుకంటే వారికి BF-7 వేరియంట్ సోకిందా లేదా అనేది నిర్ధారిస్తారు.
  • మరోవైపు 12 ఏళ్లోపు చిన్నారులకు కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని పూర్తి ఆరోగ్యంతో ఉన్న తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వెంట ప్రత్యేక వైద్య శిబిరాలకు తరలిస్తారు.
Read All Latest Telugu News and Travel News
రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.