యాప్నగరం

రాజీవ్ కనకాల ఎమోషనల్ పోస్ట్! ‘మనిషి దూరం ఐతే తప్ప విలువ తెలీదు’

ప్రముఖ సినీ నటుడు రాజీవ్‌ కనకాల భావోద్వేగానికి గురయ్యారు. తన మనసులోని బాధని అభిమానులతో పంచుకుంటూ.. ఎమోషనల్ పోస్ట్ ఒకటి షేర్ చేసుకున్నారు.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 4 Aug 2020, 8:21 pm
బంధాలు, అనుబంధాలు ఎంత గొప్పగా ఉంటాయో.. అవి దూరమైనప్పుడు అంతే బాధగా, భారంగా అనుక్షణం కంటతడిపెట్టిస్తాయి. ఆ దూరమైన బంధాలు తోడబుట్టిన రక్తసంబంధాలైతే ఆ బాధ వర్ణనాతీతం. తల్లి, తండ్రి, చెల్లి.. ఇలా రాజీవ్ కనకాల ఇంట్లో వరుస మరణాలతో గత కొంత కాలంగా విషాద ఛాయలు అలుముకున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu రాజీవ్ కనకాల ఎమోషనల్ పోస్ట్
rajiv kanakala emotional post


రాజీవ్ చెల్లెలు శ్రీలక్ష్మీ కనకాల(40) చిన్నవయసులోనే రొమ్ముక్యాన్సర్‌తో ఈ లాక్ డౌన్ సమయంలోనే కన్ను మూశారు. ఆ సమయంలో లాక్ డౌన్ నిబంధనలు కారణంగా రాజీవ్ కనకాల ఇంటికి ఎవ్వరూ రావ్వద్దని.. రాజీవ్ స్నేహితుడు నటుడు హర్ష వర్థన్ ప్రకటించడంతో అంతా సామాజిక మాధ్యమాల సాయంతోనే సానుభూతి తెలిపారు. అయితే నిన్ను(ఆగస్ట్ 3) రాఖీపౌర్ణమి కావడంతో.. తన చెల్లెలు శ్రీలక్ష్మిని తలుచుకుంటూ రాజీవ్ కనకాల ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అందులో ఇలా తన బాధని వెల్లగక్కారు.

‘నా సోదరి నాపై చూపించే అనురాగానికి విలువ కట్టలేను. ప్రతి రాఖీ పౌర్ణమి రోజున తను నాకు రాఖీ కడుతుంటే అప్పుడు నాకు ఆ విలువ తెలిసేది కాదు. నిజమేనేమో, ఎవరైనా మనకు దూరం ఐతే తప్ప ఆ విలువ తెలీదు కావచ్చు. ఈ రాఖీ పౌర్ణమికి నా చెల్లెలు లేని లోటు నేను మాటలో చెప్పలేను.’ అంటూ భావోద్వేగ పోస్ట్‌ని అభిమానులతో పంచుకున్నారు రాజీవ్ కనకాల. దీంతో పలువురు నెటిజన్లు.. ‘మీ చెల్లి ఏ లోకంలో ఉన్న మిమ్మల్నీ చూస్తూనే ఉంటుంది. ఆ బాధ మాటల్లో చెప్పలేం. తోబుట్టువులు అంటే క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవ్వరుంటారు?’ అంటూ స్పందనలు తెలియజేస్తున్నారు.
View this post on Instagram నా సోదరి నాపై చూపించే అనురాగానికి విలువ కట్టలేను. ప్రతి రాఖీ పౌర్ణమి రోజున తను నాకు రాఖీ కడ్తుంటే అప్పుడు నాకు ఆ విలువ తెలిసేది కాదు. నిజమేనేమో, ఎవరైనా మనకు దూరం ఐతే తప్ప ఆ విలువ తెలీదు కావచ్చు. ఈ రాఖీ పౌర్ణమికి నా చెల్లెలు లేని లోటు నేను మాటలో చెప్పలేను. Happy RakshaBandhan to all ☺️ #RakshaBandhan #RajeevKanakala #SriLaxmi #brothersister A post shared by Rajeev Kanakala (@rajakanakala) on Aug 3, 2020 at 1:10am PDT
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.