యాప్నగరం

నైనా దేవి ఆలయానికి చేరుకోవడం ఎలా? మూడు సులభమైన మార్గాలు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన శక్తిపీఠాల్లో ఒకటైన నైన దేవి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు.

Samayam Telugu 24 Feb 2020, 9:18 pm
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అత్యంత ఆకర్షణీమైన హిల్ స్టేషన్లలో నైనిటాల్ ఒకటి. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి అందాలతో పాటు సులభమైన ప్రయాణ సౌకర్యం కూడా ఉంది. ఈ పర్వత పట్టణంలో చాలా పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. ముఖ్యంగా నైని సరస్సు, నైనా దేవి ఆలయాలు ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందాయి. నైనా దేవి ఆలయాన్ని ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటిగా, ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా భక్తులు విశ్వసిస్తారు. పురాణల ప్రకారం మహాశివుడి భార్య అయిన సతీదేవి తనను తాను దహించుకుని మరణించినప్పుడు ఆమె కాలిన దేహాన్ని విష్ణువు తన సుదర్శన చక్రంతో ముక్కలు చేస్తాడు. ఆ శరీర భాగాలు భూమిపై వివిధ చోట్ల పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా అవతరించాయి.
Samayam Telugu నైనా దేవి ఆలయం


సతీదేవి యొక్క కళ్లు నైని సరస్సు ఒడ్డున పడ్డాయని నమ్ముతారు. ఇక్కడ ఒక పవిత్రమైన ఆలయాన్ని నిర్మించి ఎన్నో శతాబ్ధాలుగా భక్తులు దేవిని పూజిస్తున్నారు. నైనా దేవి నైనిటాల్ ప్రజల ప్రధాన ఆరాధ్య దేవత. ఆమె ఆలయం సరస్సు యొక్క ఉత్తర భాగంలో ఉంది. ఈ ఆలయానికి ఏడాది పొడవునా భక్తుల తాకిడి ఉంటుంది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. కాబట్టి ఈ ఉత్సవంలో మీరు పాల్గొనాలని అమ్మ ఆశీర్వాదం పొందాలని మీరు కోరుకుంటే మాత్రం మీ యాత్రను కొన్ని నెలల ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. మీరు నైనిటాల్ కు మొదటి సారిగా వెళ్లాలని కోరుకుంటే ఈ క్రింద ఇవ్వబడిన వివరాలు మీకు నైనా దేవి ఆలయానికి చేరుకునేందుకు సహాయపడతాయి.

Read Also: ప్రతి ఏటా పెరిగే స్పటిక శివలింగం... ఎక్కడ ఉందో తెలుసా

వాయు మార్గం:

నైనిటాల్ కు వాయు మార్గం ద్వారా రావాలనుకునే టూరిస్టులు పంత్ నగర్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ పోర్ట్ నుంచి ఆలయానికి 55 కిలోమీటర్ల దూరం. ఎయిర్ పోర్ట్ నుండి ట్యాక్సీలు సులభంగా అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం:

నైనా దేవి ఆలయానికి చేరుకోవడానికి రైలు మార్గం ద్వారా వచ్చే వారు కత్గోడమ్ రైల్వే స్టేషన్ లో దిగాలి. స్టేషన్ నుంచి ఆలయానికి 35 కిలోమీటర్ల దూరం. ఢిల్లీ, ఇతర మెట్రో నగరాల నుండి ఈ రైల్వే స్టేషన్ కు టూరిస్టులు సులభంగా చేరుకోవచ్చు. అక్కడ నుంచి ఆలయానికి చేరుకోవడానికి ట్యాక్సీలు, బస్సులు అందుబాటులో ఉంటాయి.

Read Also: కోరికలు తీర్చే మాతా ఘంటేశ్వరి ఆలయం... త్వరలో అరుదైన రికార్డు

రోడ్డు మార్గం:

నైనిటాల్ బస్టాండ్ నుంచి ఈ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరం. సైకిల్ రిక్షా లేదా ఆటో రిక్షాల ద్వారా సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి నైనిటాల్ కు బస్సులు నడుస్తుంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.