యాప్నగరం

IRCTC International Trip: ఐఆర్సీటీసీ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్.. ధర అందుబాటులోనే ఇక ఆలోచించకండి..!

ఐఆర్సీటీసీ (IRCTC International Trip ) హైదరాబాద్ నుండి అంతర్జాతీయ ట్రిప్ ప్లాన్ చేసింది. రూ.50 వేలలోపే మీకు అదిరిపోయే గొప్ప పర్యాటక అనుభవాన్ని అందించనుంది. పూర్తి వివరాలు తెలియాలంటే ఇక్కడ చదవండి.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 9 Feb 2023, 3:40 pm
నగర వాసులకు ఐఆర్సీటీసీ బడ్జెట్ ఫ్రెండ్లీ అంతర్జాతీయ ట్రిప్‌ని (IRCTC International Trip) ప్లాన్ చేసింది. అది మీకు రూ.50 వేలలోనే మరో దేశానికి వెళ్లి వచ్చే అవకాశాన్ని కలిగించింది. అది కూడా విమాన ప్రయాణంలో వెళ్లిరావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఐఆర్సీటీసీ హైదరాబాద్ వాసులకు ఎప్పటికప్పుడు నూతన ప్యాకేజీలు (IRCTC Tour Pakcages) తీసుకొచ్చి వారి మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్యాకేజీ కూడా తీసుకొచ్చింది. వచ్చే నెల 29న హైదరాబాద్‌ టు నేపాల్ పర్యటన అందించనుంది. అది 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగనుంది. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ఎంచుకున్నవారు హిమాలయాల దేశంలో మంచి హాలిడేని ఎంజాయ్ చేసేవీలుంటుంది. ఆసక్తి ఉంటే మీరూ వెంటనే టికెట్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. (Photo Credit: Unsplash)
Samayam Telugu irctc offering nepal tour package from hyderabad for 5 nights and 6 days
IRCTC International Trip: ఐఆర్సీటీసీ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్.. ధర అందుబాటులోనే ఇక ఆలోచించకండి..!


నేపాల్ గురించి..

నేపాల్ పర్యటన గొప్పగా ఉంటుందనడంలో సందేహం లేదు, చుట్టూ హిమాలయాలు, అందమైన పట్టణాలు, ప్రకృతి సహజసిద్ధమైన దృశ్యాలు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటాయి. అక్కడ విహరిస్తే ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. అలాంటి హిమాలయాల దేశంలో ఎవరైనా పర్యటించడానికి ఆసక్తి చూపుతారు. అలాంటప్పుడు మనం కూడా వెళ్లడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. వెంటనే ఆఫీస్‌లో ఓ వారం రోజులు సెలవు పెట్టి హ్యాపీగా విహరించే ప్రయత్నం చేయండి. దాంతో మీకు మనో ఉల్లాసం కలుగుతుంది. (Photo Credit: Unsplash)

Also Read: Qatar Hayya Card: ఖతార్ గుడ్‌న్యూస్.. ఏడాది వరకు హయ్యా కార్డ్ పొడిగింపుకు అనుమతి

హైదరాబాద్ నుండి ఇలా..

ఈ టూర్ మార్చి 29న శంషాబాద్ విమానాశ్రయం నుండి మొదలవుతుంది. హైదరాబాద్ నుండి నేరుగా ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ చేరుకొని అక్కడి నుండి నేపాల్‌కు వెళతారు. గోరఖ్‌పూర్‌లో మిమ్మల్ని ట్రావెల్ ఏజెంట్ పికప్ చేసుకొని నేపాల్‌లోని లుంబినీకి తీసుకెళతారు. అక్కడికి వెళ్లేసరికి సాయంత్రం అవడంతో హోటల్‌కు చేరుకున్నాక విశ్రాంతినిస్తారు. (Photo Credit: Unsplash)

Also Read: Walking Safari: మీరెప్పుడైనా అడవిలో వాకింగ్ సఫారీ చేశారా..? లేకపోతే ఇక్కడ ట్రై చేసి చూడండి..!

లుంబినీ టు పోఖరా..

ఉదయం అల్పాహరం చేశాక 210 కిలోమీటర్ల దూరంలోని పోఖరా అనే పర్యాటక ప్రదేశానికి బయలుదేరుతారు. అక్కడ ప్రశాంతమైన పగోడా సందర్శించాక, మాయాదేవి టెంపుల్, బౌద్ధ ఆలయం, పెహ్వా లేక్ వంటివి చూస్తారు. రాత్రికి పోఖరాలోనే ఉండి మరుసటి రోజు సారంగ్‌కోట్‌లోని సూర్యోదయ అందాలను తిలకిస్తారు. తర్వాత బింధ్యబాసిని మందిర్, దేవిస్ ఫాల్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్‌లను చూస్తారు. రాత్రికి కూడా అక్కడే ఉంటారు. (Photo Credit: Unsplash)

Also Read: Valentines Day Visa Free Countries: వాలెంటైన్స్ డేకి వీసా ఫ్రీ దేశాలు ఇవే.. మీ ప్రియమైన వారితో కలిసి వెళ్లండి..

పోఖరా టు ఖాట్మండు..

ఇక నాలుగో రోజు ఉదయం అల్పాహారం అయ్యాక ఖాట్మండుకు తిరిగి బయలుదేరుతారు. మార్గమధ్యంలో మనోకామ్నా టెంపుల్ చూస్తారు. అనంతరం స్థానికంగా ఉండే మార్కెట్‌లో కావాలనుకుంటే షాపింగ్ చేయొచ్చు. రాత్రికి ఖాట్మాండులోనే ఉంటారు. మరుసటి రోజు పశుపతినాథ్ ఆలయం, దర్బార్ స్క్వేర్, రాయల్ పాలేస్, స్వయంభునాథ్ టెంపుల్ వంటివి తిలకిస్తారు. ఇక రాత్రికి అక్కడే ఉండి ఆరో రోజు ఉదయం అల్పాహారం అయ్యాక మిమ్మల్ని తిరిగి ఖాట్మాండులోని విమానాశ్రయంలో వదిలేస్తారు. అక్కడి నుండి మధ్యాహ్నం 2:10 గంటలకు దిల్లీ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగొస్తారు. (Photo Credit: Unsplash)

Also Read: Konkan Tourist Places: కొంకణ్ ప్రాంతంలోని ఈ ఐదు అత్యుత్తమ గమ్యస్థానాలను ఎప్పుడైనా చూశారా?

ప్యాకేజీ ధరలు..

ఈ ప్యాకేజీ బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంది. ఒక్కరు వెళ్లాలనుకుంటే రూ.53,660 కాగా, డబుల్ షేరింగ్‌లో రూ.45,505, ట్రిపుల్ షేరింగ్‌లో రూ.44,265 గా వెల్లడించారు. ఇక 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులు ఉంటే విత్ బెడ్ రూ.41,795, వితౌట్ బెడ్ రూ.32,585 గా వెల్లడించారు. దీంతో మీరు చాలా తక్కువ ధరలోనే ఆరు రోజుల అంతర్జాతీయ ట్రిప్ పూర్తి చేసే అవకాశం ఉంది. (Photo Credit: Unsplash)

Also Read: IRCTC South India Tour: ఐఆర్సీటీసీ దక్షిణ భారత టూర్ ప్యాకేజీ.. ఎప్పుడంటే..!

ప్యాకేజీలో ఉండేవి..

అప్ అండ్ డౌన్ విమాన టికెట్లు, ఐదు రాత్రులు హోటల్‌లో వసతి, అలాగే 5 రోజులు ఉదయం, రాత్రి భోజన ఏర్పాట్లు అన్నీ ఇందులో ఉంటాయి. ఇక అక్కడ సందర్శనీయ ప్రాంతాలను చూడటానికి ప్రత్యేకమైన వాహనం ఉంటుంది. ఇందులో ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. సందర్శనీయ ప్రాంతాల్లో ఎంట్రన్స్ టికెట్లు ఉంటాయి. అందులోనే అన్ని ట్యాక్సులు ఉంటాయి. (Photo Credit: Unsplash)

Also Read: AP Tourism: మీ ఫొటోగ్రఫీ ట్యాలెంట్‌ని ఇక్కడ చూపించండి.. అవకాశం కల్పించిన ఏపీ టూరిజం శాఖ

ప్యాకేజీలో ఉండనివి..

రోజు మధ్యాహ్న భోజనం ప్యాకేజీలో భాగం కాదు. అలాగే మీరు ఇంటి నుండి శంషాబాద్ విమానాశ్రయానికి, తిరుగు ప్రయాణంలో విమానాశ్రయం నుండి ఇంటికి రానుపోను ఏర్పాట్లు మీరే చూసుకోవాలి. ఫ్లైట్‌లో భోజనం కూడా ఏమీ ఉండదు. డ్రైవర్లు, టూర్ గైడ్లకు అదనంగా చెల్లించాలి. ఇక వ్యక్తిగత ఖర్చులు ఏమైనా ఉంటే అవి కూడా మీరే చూసుకోవాలి. పూర్తి సమాచారం కోసం లేదా టికెట్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. (Photo Credit: Unsplash)

Also Read: Valentines Day Special Tours: వాలెంటైన్స్ డేకి ఇవే రొమాంటిక్ డెస్టినేషన్లు.. వెళితే దిమ్మతిరిగే అందాలు!

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.