యాప్నగరం

Bigg Boss Telugu: హే గీతూ.. ఫస్ట్ సీడౌన్ అంటూ నాగార్జున సీరియస్.. గలాట గీతూ కన్నీళ్లు

ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో శ్రీహాన్ సేఫ్ అయ్యాడు. ఆ తరువాత గలాట గీతూపై నాగార్జున సీరియస్ అయ్యారు. ప్రతీ విషయంలో ఎందుకు ఇన్వాల్ అవుతున్నావంటూ మందలించారు. చంటికి సంబంధించిన వీడియోను చూపించి అందరికీ క్లారిటీ ఇచ్చారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 2 Oct 2022, 9:48 pm
బిగ్ బాస్ షో (Bigg Boss Telugu)లో సండే అంటే ఫండే అంటూ ఆదివారం నాగార్జున (Nagarjuna) వచ్చేశారు. దసరా స్పెషల్ ఎపిసోడ్ నిర్వహించారు. ఈ దసరా ఫెస్టివల్ షోను ఒకరిని సేవ్ చేసి ప్రారంభిద్దామని నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ చేత టెంకాయిలు కొట్టించారు. వాటిలో ఒక చీటి ఉంచి.. సేఫ్, అన్ సేఫ్ అని రాశారు. ఇందులో శ్రీహాన్‌కు సేఫ్ చీటి రావడంతో సేవ్ అయినట్లు ప్రకటించారు నాగార్జున. పండుగ చేసుకోవాలంటే మనసులోని బాధలోని క్లియర్ చేసుకోవాలని కీర్తితో చెప్పారు.
Samayam Telugu bigg boss telugu season 6
బిగ్ బాస్ తెలుగు


కీర్తి మాట్లాడుతూ.. చంటి తనను కెమెరా కోసం ఆడుతున్నానని అన్నాడో తెలియకుండా మాట్లాడానని చెప్పింది. ఈ విషయం కీర్తికి చెప్పిన గలాట గీతూ రిప్లై ఇస్తూ.. చంటి తప్పు ఉద్దేశంతోనే ఆ మాట అన్నాడని అంది. ఆ తరువాత ఆరోహి కూడా చంటిదే తప్పు అన్నట్లు మాట్లాడింది. ఆ తరువాత వీడియో చూపించి నాగార్జున క్లారిటీ ఇచ్చారు. అయినా తనకు నెగిటివ్‌గా మాట్లాడినట్లే అనిపిస్తుందని కీర్తి చెప్పింది. బాలాదిత్య చంటి పాజిటివ్ ఇంటెన్స్‌తో అన్నాడని సపోర్ట్ చేశాడు.

అయితే మధ్యలో గలాట గీతూ ఇన్వాల్ కావడంతో నాగార్జున సీరియస్ అయ్యారు. 'గీతూ వెయిట్.. ఫస్ట్ సీడౌన్.. హే నేను వాళ్లతో మాట్లాడుతున్నా.. నేను మిగతా వాళ్లతో మాట్లాడుతుంటే ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటావు. నీకు ఇది బాగా అలవాటు అయిపోయింది..' అంటూ ఫైర్ అయ్యారు. ఎవరో చెప్పిన విషయం విని కీర్తి ఒక నిర్ణయానికి వచ్చిందన్నారు. చంటి చెప్పిన మాటలను వివరంగా చెప్పి.. కీర్తి మైండ్‌ను క్లియర్ చేశారు. హౌస్ కూడా చంటికి సపోర్ట్ చేసింది. గీతూ మాత్రం చంటిదే తప్పు అని తేల్చిచెప్పింది. నాగార్జునతో గట్టిగా వాదించింది.

'నేను చంటితో మాట్లాడం మానేశా సార్. ఆయన నా మీద ఇగోతో తినడం మానేశాడు. నేను కూరగాయలు కట్ చేస్తున్నానని ఫుడ్ తినట్లేదు. నేను ఏం మాట్లాడాలి. నాకు చాలా బాధగా ఉంది. నాకు కలలోకి కూడా వచ్చింది. నేను ఉర్లగడ్డ కట్ చేస్తున్నానని తను తినట్లేదని నాతోనే చంటి అన్నాడు. అప్పుడు నాకు చాలా బాధేసింది. నేనేం విషం కలపట్లేదు..' అంటూ గలాట గీతూ కన్నీళ్లు పెట్టుకుంది. తాను ఒక పూటే అలా చేశానని చంటి క్లారిటీ ఇచ్చాడు. ఆ తరువాత గలాట గీతూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన బాధను చెప్పుకుంది. అవతలి వాళ్లు చెప్పిన మాటలు వినకండి.. మీరు చూసేందే నమ్మండంటూ వివాదాన్ని ముగించారు నాగార్జున. చివరికి చంటికి కీర్తి క్షమాపణలు చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.