యాప్నగరం

TV 9 Devi: నా పొలంలో లక్ష మొలకలొచ్చాయ్ రోయ్: దేవి నాగవల్లి, దారుణమైన కామెంట్స్

బిగ్ బాస్ తరువాత టీవీ 9 యాంకర్ దేవినాగవల్లి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ తన ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది దేవి.

Samayam Telugu 4 Jan 2021, 9:27 am
కామెడీ స్కిట్స్, సినిమాల ప్రభావమో లేక.. టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి లాంటి యాంకర్ల వార్తల్లోని ప్రాసల ప్రభావమో తెలియదు కానీ.. ఏవిషయం అయినా అందులోని ద్వందార్థాన్ని వెతికిపడుతున్నారు నెటిజన్లు. ఏ ప్రాసల కోసం పాకులాడి వార్తని వార్తలా కాకుండా వెటకారం జోడిస్తున్నారో.. ఇప్పుడు ఈ వెటకారమే యాంకర్ల మెడకు చుట్టుకుంటుంది. ట్రోల్ అయ్యేట్టు చేస్తుంది. తాజాగా దేవి నాగవల్లి చేసిన పోస్ట్‌పై ద్వందార్థాలు తీస్తూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు ఆ వివరాల్లోకి వెళ్తే..
Samayam Telugu దేవి నాగవల్లి
devi nagavalli instagram


టీవీ 9 యాంకర్‌గా అందరికీ సుపరిచితమైన దేవి నాగవల్లి.. బిగ్ సీజన్ 4 కంటెస్టెంట్‌గా తనలోకి కొత్త కోణాన్ని చూపించింది. హౌస్‌లో ఉన్నది మూడు వారాలే అయినా.. తనలోని మల్టీ టాలెంట్‌ను చూపించి టీవీ 9 యాంకర్ దేవి వేరు.. బిగ్ బాస్ దేవి నాగవల్లి వేరు అన్నట్టుగా అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది.

బిగ్ బాస్‌కి లేడీ బిగ్ బాస్ అవుతానంటూ హౌస్‌లోకి అడుగుపెట్టిన దేవి నాగవల్లి తొలి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా సత్తా చూపించింది. అయితే జనంలో దేవి నాగవల్లి బాగా ఆడుతుందనే అభిప్రాయం ఏర్పడినా.. బిగ్ బాస్ మాత్రం ఆమెను మూడో వారంలోనే హౌస్ నుంచి బయటకు పంపి షాక్ ఇచ్చారు. ఒక బలమైన కంటెస్టెంట్‌ను బయటకు పంపారనే విమర్శలు దేవి నాగవల్లి ఎలిమినేషన్ సందర్భంగా గట్టిగానే వినిపించాయి.

మొత్తానికి బిగ్ బాస్ ఆటలో ఓడిపోయినా.. కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది దేవి నాగవల్లి. ఆమె పనిచేస్తున్న చేస్తున్న ఛానల్‌పై ఉన్న వ్యతిరేకత ఆమె ఓటమికి కారణం అయ్యిందనే విమర్శలు వినిపించినా.. దేవి అయితే మంచి పేరుతోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది.


ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తరువాత దేవి నాగవల్లి క్రేజ్ ఒక్కసారిగా పెరగడంతో సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఇన్ స్టాగ్రామ్‌లో 100K (లక్ష) ఫాలోవర్స్ రావడంతో కాస్త అత్యుత్సాహం చూపిస్తూ ‘నా పొలంలో లక్ష మొలకలొచ్చాయ్ రోయ్’!! అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఆమెను అభినందిస్తూ ఆమె ఫాలోవర్స్ కొంతమంది కంట్రాట్స్ చెప్తుండగా.. మరికొంతమంది డబుల్ మీనింగ్ మెసేజ్‌లతో రెచ్చిపోయారు.

అయితే 100K (లక్ష) ఫాలోవర్స్ ఓకే కానీ ఆ కామెంట్ ఏంటి తల్లీ.. తెలిసి రాస్తారో..తెలియక రాస్తారో...కావాలనే ఇలా రాస్తారో అర్థం కాదు.. అందులోని ద్వందార్ధాన్ని లాగడం మొదలుపెట్టారు.

ఏది ఏమైనా మీ మొలకలకు శుభాకాంక్షలు మేడమ్.. ఇంకా ఎక్కువ అవుతాయేమో.. ఇంతకీ పొలంలో పంట ఎప్పుడు పండిస్తావ్ మరి?? విత్తనాలు ఎవరు వేశారు?? ఆ మొలకల్లో నేనూ ఉన్నా అండి.. అంటూ డబుల్ మీనింగ్ మెసేజ్‌లు పెడుతున్నారు నెటిజన్లు.

Read Also: ‘కార్తీకదీపం’ జనవరి 4 ఎపిసోడ్: మౌనిత చావుకి కౌంట్ డౌన్ స్టార్ట్.. పాత అంజి బయటకొచ్చాడు.. చావు భయంతో మౌనిత
View this post on Instagram A post shared by Devi Nagavalli (@devi_nagavalli)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.