యాప్నగరం

విశాఖ జలాల్లో.. కలరా వ్యాధిని తగ్గించే చేప!

విశాఖ సమీపంలోని సాగర జలాల్లో కలరా వ్యాధిని అదుపులో ఉంచే చేపను పరిశోధకులు గుర్తించారు.

TNN 21 Aug 2017, 5:02 pm
విశాఖ సాగర జలాల్లో కలరా వ్యాధిని అదుపులో ఉంచే చేపను ఆంధ్రా యూనివర్సిటీలోని పరిశోధకులు గుర్తించారు. చిన్న ముక్కు ఉండే త్రిపాద చేపలో సూక్ష్మజీవులను చంపే గుణాలు ఉన్నాయని వారు తేల్చారు. ఈ చేపల్లోని కండర భాగ కణజాలం మానవుల్లో రోగాలకు కారణమైన సూక్ష్మజీవులను అంతమొందిస్తోందని పరిశోధకులు గుర్తించారు. ఈ-కొలి, సాల్మొనెల్లా టైఫీ, సుడోమోనాస్, విబిరో కలరా, స్టాఫీలోకోకస్ ఆరస్ అనే ఐదు రకాల బ్యాక్టీరియాలతో పోరాడే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వీటిలో ఉన్నాయని ఆంధ్రా యూనివర్సిటీలో పరిశోధనలు చేసిన ఎన్ఎం కృష్ణ, వి. గోవిందరావు తెలిపారు.
Samayam Telugu tripod fish along vizag coast can curb cholera
విశాఖ జలాల్లో.. కలరా వ్యాధిని తగ్గించే చేప!


సముద్ర జీవజాలంలో అనేక ఔషధ గుణాలు ఉండగా.. ఇప్పటి వరకూ వాటిపై పరిశోధనలు చేసింది తక్కువేనని పరిశోధకులు తెలిపారు. ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనల్లో.. సముద్ర జీవరాశిలో సూక్ష్మజీవులను మట్టుబెట్టే, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. కొన్ని పరిశోధనలు క్లినికల్ ట్రయల్స్ స్థాయిలో ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిశోధన విషయానికి వస్తే.. చిన్న ముక్కు ఉండే త్రిపాద చేపను పరీక్షించగా.. దాన్ని కండర భాగం మానవుల్లోని వ్యాధికారక సూక్ష్మజీవులతో పోరాడుతోందని తేలిందన్నారు.

ఎన్ఎం కృష్ణ ప్రస్తుతం సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా పని చేస్తున్నారు. గోవిందరావు ఆదికవి నన్నయ యూనివర్సీటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.