యాప్నగరం

అనసూయకు అదిరే ఆఫర్... బాలీవుడ్‌ నుంచి పిలుపు

టాలీవుడ్‌లో దూసుకుపోతున్న యాంకర్ అనసూయకు ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్‌లో నటించాలని ఆమెను కొందరు కోరినట్లు సమాచారం. దీనికి అనసూయ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 11 May 2020, 10:49 am
బుల్లితెరపై తన గ్లామర్‌తో ప్రేక్షకుల్ని అలరించిన అనసూయ రోజురోజుకు దూసుకుపోతుంది. ఓవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తోంది. అనసూయకు ఉన్న క్రేజ్ మరి అలాంటింది. న్యూస్ రీడర్‌గా కెరియర్ ప్రారంభించిన ఆ తర్వాత టీవీ షోలతో పాపులారిటీ సంపాదించింది. ఇక జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అనసూయకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది.
Samayam Telugu anasuya anchor

దీంతో ఓవైపు యాంకరింగ్ చేస్తూనే అడపాదడపా సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తుంది. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది అనసూయ. తాజాగా అనసూయ చిరంజీవి కొత్త చిత్రం ఆచార్యలో కూడా నటిస్తున్నట్టు సమాచారం

ఇప్పటి వరకు టాలీవుడ్‌లో బిజీగా మారిన అనసూయకి బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. అయితే సినిమాల్లో కాదు. హిందీలో టాప్ రేటింగ్‌తో దూసుకెళ్లున్న టీవీ సీరియల్‌లో లీడ్ రోల్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్‌లో చాలామంది నటీ నటులు సీరియల్స్ నుంచి వెళ్లిన వాళ్లే. టీవీలో తామెంటో.. తన టాలెంట్ ఏంటో నిరూపించుకొని ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ఇప్పుడు అనసూయకు కూడా హిందీ టాప్ సీరియల్‌లో అవకాశం రావడంతో అది కూడా మెయిన్ రోల్ కావడంతో ఆమె కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

సీరియల్‌లో నటించేందుకు తక్కువ రోజులే డేట్స్ అనసూయను అడిగినట్లుగా తెలుస్తోంది. దీంతో డేట్స్ కూడా ఎడ్జస్ట్ కావడంతో దీనికి అనసూయ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఒకవేళ బాలీవుడ్ సీరియల్‌లో అనసూయ సక్సెస్ అయితే.. ఆ తర్వాత ఆమెను బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కూడా చూసే అవకాశాలున్నాయిని ఆమె అభిమానులు తెగ సంబరిపడిపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.