యాప్నగరం

Preeti Maske: వామ్మో.. ! 45 ఏళ్ల వయసులో రెండు వారాల్లో పాక్ బార్డర్ నుండి చైనా బార్డర్ వరకు సైకిల్ సవారీ

ప్రీతి మస్కే (Preeti Maske) అనే 45 ఏళ్ల మహిళ సైక్లింగ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న గుజరాత్ నుండి చైనా సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ వరకు కేవలం రెండు వారాల్లోనే సైకిల్‌ సవారీ చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 22 Nov 2022, 5:44 pm
పుణెకి చెందిన ప్రీతి మస్కే అనే వివాహిత 45 ఏళ్ల వయసులో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కేవలం రెండు వారాల్లోనే సైకిల్‌పై ఏడు రాష్ట్రాలను దాటుకుంటూ 3,955 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేశారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి మహిళా సైక్లిస్ట్‌గా (Solo Women Cyclist) ప్రపంచ రికార్డు నమోదుచేశారు. త్వరలో ఆమె గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోనున్నారు. ఆ వివారాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. (Photo credit: the_extreme_lady/Instagram)
Samayam Telugu preeti maske first women solo cyclist to ride from west to east of india
Preeti Maske: వామ్మో.. ! 45 ఏళ్ల వయసులో రెండు వారాల్లో పాక్ బార్డర్ నుండి చైనా బార్డర్ వరకు సైకిల్ సవారీ



​గుజరాత్ టు అరుణాచల్ ప్రదేశ్..

ప్రీతి నవంబర్ 1న గుజరాత్‌లోని కోటేశ్వర్ (పాక్ సరిహద్దు) వద్ద ఈ ప్రయాణం మొదలుపెట్టగా.. నవంబర్ 15న అరుణాచల్ ప్రదేశ్‌లోని కిబితు (చైనా సరిహద్దు) వద్ద యాత్రను పూర్తి చేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 1న 5:07 గంటలకు ఈ యాత్రను ప్రారంభించి నవంబర్ 15 అర్ధరాత్రి 12:19 గంటలకు పూర్తి చేశారు. దీంతో ఆమె కేవలం 13 రోజుల 19 గంటల 12 నిమిషాల్లో ఈ సాహస యాత్రను పూర్తి చేశారు. (Photo credit: the_extreme_lady/Instagram)

​వెన్నులో వణుకు పుట్టించే చలిలో..

ప్రీతి తన ప్రయాణానికి సంబంధించిన విషయాలన్నీ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే యాత్ర పూర్తయ్యాక ఆ వివరాలను కూడా తెలుపుతూ పోస్టులు పెట్టారు. అయితే, ఈ ప్రయాణంలో ఆమె పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శీతాకాలంలో వెన్నులో వణుకు పుట్టించే చలిలోనూ ఆమె ప్రయాణం కొనసాగించడం విశేషం. (Photo credit: the_extreme_lady/Instagram)

​డిప్రెషన్ పోగొట్టుకోడానికి మొదలెట్టి..

మొదట ప్రీతి ఐదేళ్ల క్రితం తనకున్న డిప్రెషన్‌ను పోగొట్టుకోడానికి సైక్లింగ్ చేయడం ప్రారంభించారు. తర్వాత దానిమీద ఇష్టంపెరిగి దూర ప్రాంతాలకు తొక్కడం మొదలెట్టారు. అలా మెల్లిమెల్లిగా సుదూర ప్రాంతాలు చేరుకుంటూ ఇప్పుడు ఇలా ప్రపంచ రికార్డు నెలకొల్పే స్థాయికి చేరుకున్నారు. 45 ఏళ్ల వయసులో ఇద్దరి పిల్లల తల్లిగా ఉంటూ ఈ రికార్డు నెలకొల్పడం నిజంగా గర్వించదగ్గ విషయం. (Photo credit: the_extreme_lady/Instagram)

​ఈ యాత్రకు ముందు ఇంకొన్ని..

అయితే, ఈ యాత్రకు ముందు ఆమె ఇదివరకే కొన్ని అద్భుతమైన సైకిల్ సవారీలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ నుండి పంజాబ్‌లోని అమృత్‌సర్ వరకు కేవలం ఐదు రోజుల ఐదు గంటల్లోనే సైక్లింగ్ చేశారు. అలాగే లేహ్-మనాలీ రోడ్డు మార్గంలో కేవలం 55 గంటల్లోనే 430 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. మరోవైపు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 17 రోజుల 17 గంటల్లో ఇంకో రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు భారత్‌లోని పశ్చిమ ప్రాంతం నుండి తూర్పు ప్రాంతం వరకు సైకిల్ యాత్ర పూర్తి చేశారు. (Photo credit: the_extreme_lady/Instagram)

​ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే..

ఇప్పుడు ఆమె అవయవదానంకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఈ యాత్రను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పి అందరి చేతా ప్రశంసలు పొందుతున్నారు. ఈ యాత్రకు సంబంధించిన ఫొటోలు, డాక్యుమెంట్లను వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ అసోసియేషన్‌తో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపామని ఆమె వెంట ఉన్న టీమ్ సభ్యుడు ఒకరు మీడియాకు తెలిపారు. దీంతో త్వరలోనే గిన్నీస్ బుక్ రికార్డ్స్‌లో ప్రీతి చోటు దక్కించుకుంటుందని తెలిపారు. (Photo credit: the_extreme_lady/Instagram)

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.