బిగ్బాస్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 2’ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. నాని హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం 16 మంది సెలబ్రిటీలతో 100 రోజుల పాటు బుల్లితెరపై ఎంటర్టైన్ చేయనుంది. ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపధ్యంలో ప్రముఖ టీవీ చానల్ యాంకర్ ఫేస్ బుక్ ద్వారా కొంత క్లారిటీ ఇచ్చింది.
టీవీ 9లో ప్రతిరోజు ‘ఏది రియల్.. ఏది వైరల్’ అంటూ ఫుల్ జోష్లో ప్రోమోలు వదులుతూ.. చర్చా కార్యక్రమాల ద్వారా సీరియస్ కంటెంట్ను సైతం స్మైలీ ఫేస్తో ప్రజెంట్ చేసే దీప్తి నల్లమోత ప్రస్తుతం విజయవాడ నుండి రిపోర్టింగ్ అందిస్తూ ఉంటారు. ఇంతకు ముందు సినిమాల్లోనూ నటించిన అనుభవం ఉండటంతో ఆ అనుభవాన్ని న్యూస్ ప్రజెంటేషన్లో సైతం విరివిగా వాడేస్తూ.. కొత్త ట్రెండ్ సృష్టించింది దీప్తి.
ఇక గత కొంతకాలంగా బిగ్బాస్ 2లో దీప్తి పాల్గొనబోతుందంటూ ప్రచారం నడుస్తుండగా.. ఆమె ఫేస్ బుక్లో ‘ఈరోజు రాత్రి 9 గంటలకు ఏమైనా జరగొచ్చు’ అంటూ కామెంట్ చేస్తూ ఫోటోను షేర్ చేశారు. దీంతో ఫేస్ బుక్లో ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ.. మీ నవ్వుకే టైటిల్ వచ్చేస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు దీప్తి ఫాలోవర్స్. ఇక ‘ఏది రియల్ ఏది వైరల్’ అంటూ బుల్లితెరపై సందడి చేసేది నిజంగా రియల్నా? లేక వైరల్ కోసమే ఈ పోస్ట్ పెట్టిందా అన్నది ఈ రోజు రాత్రి 9 గంటలకు తేలిపోనుంది.
టీవీ 9లో ప్రతిరోజు ‘ఏది రియల్.. ఏది వైరల్’ అంటూ ఫుల్ జోష్లో ప్రోమోలు వదులుతూ.. చర్చా కార్యక్రమాల ద్వారా సీరియస్ కంటెంట్ను సైతం స్మైలీ ఫేస్తో ప్రజెంట్ చేసే దీప్తి నల్లమోత ప్రస్తుతం విజయవాడ నుండి రిపోర్టింగ్ అందిస్తూ ఉంటారు. ఇంతకు ముందు సినిమాల్లోనూ నటించిన అనుభవం ఉండటంతో ఆ అనుభవాన్ని న్యూస్ ప్రజెంటేషన్లో సైతం విరివిగా వాడేస్తూ.. కొత్త ట్రెండ్ సృష్టించింది దీప్తి.