యాప్నగరం

Thailand Visa: థాయ్‌లాండ్ వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్‌న్యూస్.. అదేంటంటే..?

భారతీయ పర్యాటకులు బ్యాంకాక్ (Bangkok Tourism) విమానాశ్రయంలో వీసా ఆన్ అరైవల్, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం క్యూలైన్లలో వేచి ఉండకుండా ఇక్కడి థాయ్ కాన్సులేట్ లేదా ఎంబసీలో వీసాలు పొందొచ్చు.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 29 Nov 2022, 10:44 am
థాయ్‌లాండ్‌ను సందర్శించాలనుకునేవారికి థాయ్‌లాండ్ రాయబార కార్యాలయం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై అక్కడికి వెళ్లాలనుకునేవారు ఇండియాలోని థాయ్‌లాండ్ కాన్సులేట్ లేదా ఎంబసీ వద్ద వీసాలు పొందొచ్చని వెల్లడించింది. కరోనా తర్వాత ఆ దేశానికి వెళ్లేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో బ్యాంకాక్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్, వీసా ఆన్ అరైవల్ పొందే ప్రయాణికులు భారీ క్యూలైన్‌లలో గంటలకొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల సౌలభ్యం కోసం భారత్‌లోని థాయ్‌లాండ్ ఎంజసీ లేదా కాన్సులేట్ వద్దే వీసాలు పొందొచ్చని పేర్కొంది.
Samayam Telugu Thailand


Also Read: New Year Visiting Places: కొత్త సంవత్సరంలో ఈ అందమైన నగరాలను సందర్శించడానికి ట్రై చేయండి..!

ఇదే విషయంపై థాయ్‌లాండ్ రాయబారి పట్టరత్ హాంగ్‌టాంగ్ తాజాగా మాట్లాడుతూ.. భారతీయ ప్రయాణికులు ఇకపై బ్యాంకాక్ విమానాశ్రయంలో ఎక్కువసేపు క్యూలైన్లలో వేచి ఉండకుండా ఇక్కడే వీసాలు పొందొచ్చని తెలిపారు. కొద్ది నెలల క్రితం థాయ్‌లాండ్ కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే అక్కడి విమానాశ్రయంలోనూ రద్దీ పెరిగిపోయి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. ఈ విషయంపై చాలా మంది ప్రయాణికులు థాయ్ అధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా బ్యాంకాక్ విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాసే వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయులకు ఇకపై ఇక్కడే వీసాలు అందించనున్నారు.

Also Read: IRCTC Araku Package: విశాఖ టు అరకు వ్యాలీ.. ఐఆర్సీటీసీ వన్‌డే ట్రిప్ ఎంతో తెలుసా?

మరోవైపు బ్యాంకాక్‌కు వెళ్లిన ప్రయాణికులు విమానాశ్రయంలో భారీ క్యూలైన్లలో వేచి ఉంటుండటంపై స్పందించిన హాంగ్టాంగ్.. థాయ్‌లాండ్‌లోనే కాకుండా ఏ విమానాశ్రయంలోనైనా ఇది చాలా సహజమైన విషయమని పేర్కొన్నారు. ఎవరైనా తమ దేశంలోకి వచ్చే ప్రయాణికుల సంఖ్యను అంచనా వేయలేరని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రయాణికుల సౌకర్యార్థం బ్యాంకాక్ విమానాశ్రయంలోనూ తమ సిబ్బంది సంఖ్యను పెంచుతున్నట్లు చెప్పారు. భారతీయులు ఎవరైనా థాయ్‌లాండ్‌లో ఇబ్బందులు పడొద్దనుకుంటే అక్కడికి వెళ్లే ముందే ఎంబసీ లేదా కాన్సులేట్ జనరల్ నుండి వీసా పొందాలని సూచించారు.
ఇక ఈ ఏడాది జనవరి నుండి ఆగస్టు 17 వరకు థాయ్‌లాండ్‌ను మొత్తం 3.78 మిలియన్ల మంది సందర్శించారని పట్టరత్ పేర్కొన్నారు.

Read All Latest Telugu News and Travel News
రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.