యాంకర్ శ్యామల టీవీ నటుడు నరసింహను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఈ పెళ్లి కోసం చాలా పెద్ద ఫైట్ చేసింది శ్యామల. ఫైటింగ్లు ఛేజింగ్లు పారిపోవడాలు ఇలా చాలానే ఉన్నాయి వీళ్ల లవ్ స్టోరీలో. మేజర్ కాకుండానే ప్రేమలో పడటంతో పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేయాల్సి వచ్చింది శ్యామల. ఇలా ఈమె లవ్ స్టోరీలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి.. అవేంటో ఆమె మాటల్లోనే విందాం.
నేను జగదేకవీరుడు అతిలోక సుందరి సీరియల్ చేస్తున్నప్పుడు నరసింహ (టీవీ నటుడు-శ్యామల భర్త) నాకు అందరిలా కనిపించలేదు.. అప్పటి వరకూ నేను ఏం అనుకునేదాన్ని అంటే.. అబ్బా వీడి కాంబినేషన్ అంటే వీడొచ్చి సొల్లు వేస్తాడు అనుకునేదాన్ని. కాసేపు నవ్వుతూ నటించాలి అనుకున్నా. కానీ ఆ అబ్బాయి నన్ను అస్సలు పట్టించుకోలేదు. డైరెక్టర్ వచ్చి చెప్పాడు... మీ పెయిర్గా ఈ అమ్మాయి చేస్తుందని.. ఆహా.. అవునా అనేసి నన్ను అస్సలు పట్టించుకోలేదు. దీంతో నా మైండ్లో పడ్డాడు.. ఈ అబ్బాయి ఏంటి డిఫరెంట్గా ఉన్నాడని అనుకున్నా.. అమ్మాయిలు సాధారణంగా ఎవరైతే డిఫరెంట్గా అనిపిస్తారో వాళ్ల వైపే ఉంటారు.
సో నన్ను ఎలాగూ పట్టించుకోవడం లేదని నేనే వెళ్లి మాట్లాడాను. నా పేరు శ్యామలా అని.. అప్పటికి తను చంద్రముఖి, మనసు చూడతరమా ఇలా చాలా సీరియల్స్ చేశాడు. నేను ఊర్లో తన సీరియల్స్ చూసేదాన్ని. అందుకే నేనే వెళ్లి.. నేను మీ ఫ్యాన్ని.. మీరు చాలా బాగుంటారు అని పరిచయం చేసుకున్నా. తను చాలా తెల్లగా ఉంటారు.. ఇలా మాట్లాడేదాన్ని. నన్ను చాలా ఇన్నోసెంట్ అనుకునేవాడు. ఆ తరువాత నుంచి నాతో చాలా బాగా మాట్లాడేవాడు. తన కారులోనే ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాడు. ఆ జర్నీలోనే మాట్లాడుకోవడం.. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం జరిగాయి.
అలా ఇష్టపడి ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అయితే ఇంట్లో మా అమ్మ ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే మా కులాలు వేరు. మేం బ్రాహ్మిణ్.. వాళ్లు రెడ్డీస్.. మా అమ్మకి రెడ్డి అబ్బాయిలు అంటే.. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి రేంజ్లో ఊహించుకుంటుంది. వాళ్లని ఫ్యాక్షనిస్ట్లుగా చూస్తుంది. పైగా రెడ్లు అంటే చాలా కోపంగా ఉంటారు.. వాళ్లని నువ్ తట్టుకోలేవు. నీకు ఊ కంటే కన్నీళ్లు వచ్చేస్తాయి అని.. రెడ్డి అనగానే వద్దని చెప్పేసింది.
కాదమ్మా.. ఈ అబ్బాయి చాలా మంచోడు అదీ ఇదీ అని చెప్తే ఇంటికి రమ్మను మాట్లాడతాను అని అన్నది. తాను ఇంటికి వచ్చే సరికి మా అమ్మ మా ఇంట్లో పెద్ద గ్యాంగ్ని రెడీ చేసింది. మా బావలు, బాబాయ్లు, మామయ్యలు అందర్నీ కూర్చోబెట్టి పంచాయితీ పెట్టారు.
మీ పేరెంట్స్ని పిలిపించండి మాట్లాడతాము అని నరసింహతో చెప్పారు మా వాళ్లు.. నిజానికి అప్పటికి వాళ్ల అమ్మ అమెరికాలో ఉన్నారు. మా పేరెంట్స్ ఇక్కడ లేరు యూఎస్లో ఉన్నారు అని చెప్తే.. వీళ్లకి నమ్మబుద్ది కాలేదు. తను ఎంత చెప్పినా వాళ్లతో ఫోన్లో మాట్లాడిస్తానన్నా మా వాళ్లు వినలేదు.. ఈ పెళ్లి మ్యాటర్ మరిచిపోండి అయితే.. రెండేళ్ల వరకూ మీరు ఇలా కలిసే ఉంటే మేమే పెళ్లి చేస్తాం.. ఇంతలో మీ పేరెంట్స్ వస్తారు కదా అని చెప్పారు. అప్పుడు నాకు రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. రెండేళ్ల తరవాత వీళ్లు పెళ్లి చేయకపోతే పరిస్థితి ఏంటని ఆలోచన మొదలైంది. నన్నెక్కడికైనా తీసుకుని వెళ్లి పెళ్లి చేసేస్తే ఏంటి?? అని అడిగాను.
దాంతో మా అమ్మ బావలు ఇదేదో తేడా ఉందని.. షూటింగ్ స్పాట్ నుంచి నన్ను తీసుకుని పోదాం అని ప్లాన్ చేశారు. అప్పుడు నేను అభిషేకం సీరియల్ షూటింగ్లో ఉన్నాను. డైరెక్టర్తో చెప్పేసి నన్ను తీసుకుని పోవడానికి ప్లాన్ చేశారు. దీంతో నేను అటు నుంచి అటు జంప్ అవ్వాలని ఫిక్స్ అయ్యా. నా దగ్గర నుంచి ఫోన్ తీసేసుకున్నారు.. కమ్యునికేషన్ లేకుండా మాట్లాడనీయకుండా కలవకుండా చేసేశారు.
ఆ టైంలో హరితేజ (బిగ్ బాస్ ఫేమ్) ఫోన్ తీసుకుని నరసింహకి ఫోన్ చేశా. నేను దేనికి ఫోన్ తీసుకున్నానో ఆమెకు తెలియదు. అప్పుడు నరసింహ తను రాకుండా.. ప్రొడక్షన్ మేనేజర్ వంశీని పంపాడు. అతను సెట్లోకి వచ్చి శ్యామలని తీసుకుని వెళ్లేది ఎవరు అని అడ్డుపడ్డాడు. దీంతో మా బావ అతనితో గొడవపడి అతన్ని కొట్టాడు. ఇద్దరూ కొట్టుకున్నారు. మా అమ్మ నన్ను కొట్టింది. ఇదంతా లొకేషన్లోనే జరిగి రచ్చ రచ్చ అయ్యింది. పెద్ద సినిమా సీన్ అయ్యింది.
ఆ తరువాత మా అమ్మ నీ చావు నువ్ చావు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. నేను ఇంటికి వెళ్లేసరికి నేను కొనుకున్న బట్టలు వస్తువులు తప్ప ఇంకేం లేవు.. అన్నీ తీసుకుని ఇంటికి తాళం వేసి అక్కడే తాళం పడేసి వెళ్లిపోయింది అమ్మ. నాకు భయం వేసి నరసింహకి ఫోన్ చేస్తే.. తను వచ్చి నన్ను వాళ్ల అక్క ఇంట్లో పెట్టాడు. ఏడాది వాళ్ల అక్క ఇంట్లోనే ఉన్నాను. పెళ్లి చేసుకుందాం అంటే నాకు 18 ఏళ్లు నిండలేదు. అందుకే ఏడాది వెయిట్ చేయాల్సి వచ్చింది. మా అమ్మ కేసుపెడితే లోపలేసేవారు.
ఆ తరువాత అమ్మతో మాట్లాడటానికి చాలా ట్రై చేశా. ఇంటికి వెళ్లినా రానిచ్చేది కాదు.. ఫోన్ కూడా మాట్లాడేది కాదు. మా అమ్మ చాలా మొండిది.. చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఇప్పుడంతా ఓకే అయ్యింది.. పెళ్లైన రెండేళ్ల తరువాత ఆమెకు నమ్మకం కుదిరింది. మా ప్రేమను అర్థం చేసుకుంది.. ఇప్పుడు అంతా బాగానే ఉంటున్నాం’ అని చెప్పింది యాంకర్ శ్యామల.
నేను జగదేకవీరుడు అతిలోక సుందరి సీరియల్ చేస్తున్నప్పుడు నరసింహ (టీవీ నటుడు-శ్యామల భర్త) నాకు అందరిలా కనిపించలేదు.. అప్పటి వరకూ నేను ఏం అనుకునేదాన్ని అంటే.. అబ్బా వీడి కాంబినేషన్ అంటే వీడొచ్చి సొల్లు వేస్తాడు అనుకునేదాన్ని. కాసేపు నవ్వుతూ నటించాలి అనుకున్నా. కానీ ఆ అబ్బాయి నన్ను అస్సలు పట్టించుకోలేదు. డైరెక్టర్ వచ్చి చెప్పాడు... మీ పెయిర్గా ఈ అమ్మాయి చేస్తుందని.. ఆహా.. అవునా అనేసి నన్ను అస్సలు పట్టించుకోలేదు. దీంతో నా మైండ్లో పడ్డాడు.. ఈ అబ్బాయి ఏంటి డిఫరెంట్గా ఉన్నాడని అనుకున్నా.. అమ్మాయిలు సాధారణంగా ఎవరైతే డిఫరెంట్గా అనిపిస్తారో వాళ్ల వైపే ఉంటారు.
సో నన్ను ఎలాగూ పట్టించుకోవడం లేదని నేనే వెళ్లి మాట్లాడాను. నా పేరు శ్యామలా అని.. అప్పటికి తను చంద్రముఖి, మనసు చూడతరమా ఇలా చాలా సీరియల్స్ చేశాడు. నేను ఊర్లో తన సీరియల్స్ చూసేదాన్ని. అందుకే నేనే వెళ్లి.. నేను మీ ఫ్యాన్ని.. మీరు చాలా బాగుంటారు అని పరిచయం చేసుకున్నా. తను చాలా తెల్లగా ఉంటారు.. ఇలా మాట్లాడేదాన్ని. నన్ను చాలా ఇన్నోసెంట్ అనుకునేవాడు. ఆ తరువాత నుంచి నాతో చాలా బాగా మాట్లాడేవాడు. తన కారులోనే ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాడు. ఆ జర్నీలోనే మాట్లాడుకోవడం.. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం జరిగాయి.
అలా ఇష్టపడి ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అయితే ఇంట్లో మా అమ్మ ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే మా కులాలు వేరు. మేం బ్రాహ్మిణ్.. వాళ్లు రెడ్డీస్.. మా అమ్మకి రెడ్డి అబ్బాయిలు అంటే.. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి రేంజ్లో ఊహించుకుంటుంది. వాళ్లని ఫ్యాక్షనిస్ట్లుగా చూస్తుంది. పైగా రెడ్లు అంటే చాలా కోపంగా ఉంటారు.. వాళ్లని నువ్ తట్టుకోలేవు. నీకు ఊ కంటే కన్నీళ్లు వచ్చేస్తాయి అని.. రెడ్డి అనగానే వద్దని చెప్పేసింది.
కాదమ్మా.. ఈ అబ్బాయి చాలా మంచోడు అదీ ఇదీ అని చెప్తే ఇంటికి రమ్మను మాట్లాడతాను అని అన్నది. తాను ఇంటికి వచ్చే సరికి మా అమ్మ మా ఇంట్లో పెద్ద గ్యాంగ్ని రెడీ చేసింది. మా బావలు, బాబాయ్లు, మామయ్యలు అందర్నీ కూర్చోబెట్టి పంచాయితీ పెట్టారు.
మీ పేరెంట్స్ని పిలిపించండి మాట్లాడతాము అని నరసింహతో చెప్పారు మా వాళ్లు.. నిజానికి అప్పటికి వాళ్ల అమ్మ అమెరికాలో ఉన్నారు. మా పేరెంట్స్ ఇక్కడ లేరు యూఎస్లో ఉన్నారు అని చెప్తే.. వీళ్లకి నమ్మబుద్ది కాలేదు. తను ఎంత చెప్పినా వాళ్లతో ఫోన్లో మాట్లాడిస్తానన్నా మా వాళ్లు వినలేదు.. ఈ పెళ్లి మ్యాటర్ మరిచిపోండి అయితే.. రెండేళ్ల వరకూ మీరు ఇలా కలిసే ఉంటే మేమే పెళ్లి చేస్తాం.. ఇంతలో మీ పేరెంట్స్ వస్తారు కదా అని చెప్పారు. అప్పుడు నాకు రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. రెండేళ్ల తరవాత వీళ్లు పెళ్లి చేయకపోతే పరిస్థితి ఏంటని ఆలోచన మొదలైంది. నన్నెక్కడికైనా తీసుకుని వెళ్లి పెళ్లి చేసేస్తే ఏంటి?? అని అడిగాను.
దాంతో మా అమ్మ బావలు ఇదేదో తేడా ఉందని.. షూటింగ్ స్పాట్ నుంచి నన్ను తీసుకుని పోదాం అని ప్లాన్ చేశారు. అప్పుడు నేను అభిషేకం సీరియల్ షూటింగ్లో ఉన్నాను. డైరెక్టర్తో చెప్పేసి నన్ను తీసుకుని పోవడానికి ప్లాన్ చేశారు. దీంతో నేను అటు నుంచి అటు జంప్ అవ్వాలని ఫిక్స్ అయ్యా. నా దగ్గర నుంచి ఫోన్ తీసేసుకున్నారు.. కమ్యునికేషన్ లేకుండా మాట్లాడనీయకుండా కలవకుండా చేసేశారు.
ఆ టైంలో హరితేజ (బిగ్ బాస్ ఫేమ్) ఫోన్ తీసుకుని నరసింహకి ఫోన్ చేశా. నేను దేనికి ఫోన్ తీసుకున్నానో ఆమెకు తెలియదు. అప్పుడు నరసింహ తను రాకుండా.. ప్రొడక్షన్ మేనేజర్ వంశీని పంపాడు. అతను సెట్లోకి వచ్చి శ్యామలని తీసుకుని వెళ్లేది ఎవరు అని అడ్డుపడ్డాడు. దీంతో మా బావ అతనితో గొడవపడి అతన్ని కొట్టాడు. ఇద్దరూ కొట్టుకున్నారు. మా అమ్మ నన్ను కొట్టింది. ఇదంతా లొకేషన్లోనే జరిగి రచ్చ రచ్చ అయ్యింది. పెద్ద సినిమా సీన్ అయ్యింది.
ఆ తరువాత మా అమ్మ నీ చావు నువ్ చావు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. నేను ఇంటికి వెళ్లేసరికి నేను కొనుకున్న బట్టలు వస్తువులు తప్ప ఇంకేం లేవు.. అన్నీ తీసుకుని ఇంటికి తాళం వేసి అక్కడే తాళం పడేసి వెళ్లిపోయింది అమ్మ. నాకు భయం వేసి నరసింహకి ఫోన్ చేస్తే.. తను వచ్చి నన్ను వాళ్ల అక్క ఇంట్లో పెట్టాడు. ఏడాది వాళ్ల అక్క ఇంట్లోనే ఉన్నాను. పెళ్లి చేసుకుందాం అంటే నాకు 18 ఏళ్లు నిండలేదు. అందుకే ఏడాది వెయిట్ చేయాల్సి వచ్చింది. మా అమ్మ కేసుపెడితే లోపలేసేవారు.
ఆ తరువాత అమ్మతో మాట్లాడటానికి చాలా ట్రై చేశా. ఇంటికి వెళ్లినా రానిచ్చేది కాదు.. ఫోన్ కూడా మాట్లాడేది కాదు. మా అమ్మ చాలా మొండిది.. చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఇప్పుడంతా ఓకే అయ్యింది.. పెళ్లైన రెండేళ్ల తరువాత ఆమెకు నమ్మకం కుదిరింది. మా ప్రేమను అర్థం చేసుకుంది.. ఇప్పుడు అంతా బాగానే ఉంటున్నాం’ అని చెప్పింది యాంకర్ శ్యామల.