యాప్నగరం

Rashmi Gautam: రష్మికి శ్రీముఖి ఛాలెంజ్.. రాబోయే తరాలకు ఇది పునాది అంటూ

అటవీ సంపదను పెంచి, కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రంలో హరితహారం చేపడుతున్నారు. దీనిలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో చెట్లను నాటడంతో పాటు ఇతరులతో నాటించే ఈ బృహత్తర కార్యక్రమంలో సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు భాగస్వామ్యం అవుతున్నారు.

Samayam Telugu 3 Jan 2020, 7:22 pm
టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌కి మంచి స్పందన లభిస్తోంది. ఈ ఛాలెంజ్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని మొక్కలను నాటడమే కాకుండా.. మరో ముగ్గురికి ఛాలెంజ్ విసురుతున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమవుతూ మొక్కలు నాటారు యాంకర్ శ్రీముఖి.
Samayam Telugu sreemukhi green challenge
శ్రీముఖి, రష్మి


ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా రాబోయే తరాలకు పునాది వేసినట్టు ఉంటుంది. ఇప్పటికే చెట్లు నాటకపోవడం వల్ల వాతావరణంలో మార్పులు ఏవిధంగా మారుతున్నాయో మనకందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని నా తరపున కోరుతున్నాను. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమంను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

శ్రీముఖి గ్రీన్ ఛాలెంజ్


వాతావరణ కాలుష్యం వల్ల నా స్నేహితులు చాలా మంది వారి పిల్లలను ఇతర దేశాలకు తీసుకెళ్లి అక్కడే స్థిరపడదమనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనమందరం కలిసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఈ కార్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలిచారు.


నా తరపున మరోక ముగ్గురికి 1) వితిక 2) జానీమాస్టర్ 3) యాంకర్ రష్మి లను మొక్కలు నాటాలని వారికి గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నా. అలాగే టి.వి చూస్తున్న ప్రేక్షకులు ప్రతి ఒక్కరు స్వతహాగా మొక్కలు నాటాలని కోరారు శ్రీముఖి. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.