యాప్నగరం

వెల్లూరు - తిరువన్నమలై చూసొద్దామా!

తమిళనాడులోని వెల్లూరు - తిరువన్నమలై జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Samayam Telugu 10 Jul 2018, 5:36 pm
మిళనాడులోని వెల్లూరు - తిరువన్నమలై జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేలూరులోని బ్రిటీష్ ప్రభుత్వం నాటి కోట పర్యాటకులను ఆకట్టుకుంటోంది. బ్రిటీష్ పాలన సమయంలో టిప్పు సుల్తాన్ కుటుంబాన్ని, శ్రీలంక చివరి రాజైన విక్రమ రాజసింహాలను ఈ కోటలోనే బంధించారు. ఈ కోటలో చర్చి, మసీదు, ఆలయం కూడా ఉంది.
Samayam Telugu sssd


శ్రీపురం స్వర్ణ దేవాలయం: మలైకొడి అనే ప్రాంతంలోని శ్రీపురం మహాలక్ష్మీ స్వర్ణ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. బంగారు రేకులతో నిర్మించిన ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆలయాన్ని పై నుంచి చూస్తే నక్షత్రం ఆకారంలో ఉంటుంది. అలాగే వేలూరు కోటలోని జలకండీశ్రర్ ఆలయం అలనాటి శిల్పకళకు ప్రతిరూపంగా నిలుస్తుంది.

ఏలగిరి హిల్ స్టేషన్:
ముఖ్యంగా ఇక్కడి ఏలగిరి హిల్స్ వేసవి విడిదిగా ఆకట్టుకుంటోంది. తమిళనాడులో ఊటీ, కొడైకెనాల్ తర్వాత అత్యధిక పర్యాటకులను ఆకట్టుకునే హిల్‌స్టేషన్ ఇదే. సముద్రమట్టానికి 3,700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం ట్రెక్కింగ్, పేరా గ్లైడింగ్‌, రాక్ క్లైంబింగ్‌లకు ఫేమస్.

ఏలగిరిని ‘ఇలగిరి’ అని కూడా పిలుస్తారు. వలస రాజ్యంగా గుర్తించిన ఈ ప్రాంతం పూర్వం ఏలగిరి జమీందారు కుటుంబం ఆధీనంలో ఉండేది. 1950లో భారత ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. ఏలగిరిలోని పుంగనూర్‌ సరస్సు పర్యాటకును విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంకా ఇక్కడి పురాతన ఆలయాలు, మూలిక వనాలు, పండ్ల తోటుల సైతం విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడి టెలిస్కోప్ హౌస్ నుంచి పర్వతం చుట్టుపక్కల అందాలను కూడా వీక్షించవచ్చు. సంక్రాంతి సమయంలో ఈ ప్రాంతం చాలా సందడిగా ఉంటుంది.

ఈ ప్రాంతం చిత్తూరు జిల్లా కుప్పంకు కేవలం 65 కి.మీ దూరంలోనే ఉంది. కుప్ప నుంచి ఇక్కడికి జోలార్పెట్టయ్‌ జంక్షన్‌కు రైల్లో వెళ్లవచ్చు. అక్కడి నుంచి ఏలగిరి కేవలం 25 కిమీల దూరం మాత్రమే ఉంటుంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి జోలార్పెట్టయ్‌ జంక్షన్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

తిరువన్నమలై అష్టలింగాలు: వేలూరుకు 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నమలైయార్ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. తిరువన్నమలై పంచ భూత క్షేత్రాల్లో ఒకటి. ఇది అగ్నిని సూచిస్తుంది. 14 కిలోమీటర్ల పరిధిలో అరుణాచలం పర్వతం చుట్టూ.. ఎనిమిది లింగాలకు ఎనిమిది ఆలయాలు ఉన్నాయి.

అరుణాచల క్షేత్రం: ఈ ఆలయాన్ని చోళ రాజులు 9వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం గోపురాలు ఆకాశాన్ని తాకేంత పెద్దవి. ఇందులోని తూర్పు రాజ గోపురం 11 అంతస్థులతో 217 అడుగుల ఎత్తు ఉంటుంది. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీ కృష్ణ దేవరాయలు ఇక్కడ వెయ్యి స్తంబాల శాలను, కోనేటిని నిర్మించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.