యాప్నగరం

వావ్... శ్రీనగర్ నుండి కనిపిస్తున్న పిర్ పంజల్ శ్రేణి దృశ్యాలు

శ్రీనగర్ నుండి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిర్ పంజల్ పర్వత శ్రేణి దృశ్యాలు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటో మీరు ఊహించగలరా?

Samayam Telugu 28 Apr 2020, 4:10 pm
Photo Courtesy: Photo Credit: Waseem_andrabi on twitter
Samayam Telugu పిర్ పంజల్ పర్వత శ్రేణి


కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా భారత దేశంలో ఎన్నో అద్భుతమైన పర్యావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ 3న పంజాబ్ లోని జలంధర్ నగర వాసులకు చాలా కాలం తరువాత మొదటి సారిగా దౌలధర్ పర్వత శ్రేణి దృశ్యాలు కనిపించడం దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. భారత దేశం వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా కాలుష్య స్థాయిలు తగ్గడం వలన ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. జలంధర్ నుండి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న దౌలధర్ పర్వత శ్రేణులు కనిపించడం నిజంగా ఒక అద్భుతంగా ప్రజలు భావించారు.

తాజాగా కాశ్మీర్ లో కూడా ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది. శ్రీనగర్ లో స్థానికులకు గంభీరమైన పిర్ పంజల్ పర్వత శ్రేణి దృశ్యాలు కనిపించాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో కాలుష్యం గణనీయంగా పడిపోయినందున ఈ దృశ్యాలను ప్రజలు అత్యంత స్పష్టంగా చూడగలిగారు.

హిమాచల్ ప్రదేశ్ నుండి జమ్మూ కాశ్మీర్ వరకు విస్తరించి ఉన్న పిర్ పంజల్ శ్రేణి దృశ్యాలు ఇప్పుడు కాశ్మీర్ లోని శ్రీనగర్ నుండి చాలా అందంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ పర్వత శ్రేణి శ్రీనగర్ నుండి కొంత మేర కనిపిస్తుంది. కానీ వాయు కాలుష్యం తగ్గడం వలన ఎన్నడూ లేని విధంగా ఈ దృశ్యాలు మరింత స్పష్టంగా మారడం విశేషం.

Read Also: మనం ఇళ్లలో ఉండడం వలన వీటికి ఎంత స్వేచ్ఛ వచ్చిందో చూడండి

ఫోటో జర్నలిస్ట్ వసీం ఆండ్రాబీ ఈ పర్వత శ్రేణి యొక్క ఆకర్షణీయమైన చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో ప్రసిద్ధ హజ్రత్ బల్ పుణ్య క్షేత్రం మరియు హరి పర్బాట్ కోటను కూడా చూడవచ్చు. మీలో చాలా మందికి చిన్నప్పుడు భౌగోళిక పాఠాల్లో పిర్ పంజల్ పర్వత శ్రేణి పేరుతో పరిచయం ఉండే ఉంటుంది. ఇది కాశ్మీర్ లోని అత్యంత అందమైన పర్వత శ్రేణులలో ఒకటి.

పిర్ పంజల్ శ్రేణి

పిర్ పంజల్ శ్రేణి అనేది కొన్ని పర్వతాల సమూహం. ఇది రాంబన్ లో ప్రారంభమై పశ్చిమ దిశగా జమ్మూ కాశ్మీర్ కు, ముజఫరాబాద్ జిల్లా చివరి అంతం వరకు విస్తరించి ఉంది. దీని పొడవు 288 కిలోమీటర్లు. వెడల్పు 40 నుండి 50 కిలోమీటర్ల మధ్య మారుతుంటుంది. పిర్ పంజల్ పాస్, బనిహాల్ పాస్, హాజీపిర్ పాస్, రతన్ పిర్ పాస్, బైరామ్ గాలా పాస్ మరియు గుల్బర్గా పాస్ అనే ఆరు చారిత్రక పాస్ లు ఈ పర్వత శ్రేణిలో ఉన్నాయి. ఎత్తైన పర్వత శ్రేణి తట్టకోటి. దీని ఎత్తు 15,524 అడుగులు (4,732 మీటర్లు). గుల్మార్గ్ సమీపంలో ఈ పరిధి యొక్క ఎత్తు 12,500 అడుగులు (3,800 మీటర్లు) ఉంటుంది.

Read Also: రోడ్లపై తిరుగుతున్న కరోనా దెయ్యాలు... ఇళ్లకే పరిమితమైన జనాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.