యాప్నగరం

Neha Chowdary: బిగ్ బాస్ నుంచి నేహా ఎలిమినేషన్.. రేవంత్ వల్లే బయటకు వచ్చానంటూ ఫైర్

బిగ్ బాస్ షో (Big Boss Show) ఆదివారం ఎపిసోడ్ చప్పగానే సాగింది. అందరూ ముందే ఊహించినట్లు నేహా చౌదరి (Neha Chowdary) హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఆమె బయటకు వెళ్లే ముందు ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Authored byAshok Krindinti | Samayam Telugu 25 Sep 2022, 10:44 pm
బిగ్ బాస్ షో (Big Boss Show) ఆదివారం ఎపిసోడ్ వచ్చేసింది. నీ దూకుడు అనే సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున (Nagarjuna).. సుత్తి దెబ్బ అంటూ కంటెస్టెంట్స్‌తో ఓ టాస్క్‌కు ఇచ్చి షో మొదలుపెట్టారు. 'నోటి దుల' ఎవరికి అని ఆది రెడ్డిని అడగ్గా.. అతను గలాటా గీతూ తలపై కొట్టాడు. అందుకు ఆడియన్స్ అందరూ కూడా 'ఎస్' అని చెప్పారు. 'ఇంట్లో బ్రెయిన్ లెస్ పర్సన్ ఎవరు..' అని రోహిత్-మెరినా జంటను అడగ్గా.. రాజ్‌ను సెలక్ట్ చేశారు. అయితే ఎక్కువ మంది ఆడియన్స్ వాళ్ల నిర్ణయానికి నో చెప్పారు. 'హౌస్‌లో ఎవరు పని దొంగ..?' ఎవరు అని రాజ్‌ను అడగ్గా.. అతను రేవంత్‌ తలపై సుత్తితో కొట్టాడు. కానీ.. ఆడియన్స్ మాత్రం కాదన్నారు.
Samayam Telugu neha chowdary
నేహా చౌదరి


'హౌస్‌లో ఓవర్ డ్రామాటిక్ ఎవరు..?' అని రేవంత్‌ను అడగ్గా.. నేహ పేరు చెప్పాడు. ఆడియన్స్ మాత్రం నో చెప్పారు. ఈ సందర్భంగా పునుగుల పంచాయతీ తెరపైకి తెచ్చాడు నాగార్జున. మోస్ట్ ఎనోయింగ్ పర్సన్ ఎవరు..? అని నేహాను అడగ్గా.. గీతూ తలపై సుత్తితో కొట్టింది. ఆడియన్స్ నుంచి ఎక్కవ మంది నో చెప్పారు. హౌస్‌లో లూజర్ అని ఎవరు అడగ్గా.. రేవంత్‌ పేరు చెప్పింది గీతూ. ఆడియన్స్ అందరూ నో బోర్డు చూపించారు. ఇలా అందరితో ఈ గేమ్ ఆడించారు నాగార్జున.

ఆ తరువాత నామినేషన్‌లో ఉన్న వారికి ఎన్వలప్ కవర్లు ఇచ్చారు. అందులో ఎక్కువ డబ్బులు ఉన్న గలాట గీతూ, శ్రీహాన్ సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. మళ్లీ కాసేపు సుత్తి దెబ్బ ఆటను కంటిన్యూ చేశారు. ఇట్స్ టైమ్ టు సేఫ్ అంటూ.. నామినేషన్‌లో ఉన్న వారికి పౌచ్‌లు ఇచ్చి పచ్చ ఆకులు ఉన్న వారు సేవ్ అవుతారని చెప్పారు నాగార్జున. ఇనయ, రేవంత్ పౌచ్‌లలో ఉండడంతో వారిద్దరు సేఫ్ అయినట్లు తెలిపారు.

స్టో రూమ్‌ నుంచి కొన్ని జంతువుల పేర్లు ఉన్న బోర్డులు తెప్పించి.. వారిని హౌస్‌లో ఉన్న వారికి డేటికేట్ చేయాలని నాగార్జున చెప్పారు. ఊసరవెల్లి బోర్డును నేహాకు ఇచ్చింది గీతూ. ఎందుకు ఇస్తున్నానో కొన్ని కారణాలు చెప్పింది. నేహా కూడా గీతూను ఊసరవెల్లి అని చెప్పింది. రేవంత్‌కు గాడిద నేమ్ ప్లేట్ ఇచ్చాడు చలాకి చంటి. పాము బోర్డును అరోహికి రేవంత్ ఇచ్చాడు. ఎందుకు పాము అంటున్నానో కారణాలు చెప్పాడు. ఇలా ఇతర హౌస్‌మెంట్స్‌కు ఒక్కో జంతువుకు సంబంధించిన బోర్డులు ఇస్తూ.. అందుకు గల కారణాలను చెప్పారు.

ఆ తరువాత నామినేషన్స్‌లో వారికి పేపర్ రోల్ ఇచ్చి.. గ్రీన్ బ్లాక్ ఉన్న వాళ్లు సేఫ్ అవుతారని చెప్పారు. బాలాదిత్య, ఆరోహికి గ్రీన్ బ్లాక్ రావడంతో వారిద్దరూ సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఆ తరువాత హౌస్‌మెట్స్‌ను రెండు టీమ్‌లుగా విభజించి ఓ గేమ్ ఆడించారు నాగార్జున. సెలబ్రిటీల ఫొటోలను చూపించి.. కంటెస్టెంట్స్‌తో గేస్ చేయించారు. అనంతరం నామినేషన్స్‌లో ఉన్న చంటి, వాసంతి, నేహాలతో చంటి సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

చివరికి నామినేషన్‌లో నేహా, వాసంతి మిగిలిపోయారు. స్టేజ్‌పై ఓ తులాభారం ఏర్పాటు చేసి.. అందులో ఇద్దరి ఫొటోలను ఉంచారు. వెయిట్ తక్కువ వచ్చిన వారు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పారు. నేహాకు వెయిట్ తక్కువ రావడంతో ఆమెను ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. వాసంతి సేఫ్ అయినట్లు తెలిపారు. నేహా చౌదరిని స్టేజ్‌పైకి పిలిచి.. ఆమె జర్నీని చూపించారు.

ఆమెకు స్టేజ్‌పై ఓ టాస్క్ ఇచ్చారు నాగార్జున. హౌస్‌లో దమ్మున్న వారు ఎవరు..? ఎవరు దుమ్ము..? అని అడిగారు. ఇనయ, రేవంత్, ఆరోహి, గీతూ, వాసంతిలను దుమ్ముగా సెలక్ట్ చేసింది. వీళ్లందరూ జెన్యూన్‌గా లేరంది. రేవంత్ వల్లే తాను ఇక్కడ ఉన్నానంది. చంటి, శ్రీసత్య, రాజ్, సుదీప, శ్రీహాన్, బాలాదిత్య, ఆదిరెడ్డిలను దమ్ము ఉన్న కంటెస్టెంట్లు అని తెలిపింది నేహా.
View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha)

అందరి గురించి చెప్పుకుంటూ వచ్చిన నేహా.. రాజ్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. రాజ్ తనకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడని చెప్పింది. అతను బయటకు వచ్చిన తరువాత తానే బాడీ గార్డుగా ఉంటానంది. తరువాత హౌస్‌మెట్స్‌కు టాటా చెప్పేసి.. బిగ్ బాస్ షో నుంచి వెళ్లిపోయింది. ఇక చివరగా రేపటి ప్రోమో కూడా చూపించారు. నామినేషన్స్ కోసం హౌస్‌మెట్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.