యాప్నగరం

Sreemukhi: ముగిసిన డ్రామా జూనియర్స్.. శ్రీముఖి ఏడిపించేసింది!

డ్రామా జూనియర్స్ ఛాంపియన్‌షిప్ ముగిసింది. విజయ్, త్రివేది, రోషన్, విఘ్నేష్, శర్మ, రూపిక, హాసిని, పద్మావతి, జాహ్నవి, దివ్య రూప, వైష్ణవి ఈ సీజన్‌లో విజేతలుగా నిలిచి ఐదు లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు.

Samayam Telugu 8 Jul 2019, 5:48 pm
జీ తెలుగులో ప్రసారమయ్యే ప్రముఖ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ ఛాంపియన్‌షిప్ ఆదివారం (జూలై 7) నాటితో ముగిసిన విషయం తెలిసిందే. డ్రామా జూనియర్స్ గడిచిన కొన్నిసీజన్లలలో 4 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు, వారి నటనా నైపుణ్యాలను ప్రదర్శించడానికి, మెరుగు పరుచుకోవడానికి ఒక సరైన వేదికగా ఉపయోగ పడింది. డ్రామా జూనియర్స్ సీజన్ 2లో పాల్గొన్న చిన్నారులైన విజయ్, త్రివేది, రోషన్, విఘ్నేష్, శర్మ, రూపిక, హాసిని, పద్మావతి, జాహ్నవి, దివ్య రూప, వైష్ణవి ఈ సీజన్‌లో విజేతలుగా నిలిచారు.
Samayam Telugu డ్రామా జూనియర్స్



ఈ బాలబాలికలు ట్రోఫీతో పాటు ఐదు లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నారు. సీజన్ 1, 3లలో పాల్గొని మనల్ని అలరించిన చిన్నారులను రన్నరప్‌గా ప్రకటించారు. ఆదివారం జరిగిన ఫినాలేలో యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగానే కాకుండా కళ్లు చెమర్చే స్కిట్‌తో ప్రేక్షకుల్ని అలరించారు.

ఈ గ్రాండ్ ఫినాలేలో చిన్నారులు ఆదర్శప్రాయమైన ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. ఈ ఫినాలేలో శ్రీముఖి పిల్లలతో కలిసి ఇచ్చిన ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. న్యాయనిర్ణేతలతో పాటు ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. అందరి ప్రశంసలతో పాటు మన్ననలు పొందింది. ఈ కార్యక్రమానికి అలీ, అనసూయ, ఓంకార్‌లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.