యాప్నగరం

ఆవుపై పశువాంఛ.. ఆ దారుణాన్ని కళ్లకు కట్టిన యాంకర్ రష్మి వీడియో

మూగజీవాలపై మానవ మృగాలు ఎగబడుతున్నాయి. కళ్లు మూసుకుపోయిన ఆ కామాంధుడు మూగజీవంపై పశువాంఛ తీర్చుకున్నాడు. ఈ మానవ మృగం చేస్తున్నదంతా సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ కావడంతో..

Samayam Telugu 19 May 2020, 9:06 am
కామంతో కళ్లు మూసుకుపోతూ వాయి వరసలు మరిచిపోతున్నారు కొంతమంది కామ పిశాచిలు. తల్లి, చెల్లి, అక్క, వదిన ఇలాంటి వరసలు మరిచిపోయి మానవత్వాన్ని మంటగలుపుతున్నారు కొందరు కామాంధులు. అయితే మానవజాతికే మచ్చ తెచ్చే ఇలాంటి కామాంధులు మూగ జీవాలను సైతం వదలడం. తమ కామవాంఛ తీర్చుకోవడంపై ఆవుపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు.
Samayam Telugu యాంకర్ రష్మి (rashmi gautam)
rashmi gautam

Read also: బతుకు జట్కాబండిపై పోసాని ఓపెన్..! ‘ప్రాబ్లమ్ లేనివాళ్లని తీసుకొచ్చి, ఏడమని బలవంతం..

మహారాష్ట్రలో సమర్ ఖాన్ అనే కామాంధుడు తన కామవాంఛ తీర్చుకోవడం కోసం ఆవుపై ఎగబడ్డాడు. ఆదివారం నాడు దొడ్డిలో కట్టి ఉన్న ఆవుపై అత్యాచారం చేశాడు. ఈ దారుణం సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ కావడంతో అతడిపై ఐపీసీ సెక్షన్ 377, 505-2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో యాంకర్ రష్మి స్పందిస్తూ.. పశువాంఛ తీర్చుకుంటున్న ఈ మనిషిని చూస్తే మానవజాతి సిగ్గుపడేలా ఉందంటూ ఈ దారుణమైన వీడియోను పోస్ట్ చేశారు రష్మి.

గతంలో ఓ లేగదూడపై యువకుడు పశువాంఛ తీర్చుకుంటున్న వీడియో ఒకటి రష్మి కంట పడతంతో ‘మనం ఎక్కడికి పోతున్నాం’ అంటూ ప్రశ్నించింది రష్మి. తాజాగా ఇలాంటి వీడియోనే షేర్ చేసి మూగజీవాలపై మానవ మృగాలు ఎలా ఎగబడుతున్నారో కళ్లకి కట్టింది రష్మి. దీంతో పాటు చిన్న కుక్క పిల్లను ఓ మహిళ కర్రతో దారుణంగా కొడుతూ హింసిస్తున్న వీడియోనే షేర్ చేస్తూ కడిగిపారేసింది రష్మి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.