కరోనా వైరస్ (COVID-19) వ్యాప్తి కారణంగా చైనాలోని నివాసితులు కఠినమైన ఆంక్షల మధ్య చాలా వారాలు, హుబే ప్రావిన్స్ లో అయితే దాదాపు రెండు నెలలు ఇళ్లకే పరిమితమయ్యారు. గత ఏడాది ఈ ప్రాణాంతకమైన వైరస్ చైనాలో అత్యంత దూకుడుగా వ్యాప్తి చెందడంతో ప్రజలంతా నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు చైనా వూహాన్ నగరంలో ఈ వైరస్ వ్యాప్తి సున్నాకు వచ్చినట్లు నమ్ముతుంది. వూహాన్ లో ప్రస్తుత పరిస్థితి మెల్లగా సాధారణ స్థితికి వచ్చినట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది.
తాజా సమాచారం ప్రకారం... జనవరి చివరిలో వూహాన్ లో విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 8న పూర్తిగా ఎత్తివేయబడుతుంది. దీంతో ఆసియాలోని చాలా దేశాలు హుబే ప్రావిన్స్ పాస్ పోర్ట్ కలిగిన వారు కరోనావైరస్ ను మోసుకొస్తారనే భయంతో వారి రాకను త్వరితగతిన పరిమితం చేసాయి.
వూహాన్ నగరం వైరస్ దాడితో పోరాడుతున్నప్పుడు నగరం మరియు చుట్టు ప్రక్కల ఉన్న హుబే ప్రావిన్స్ లో సుమారు 56 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్ల లోపల పరిమితం చేయబడ్డారు. వారి ప్రయాణాలు అన్నీ నిలిపివేయబడ్డాయి.
Read Also: అవసరమైన పరిస్థితుల్లో ఈ పాస్ తో బయటకు వెళ్లొచ్చు
ఈ వైరస్ యొక్క హాట్ స్పాట్స్ గా మారిన ఇటలీ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వంటి దేశాలలో కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కేవలం ఈ దేశాలు మాత్రమే కాదు కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు లాక్ డౌన్ ను విధించాయి.
వూహాన్ లో ప్రజా జీవితం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నందున వైరస్ సోకిన వ్యక్తుల కేసులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో చైనా సంక్రమణ లక్షణాల సంఖ్యను ఇకపై వెల్లడించకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సోమవారం ఇక్కడి వ్యాపారం తిరిగి ప్రారంభం కాగా వచ్చే వారం లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయబడుతుంది. దుకాణాలు తెరుచుకున్నా ఒకే సారి అక్కడికి ఎంత మంది వెళ్లాలి అనే దానిపై పరిమితులు విధించడంతో వినియోగదారుల సంఖ్య తక్కువగా కనిపిస్తుంది. అదే విధంగా దుకాణదారులు వినియోగదారుల కోసం హ్యాండ్ శానిటైజర్లతో పాటు వారికి జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయో లేదో కూడా పరిశీలిస్తున్నారు.
Read Also: స్వీడన్ ఎందుకు లాక్ డౌన్ లో లేదో తెలుసా?
వూహాన్ ఉన్న హుబే ప్రావిన్స్ లో చాలా వరకు ప్రయాణ ఆంక్షలు మార్చి 23న ఎత్తివేయబడ్డాయి. అలాగే ప్రజలు వుహాన్ విడిచిపెట్టకుండా నిరోధించే పరిమితి ఏప్రిల్ 8తో ముగుస్తుంది.
తాజా సమాచారం ప్రకారం... జనవరి చివరిలో వూహాన్ లో విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 8న పూర్తిగా ఎత్తివేయబడుతుంది. దీంతో ఆసియాలోని చాలా దేశాలు హుబే ప్రావిన్స్ పాస్ పోర్ట్ కలిగిన వారు కరోనావైరస్ ను మోసుకొస్తారనే భయంతో వారి రాకను త్వరితగతిన పరిమితం చేసాయి.
వూహాన్ నగరం వైరస్ దాడితో పోరాడుతున్నప్పుడు నగరం మరియు చుట్టు ప్రక్కల ఉన్న హుబే ప్రావిన్స్ లో సుమారు 56 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్ల లోపల పరిమితం చేయబడ్డారు. వారి ప్రయాణాలు అన్నీ నిలిపివేయబడ్డాయి.
Read Also: అవసరమైన పరిస్థితుల్లో ఈ పాస్ తో బయటకు వెళ్లొచ్చు
ఈ వైరస్ యొక్క హాట్ స్పాట్స్ గా మారిన ఇటలీ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వంటి దేశాలలో కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కేవలం ఈ దేశాలు మాత్రమే కాదు కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు లాక్ డౌన్ ను విధించాయి.
వూహాన్ లో ప్రజా జీవితం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నందున వైరస్ సోకిన వ్యక్తుల కేసులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో చైనా సంక్రమణ లక్షణాల సంఖ్యను ఇకపై వెల్లడించకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సోమవారం ఇక్కడి వ్యాపారం తిరిగి ప్రారంభం కాగా వచ్చే వారం లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయబడుతుంది. దుకాణాలు తెరుచుకున్నా ఒకే సారి అక్కడికి ఎంత మంది వెళ్లాలి అనే దానిపై పరిమితులు విధించడంతో వినియోగదారుల సంఖ్య తక్కువగా కనిపిస్తుంది. అదే విధంగా దుకాణదారులు వినియోగదారుల కోసం హ్యాండ్ శానిటైజర్లతో పాటు వారికి జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయో లేదో కూడా పరిశీలిస్తున్నారు.
Read Also: స్వీడన్ ఎందుకు లాక్ డౌన్ లో లేదో తెలుసా?
వూహాన్ ఉన్న హుబే ప్రావిన్స్ లో చాలా వరకు ప్రయాణ ఆంక్షలు మార్చి 23న ఎత్తివేయబడ్డాయి. అలాగే ప్రజలు వుహాన్ విడిచిపెట్టకుండా నిరోధించే పరిమితి ఏప్రిల్ 8తో ముగుస్తుంది.