ఈ సీజన్కి హోస్ట్ నాగార్జున అని కన్ఫామ్ కావడమే కాదు.. అందుకు సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో బిగ్ బాస్ సీజన్ 4 కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవైపు థియేటర్స్లో సినిమాలు లేకపోవడం.. లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లలోనే ఉండటంతో కాలక్షేపానికి సరైన ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్ కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే లాక్ డౌన్ వల్ల కట్టుదిట్టమైన ఏర్పాట్లతో బిగ్ బాస్ షో నిర్వహణకు కసరత్తులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈవారం చివర్లో లేదా వచ్చే వారం ప్రారంభంలో షో ఎప్పుడు ఏంటి అనే దానిపై క్లారిటీ ఇస్తూ సెకండ్ ప్రోమో విడుదల కానుంది. కరోనా నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4 గతంలో మాదిరి ఎక్కువ రోజుల నిర్వహించడం కుదరదని మొదట్లో వార్తలు వచ్చినా.. తాజా సమాచారం ప్రకారం ఈ షోని 106 రోజుల పాటు 16 సెలబ్రిటీలతో నిర్వహించనున్నారు.
ఇంతకీ బిగ్ బాస్ ప్రారంభం అయ్యేది ఎప్పుడూ అంటే.. ఈనెల 30న ముహూర్తం కుదిరనట్టు సమాచారం అందుతోంది. శని, ఆదివారాల్లో అయితే సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు రేటింగ్ వచ్చే అవకాశం ఉండటంతో ఆగష్టు 29 శనివారం వచ్చింది. అయితే ఆరోజు నాగార్జున పుట్టినరోజు కావడంతో ఆగష్టు 30 ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే నాగార్జున బర్త్ డే గిఫ్ట్గా శనివారం నాడు ప్రారంభించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఎలాగూ రికార్డెడ్ ప్రోగ్రామ్ కాబట్టి.. ముందుగానే షూటింగ్ ప్లాన్ చేసుకుని శనివారం నాడు అంటే ఆగష్టు 29 శనివారం నాడు బిగ్ బాస్ సీజన్ 4ని ప్రారంభించవచ్చు.
ఇక ఈ షో ఎలా ఉంటుంది.. కంటెస్టెంట్స్ ఎవరు.. తదితర విషయాల్లోకి వెళ్తే.. పూనమ్ భజ్వా, మంగ్లీ, నందు, సింగర్ నోయల్, ప్రియ వడ్లమాని, మెహబూబా దిల్ సే, మహాతల్లి, అఖిల్ సార్థక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు బబర్దస్త్ రాం ప్రసాద్ కూడా బిగ్ బాస్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పోతే.. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టంగా భద్రతా చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటికే 30 మంది కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేయగా.. వారిలో 16 మందిని ఫైనల్ చేయనున్నారు. అయితే ఆ మిగిలిన 14 మందిలో ఇద్దర్ని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్కి పంపే అవకాశం ఉంది. అయితే ఈ 30 మందికి కూడా కరోనా పరీక్షలు చేసి.. ఎలాంటి ఆరోగ్య పరమైన ఇబ్బందులు లేకపోతేనే హౌస్కి పంపేందుకు పర్యవేక్షణలో ఉంచినట్టు తెలుస్తోంది. కేవలం కంటెస్టెంట్స్కి మాత్రమే కాకుండా.. షోకి పనిచేసే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ టీం కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇక గత సీజన్లలలో శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జునతో పాటు కొంతమంది ఆడియన్స్ చప్పట్లు కొడుతూ కనిపించేవారు. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి బయట ఆడియన్స్ కనిపించే అవకాశం ఉండకపోవచ్చు. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా.. మొదట్లో సెలెక్ట్ చేసిన 30 మంది లిస్ట్లోని వారే హౌస్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక టాస్క్లలో భాగంగా కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల్ని హౌస్కి రప్పించడాలు కాని.. అలాగే గతంలో మాదిరి బయట వ్యక్తులు బిగ్ బాస్ హౌస్కి పంపించడం.. సినిమా ప్రమోషన్స్.. దొంగల టాస్క్ లాంటివి కనిపించకపోవచ్చు.
అన్నింటికీ మించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే గత సీజన్లలో కంటెస్టెంట్స్ బెడ్స్ అన్నీ పక్క పక్కనే ఉండేవి. ఒకే బెడ్పై ఇద్దరిద్దరు పడుకునేవారు.. అయితే ఈసారి భౌతికదూరం పాటిస్తూ ఎవరి బెడ్లు వారికి కేటాయించవచ్చు. అలాగే వంట, క్లీనింగ్, బయట నుంచి తీసుకుని వచ్చే వస్తువులు విషయంలో తగు జాగ్రత్తలు పాటించపోతే.. బిగ్ బాస్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే లాక్ డౌన్ వల్ల కట్టుదిట్టమైన ఏర్పాట్లతో బిగ్ బాస్ షో నిర్వహణకు కసరత్తులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈవారం చివర్లో లేదా వచ్చే వారం ప్రారంభంలో షో ఎప్పుడు ఏంటి అనే దానిపై క్లారిటీ ఇస్తూ సెకండ్ ప్రోమో విడుదల కానుంది. కరోనా నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4 గతంలో మాదిరి ఎక్కువ రోజుల నిర్వహించడం కుదరదని మొదట్లో వార్తలు వచ్చినా.. తాజా సమాచారం ప్రకారం ఈ షోని 106 రోజుల పాటు 16 సెలబ్రిటీలతో నిర్వహించనున్నారు.
ఇంతకీ బిగ్ బాస్ ప్రారంభం అయ్యేది ఎప్పుడూ అంటే.. ఈనెల 30న ముహూర్తం కుదిరనట్టు సమాచారం అందుతోంది. శని, ఆదివారాల్లో అయితే సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు రేటింగ్ వచ్చే అవకాశం ఉండటంతో ఆగష్టు 29 శనివారం వచ్చింది. అయితే ఆరోజు నాగార్జున పుట్టినరోజు కావడంతో ఆగష్టు 30 ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే నాగార్జున బర్త్ డే గిఫ్ట్గా శనివారం నాడు ప్రారంభించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఎలాగూ రికార్డెడ్ ప్రోగ్రామ్ కాబట్టి.. ముందుగానే షూటింగ్ ప్లాన్ చేసుకుని శనివారం నాడు అంటే ఆగష్టు 29 శనివారం నాడు బిగ్ బాస్ సీజన్ 4ని ప్రారంభించవచ్చు.
ఇక ఈ షో ఎలా ఉంటుంది.. కంటెస్టెంట్స్ ఎవరు.. తదితర విషయాల్లోకి వెళ్తే.. పూనమ్ భజ్వా, మంగ్లీ, నందు, సింగర్ నోయల్, ప్రియ వడ్లమాని, మెహబూబా దిల్ సే, మహాతల్లి, అఖిల్ సార్థక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు బబర్దస్త్ రాం ప్రసాద్ కూడా బిగ్ బాస్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పోతే.. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టంగా భద్రతా చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటికే 30 మంది కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేయగా.. వారిలో 16 మందిని ఫైనల్ చేయనున్నారు. అయితే ఆ మిగిలిన 14 మందిలో ఇద్దర్ని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్కి పంపే అవకాశం ఉంది. అయితే ఈ 30 మందికి కూడా కరోనా పరీక్షలు చేసి.. ఎలాంటి ఆరోగ్య పరమైన ఇబ్బందులు లేకపోతేనే హౌస్కి పంపేందుకు పర్యవేక్షణలో ఉంచినట్టు తెలుస్తోంది. కేవలం కంటెస్టెంట్స్కి మాత్రమే కాకుండా.. షోకి పనిచేసే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ టీం కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇక గత సీజన్లలలో శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జునతో పాటు కొంతమంది ఆడియన్స్ చప్పట్లు కొడుతూ కనిపించేవారు. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి బయట ఆడియన్స్ కనిపించే అవకాశం ఉండకపోవచ్చు. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా.. మొదట్లో సెలెక్ట్ చేసిన 30 మంది లిస్ట్లోని వారే హౌస్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక టాస్క్లలో భాగంగా కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల్ని హౌస్కి రప్పించడాలు కాని.. అలాగే గతంలో మాదిరి బయట వ్యక్తులు బిగ్ బాస్ హౌస్కి పంపించడం.. సినిమా ప్రమోషన్స్.. దొంగల టాస్క్ లాంటివి కనిపించకపోవచ్చు.
అన్నింటికీ మించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే గత సీజన్లలో కంటెస్టెంట్స్ బెడ్స్ అన్నీ పక్క పక్కనే ఉండేవి. ఒకే బెడ్పై ఇద్దరిద్దరు పడుకునేవారు.. అయితే ఈసారి భౌతికదూరం పాటిస్తూ ఎవరి బెడ్లు వారికి కేటాయించవచ్చు. అలాగే వంట, క్లీనింగ్, బయట నుంచి తీసుకుని వచ్చే వస్తువులు విషయంలో తగు జాగ్రత్తలు పాటించపోతే.. బిగ్ బాస్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.