బిగ్ బాస్ షో చూసే వాళ్లకి ముందు నుంచి డౌటానుమానాలు అనేకం. అసలు ఈ కంటెస్టెంట్స్ ఎంపిక దగ్గర నుంచి.. విన్నర్ని ప్రకటించేవరకూ అన్నీ డౌటానుమానాలే. కంటెస్టెంట్ ఎంపిక ఎలా చేస్తారన్నదే ప్రత్యేకించి ప్రాసెస్ ఏమీ ఉండదు. ఉన్నా బయటకు చెప్పరు. ఇక ఈ సీజన్ అయితే కామన్మేన్ కేటగిరీ ఉంటుందని చెప్పి.. చివరికి ఫేమస్ యూట్యూబర్ అయిన ఆదిరెడ్డిని కామన్మేన్ కోటాలో భర్తీ చేశారు. మరి అప్లికేషన్లు పెట్టి.. ఆడిషన్స్కి వెళ్లిన వాళ్ల పరిస్థితి ఏంటి అంటే.. గోవిందా. తూర్పు తిరిగి దండం పెట్టాల్సిన పరిస్థితి. ఓటింగ్ పేరుతో ప్రతివారం ఎలాగైనా జిమ్ముక్కులు చేస్తారో ఈ సెలక్షన్స్ విషయంలో కూడా అవే జిమ్మిక్కులన్నమాట.
ఇక ఎలిమినేషన్స్.. నామినేషన్స్.. ఓటింగ్.. విన్నర్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇలా ప్రతీదీ రహస్యమే. ఏదీ కూడా జెన్యూన్ సెలక్షన్ అనిపించదు. ఉన్నట్టుండి బాగా ఆడేవాళ్లని పంపేస్తుంటారు.. కొత్త వాళ్లని తీసుకొస్తుంటారు.. ఈ కంటెస్టెంట్స్లో చాలామంది రికమండేషన్ కంటెస్టెంట్లు ఉంటారండోయ్. వారి వారి పరిచయాలను బట్టి బిగ్ బాస్ హౌస్ తలుపుతడుతుంటారనేది బయట ఉన్న టాక్.
వాళ్ల షో వాళ్ల ఇష్టం.. ఇష్టమొచ్చినోళ్లను ఉంచుకుంటారు.. కష్టం అనుకున్నవాళ్లని పంపేస్తారు. ఇక ఓటింగ్ అంటారా? అది కూడా మమ అనుకుని వదిలేద్దాం.. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం.. సీజన్ 6లో కొత్తగా కనిపించేది ఏంటంటే.. శని-ఆదివారాల్లో నాగార్జున వచ్చినప్పుడు కొంతమంది ఆడియన్స్ స్టేజ్ ముందు చప్పట్లు కొడుతూ ఉన్నారు. వాళ్లని అడిగే ఇంట్లో వాళ్లు ఎలా ఆడుతున్నారు? వాళ్లు ఏం చేస్తున్నారన్నదానిపై వాళ్ల ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు. ఆడియన్స్ నిర్ణయమే ఫైనల్ అని కూడా అంటున్నారు నాగార్జున.
ఇలా ఆడియన్స్గా వెళ్లిన వాళ్లతో మాట్లాడిస్తున్నారు.. వాళ్లు కూడా టీవీలో కనిపిస్తున్నారు. దీంతో చాలామంది ఆడియన్స్గా బిగ్ బాస్ షోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. అసలు నాగార్జున ముందు కూర్చునే వాళ్లు జన్యూన్ ఆడియన్సే కాదట. వాళ్లు కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సెట్టింగ్లో భాగంగా పెయిడ్ ఆర్టిస్ట్లను ఆడియన్స్గా చూపిస్తున్నారనే టాక్ నడుస్తోంది.
నిప్పు లేనిదే పొగరాదు.. ఆడియన్స్ అంటూ బిల్డప్ కొడుకున్న వాళ్లలో చాలామంది పెయిడ్ ఆర్టిస్ట్లు ఉన్నారట. దీనిపై ట్రోలింగ్ కూడా నడుస్తోంది. ఆదివారం నాడు శ్రీముఖి హోస్ట్ చేసిన స్టార్ మా పరివార్లో కూడా గెస్ట్లే కాకుండా కొంతమంది బయట నుంచి ఆడియన్స్ కూడా హాజరు అయ్యారు. ఆ ఆడియన్స్లో ఓ అమ్మాయి క్లోజ్లు పదే పదే వేశారు.
అరే ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉందబ్బా.. అనుకుంటే అసలు విషయం బయటకు వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కాదు.. అంతకు ముందు వారంలో బిగ్ బాస్కి వెళ్లింది ఈమెనే. వెళ్లడమే కాదు.. ఆమెకు మైక్ ఇచ్చి మాట్లాడించారు కూడా. శ్రీ సత్యకి.. అర్జున్ కళ్యాణ్కి మధ్య సంథింగ్ సంథింగ్ అని ఈమె ద్వారానే మాట్లాడించారు.
అంటే ఇప్పుడు బిగ్ బాస్లో వస్తున్న ఆడియన్స్ కానీ.. వాళ్లు అడిగే ప్రశ్నలు కానీ.. నాగార్జున అడిగే ప్రశ్నలకు సమాధానాలు కానీ.. ఆడియన్స్ ఇచ్చేవి కాదన్నమాట. అదంతా స్క్రిప్టెట్. బిగ్ బాస్ వాళ్లు ఏం చెప్తే వాళ్లు అదే చేస్తున్నారని.. వాళ్లంతా జన్యూన్ ఆడియన్స్ కాదని.. పెయిడ్ ఆర్టిస్ట్లను సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. అయితే అందరూ అలా కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్లలో జెన్యూన్ ఆడియన్స్ కూడా ఉండి ఉండొచ్చు. కాలేజ్ స్టూడెంట్స్తో పాటు.. బిగ్ బాస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే కొంతమందిని సెలెక్ట్ చేసి ఆడియన్స్గా తీసుకుని వెళ్తున్నారనేది మన దగ్గరున్న సమాచారం. అసలు వాస్తవం ఏంటనేది తెలియాల్సిఉంది.
ఇక ఎలిమినేషన్స్.. నామినేషన్స్.. ఓటింగ్.. విన్నర్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇలా ప్రతీదీ రహస్యమే. ఏదీ కూడా జెన్యూన్ సెలక్షన్ అనిపించదు. ఉన్నట్టుండి బాగా ఆడేవాళ్లని పంపేస్తుంటారు.. కొత్త వాళ్లని తీసుకొస్తుంటారు.. ఈ కంటెస్టెంట్స్లో చాలామంది రికమండేషన్ కంటెస్టెంట్లు ఉంటారండోయ్. వారి వారి పరిచయాలను బట్టి బిగ్ బాస్ హౌస్ తలుపుతడుతుంటారనేది బయట ఉన్న టాక్.
వాళ్ల షో వాళ్ల ఇష్టం.. ఇష్టమొచ్చినోళ్లను ఉంచుకుంటారు.. కష్టం అనుకున్నవాళ్లని పంపేస్తారు. ఇక ఓటింగ్ అంటారా? అది కూడా మమ అనుకుని వదిలేద్దాం.. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం.. సీజన్ 6లో కొత్తగా కనిపించేది ఏంటంటే.. శని-ఆదివారాల్లో నాగార్జున వచ్చినప్పుడు కొంతమంది ఆడియన్స్ స్టేజ్ ముందు చప్పట్లు కొడుతూ ఉన్నారు. వాళ్లని అడిగే ఇంట్లో వాళ్లు ఎలా ఆడుతున్నారు? వాళ్లు ఏం చేస్తున్నారన్నదానిపై వాళ్ల ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు. ఆడియన్స్ నిర్ణయమే ఫైనల్ అని కూడా అంటున్నారు నాగార్జున.
ఇలా ఆడియన్స్గా వెళ్లిన వాళ్లతో మాట్లాడిస్తున్నారు.. వాళ్లు కూడా టీవీలో కనిపిస్తున్నారు. దీంతో చాలామంది ఆడియన్స్గా బిగ్ బాస్ షోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. అసలు నాగార్జున ముందు కూర్చునే వాళ్లు జన్యూన్ ఆడియన్సే కాదట. వాళ్లు కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సెట్టింగ్లో భాగంగా పెయిడ్ ఆర్టిస్ట్లను ఆడియన్స్గా చూపిస్తున్నారనే టాక్ నడుస్తోంది.
నిప్పు లేనిదే పొగరాదు.. ఆడియన్స్ అంటూ బిల్డప్ కొడుకున్న వాళ్లలో చాలామంది పెయిడ్ ఆర్టిస్ట్లు ఉన్నారట. దీనిపై ట్రోలింగ్ కూడా నడుస్తోంది. ఆదివారం నాడు శ్రీముఖి హోస్ట్ చేసిన స్టార్ మా పరివార్లో కూడా గెస్ట్లే కాకుండా కొంతమంది బయట నుంచి ఆడియన్స్ కూడా హాజరు అయ్యారు. ఆ ఆడియన్స్లో ఓ అమ్మాయి క్లోజ్లు పదే పదే వేశారు.
అరే ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉందబ్బా.. అనుకుంటే అసలు విషయం బయటకు వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కాదు.. అంతకు ముందు వారంలో బిగ్ బాస్కి వెళ్లింది ఈమెనే. వెళ్లడమే కాదు.. ఆమెకు మైక్ ఇచ్చి మాట్లాడించారు కూడా. శ్రీ సత్యకి.. అర్జున్ కళ్యాణ్కి మధ్య సంథింగ్ సంథింగ్ అని ఈమె ద్వారానే మాట్లాడించారు.
అంటే ఇప్పుడు బిగ్ బాస్లో వస్తున్న ఆడియన్స్ కానీ.. వాళ్లు అడిగే ప్రశ్నలు కానీ.. నాగార్జున అడిగే ప్రశ్నలకు సమాధానాలు కానీ.. ఆడియన్స్ ఇచ్చేవి కాదన్నమాట. అదంతా స్క్రిప్టెట్. బిగ్ బాస్ వాళ్లు ఏం చెప్తే వాళ్లు అదే చేస్తున్నారని.. వాళ్లంతా జన్యూన్ ఆడియన్స్ కాదని.. పెయిడ్ ఆర్టిస్ట్లను సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. అయితే అందరూ అలా కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్లలో జెన్యూన్ ఆడియన్స్ కూడా ఉండి ఉండొచ్చు. కాలేజ్ స్టూడెంట్స్తో పాటు.. బిగ్ బాస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే కొంతమందిని సెలెక్ట్ చేసి ఆడియన్స్గా తీసుకుని వెళ్తున్నారనేది మన దగ్గరున్న సమాచారం. అసలు వాస్తవం ఏంటనేది తెలియాల్సిఉంది.