యాప్నగరం

ఏపీలోని మూడు నగరాల నుంచి షిరిడీకి విమాన సేవలు

సాయి భక్తులు ఇకపై విమానాల్లో నేరుగా షిరిడీ చేరుకోవచ్చు. ట్రూజెట్ విమానయాన సంస్థ త్వరలో విమాన సేవలను అందుబాటులోకి తేస్తోంది.

Samayam Telugu 15 Oct 2018, 9:17 pm
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. మహారాష్ట్రాలోని షిరిడీ వెళ్లే ప్రయాణికుల కోసం రాష్ట్రంలోని మూడు నగరాల్లో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. నవంబరు 15 నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ నగరాల నుంచి షిరిడీకి విమానాలను నడపనున్నట్లు ట్రూజెట్ విమానయాన సంస్థ సోమవారం ప్రకటించింది.
Samayam Telugu Untitled111aa


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి షిరిడీకి నేరుగా విమానాలు లేవు. షిరిడీలో గతేడాది విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఏపీ నుంచి విమాన సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించామని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి షిరిడీ వెళ్లాలంటే రైళ్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాయి భక్తులు ఇకపై విమానాల్లో తక్కువ సమయంలోనే షిరిడీకి చేరుకుని దర్శనం చేసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.