యాప్నగరం

‘ప్లీజ్ దేవా నన్ను వదిలేయ్’.. ఆఖరి క్షణాల్లో దేవరాజ్‌ను వేడుకున్న శ్రావణి

తనతో గంటసేపు గడపాలంటూ దేవరాజ్ శ్రావణని బెదిరించిన ఆడియో లీక్‌తో అతడు మరిన్ని చిక్కుల్లో పడ్డాడు. తనను వదిలేయాలంటూ శ్రావణి వేడుకుంటున్నట్లు ఆడియోలో స్పష్టంగా ఉంది.

Samayam Telugu 10 Sep 2020, 9:29 am
తెలుగు సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు గంటకో మలుపు తిరుగుతోంది. శ్రావణి మరణానికి దేవరాజ్‌రెడ్డి కారణమంటూ కుటుంబసభ్యులు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. అయితే శ్రావణి ఆత్మహత్యకు సాయి అనే యువకుడే కారణమంటూ ఓ ఆడియో లీక్ చేశాడు. మరోవైపు దేవరాజ్-శ్రావణి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి బుధవారం సాయంత్రం లీకైన్ ఆడియో కలకం రేపుతోంది. అందులో శ్రావణని అతడు బెదిరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Samayam Telugu శ్రావణి, దేవరాజ్(ఫైల్ ఫోటోస్)


Also Read: టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు అతడే కారణం.. నేను కాదు: టిక్ టాక్ దేవరాజ్ సంచలన ఆరోపణలు
మర్యాదగా వచ్చి తనతో గంటసేపు గడపాలని దేవరాజ్ బ్లాక్‌మెయిల్ చేయగా... ‘ఇంతటితో అన్నీ ఆపేయ్‌.. నీతో మాట్లాడను దేవా’ అంటూ శ్రావణి ప్రాధేయ పడినట్టు ఆ సంభాషణలో ఉంది. తాజా ఆడియో లీక్‌తో దేవరాజ్‌కు ఉచ్చు మరింత బిగుసుకున్నట్లు తెలుస్తోంది. శ్రావణి గతంలోనే అతడిపై బెదిరింపులు, అత్యాచారయత్నం కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న దేవరాజ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పిన మహిళా నేత.. షాకింగ్ రిప్లయ్

మరోవైపు ఈ కేసులో వెలుగులోకి వచ్చిన సాయి కృష్ణారెడ్డి అనే యువకుడు దేవరాజ్ ఆరోపణలపై స్పందించాడు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమని, శ్రావణి కుటుంబానికి తాను స్నేహితుడినని, ఆమెను ఎప్పుడూ బెదిరించలేదని చెప్పాడు. ఆమె కుటుంబంతో తనకు మంచి అనుబంధముందని, తాను ఎక్కడికీ పారిపోలేదని చెప్పాడు.

Also Read: సూపర్‌స్టార్ అభిమానులకు బిగ్‌ న్యూస్.. షూటింగ్ షురూ చేసిన మహేశ్‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.