బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం కష్టమే. అయితే, ఇండియన్ రైల్వే ప్రవేశపెడుతున్న.. ‘ట్రైన్ 18’ అనే రైలు మాత్రం త్వరలో పట్టాలపై దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇండియాలో తొలి ‘ఇంజిన్ లెస్’ రైలుగా.. ఇంజిన్తో పనిలేకుండా కేవలం కోచ్లతో మాత్రమే నడిచే ఈ రైలు.. గంటకు 160 కిమీల వేగంతో దూసుకెళ్తుంది.
ప్రస్తుతం ఇండియాలో అత్యంత వేగవంతమైన రైలు ఢిల్లీ - భూపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది గంటకు సుమారు 150 నుంచి 155 కిమీల వేగంతో దూసుకెళ్తుంది. ఈ వేగాన్ని తట్టుకోగలిగే సామర్థ్యం కేవలం ఢిల్లీ - భుపాల్ మధ్య ట్రాక్లకే ఉంది. ఈ నేపథ్యంలో ‘ట్రైన్ 18’ను ముందుగా ఈ రూట్లోనే నడపాలని నిర్ణయించారు.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)లో ఈ ట్రైన్ 18ను దేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరికల్లా ఈ రైలు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల తరహాలో ఈ రైలుకు ప్రత్యేకంగా లోకోమోటివ్ ఇంజిన్ ఉండదు. మెట్రో రైలు తరహాలో కేవలం లోకోపైలట్ క్యాబిన్ మాత్రమే ఉంటుంది. కోచ్లకు ఆటోమెటిక్ స్లైడ్ డోర్లు ఉంటాయి. కేవలం ప్లాట్ఫాంలు వచ్చినప్పుడు మాత్రమే ఇవి తెరుచుకుంటాయి. ఎల్ఈడీ స్క్రీన్లు, అధునాతన టాయిలెట్లు ఇంకా ఎన్నో హంగులతో ఈ రైలు సిద్ధమవుతోంది. ఇది విజయవంతమైతే మిగతా ప్రాంతాల్లో సైతం ‘ట్రైన్ 18’ రైళ్లను ఇంటర్ సిటీ రైళ్లుగా నడపాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఇండియాలో అత్యంత వేగవంతమైన రైలు ఢిల్లీ - భూపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది గంటకు సుమారు 150 నుంచి 155 కిమీల వేగంతో దూసుకెళ్తుంది. ఈ వేగాన్ని తట్టుకోగలిగే సామర్థ్యం కేవలం ఢిల్లీ - భుపాల్ మధ్య ట్రాక్లకే ఉంది. ఈ నేపథ్యంలో ‘ట్రైన్ 18’ను ముందుగా ఈ రూట్లోనే నడపాలని నిర్ణయించారు.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)లో ఈ ట్రైన్ 18ను దేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరికల్లా ఈ రైలు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల తరహాలో ఈ రైలుకు ప్రత్యేకంగా లోకోమోటివ్ ఇంజిన్ ఉండదు. మెట్రో రైలు తరహాలో కేవలం లోకోపైలట్ క్యాబిన్ మాత్రమే ఉంటుంది. కోచ్లకు ఆటోమెటిక్ స్లైడ్ డోర్లు ఉంటాయి. కేవలం ప్లాట్ఫాంలు వచ్చినప్పుడు మాత్రమే ఇవి తెరుచుకుంటాయి. ఎల్ఈడీ స్క్రీన్లు, అధునాతన టాయిలెట్లు ఇంకా ఎన్నో హంగులతో ఈ రైలు సిద్ధమవుతోంది. ఇది విజయవంతమైతే మిగతా ప్రాంతాల్లో సైతం ‘ట్రైన్ 18’ రైళ్లను ఇంటర్ సిటీ రైళ్లుగా నడపాలని ప్రభుత్వం భావిస్తోంది.