యాప్నగరం

Comedian Riyaz: ఇంకోసారి ఆ తప్పు చేయను.. జగన్ అభిమానులకు ‘అదిరింది’ రియాజ్ క్షమాపణలు

మెగా బ్రదర్ నాగబాబుపై జగన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జగన్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.

Samayam Telugu 6 Oct 2020, 5:05 pm
‘అదిరింది’ కామెడీ షోకి ముందు ‘బొమ్మ’ తగిలించి ‘బొమ్మ అదిరింది’ అని మార్చిన సంగతి తెలిసిందే. యాంకర్‌గా శ్రీముఖిని తీసుకొచ్చారు. ‘అదిరింది’తో పోలిస్తే కామెడీ డోస్‌ను కాస్త పెంచుతూ ఈ షో చేస్తున్నారు. అక్టోబర్ 4న తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ ఎపిసోడ్‌కి జానీ మాస్టర్, యాంకర్ సుమతో పాటు ఈ షోకు మూలస్తంభం అయిన నాగబాబు చీఫ్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. నాగబాబు, జానీ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరించారు.
Samayam Telugu రియాజ్
Adirindi Riyaz


అయితే, తొలి ఎపిసోడ్‌తోనే ‘బొమ్మ అదిరింది’ వివాదాస్పదమైంది. ఈ షోలో గల్లీ బోయ్స్, రౌడీ బోయ్స్ కలిసి ఒక స్కిట్ చేశారు. సెలబ్రిటీ ప్రీమియర్ లీగ్ అనే కాన్సెప్ట్‌తో ఈ స్కిట్ చేశారు. అయితే, ఇందులో పలువురు సినీ హీరోలు, రాజకీయ నాయకులను ఇమిటేట్ చేశారు. అందులో ఏపీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. సద్దాం టీమ్‌లో ఉండే రియాజ్.. వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేశాడు. ఇది జగన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో సోషల్ మీడియాలో ‘బొమ్మ అదిరింది’ షోపై జగన్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.

జగన్‌ను ఇమిటేట్ చేసిన రియాజ్‌తో పాటు ఈ షోకు మూలస్తంభం అయిన నాగబాబుపై కూడా జగన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ అభిమానులకు రియాజ్ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశాడు. ‘‘పోయిన వారం స్కిట్‌లో జగనన్నను ఇమిటేట్ చేశాను. దాన్ని చూసి కొంత మంది వైఎస్సార్‌సీపీ నాయకులు మెచ్చుకున్నారు. కానీ, కొంత మంది జగనన్న అభిమానులు హర్ట్ అయ్యారని తెలిసింది. అందుకే, నా తరఫు నుంచి, అదిరింది షో తరఫు నుంచి వారికి క్షమాపణలు చెబుతున్నాను. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను’’ అని వీడియోలో రియాజ్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.