యాప్నగరం

Karthika Deepam Serial ట్విస్ట్: సౌందర్య సపోర్ట్‌తో మోనిత భర్తగా కార్తీక్.. దీపకు తీరని అన్యాయం!

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 అక్టోబర్ 25)న 1179 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రాబోయే ట్విస్ట్ అదిరిపోయింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 25 Oct 2021, 10:19 am
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam serial promo
‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021అక్టోబర్ 25)న 1179 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే నేటి కథనంలో మోనిత పరిస్థితి విషమంగా మారడంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో కార్తీక్ ఎమోషనల్ సీన్ కూడా చాలా రక్తికట్టింది. ఆ హైలైట్స్ మిస్ అయ్యి ఉంటే.. ఈ కింద లింక్‌పై క్లిక్ చేయండి.
కార్తీకదీపం అక్టోబర్ 25 ఎపిసోడ్: చావుబతుకుల మధ్య మోనిత.. ఆకట్టుకున్న డాక్టర్ బాబు ఎమోషనల్ సీన్

ప్రోమో హైలైట్స్..
మోనిత పరిస్థితి ఏం బాలేదని.. నువ్వు వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటుందట అని కార్తీక్‌కి భారతి ఫోన్ చేసి చెప్పడం, తను చచ్చినా నాకే సంబంధం లేదు అనడం.. మరోవైపు ఆ మాటలు విన్న సౌందర్య కార్తీక్‌తో.. ‘పసిబిడ్డ కోసమైనా ఆలోచించాలి’ అని సలహా ఇవ్వడం ఆ మాటలు దీప వినకూడదు అని మాట మార్చేయడం గత ప్రోమోలో నేటి కథనంలో తెలుస్తూనే ఉంది. అయితే రేపటి ప్రోమోలో షాకింగ్ ట్విస్ట్ ఉత్కంఠగా మారింది.

‘నేను సంతకం పెడితే దీపని దారుణంగా మోసం చేసినవాళ్లం అవుతాం మమ్మీ..’ అంటాడు కార్తీక్ బాధగా.. భూమ్మీద పడని పసికందు చావుకుని మనం కారణం అవుదామా? నా మాట విని ఆలోచించరా.. ప్లీజ్’ అంటుంది సౌందర్య ఎమోషనల్‌గా.. ఇక సీన్ కట్ చేస్తే.. ‘కార్తీక్ త్వరగా రారా.. అంటూ పిలుస్తుంది మెట్ల మీద నుంచి సౌందర్య. వంటగదిలో ఉన్న దీప వెనక్కి తిరిగి చూస్తుంది. కార్తీక్ వస్తాడు. ‘అత్తయ్యా ఎక్కడికి వెళ్తున్నారు?’ అని దీప అడగ్గానే.. ‘గుడికి వెళ్తున్నామే’ అంటుంది సౌందర్య. ‘ఉండండి.. నేను రెడీ అయ్యి వస్తాను’ అంటూ దీప వెళ్లబోతుంటే.. ‘వాడితో నాకు ఒక చిన్న మొక్కుబడి మిగిలిపోయింది దీపా..’ అంటుంది సౌందర్య. దీప వెంటనే.. ‘డాక్టర్ బాబు ఏం మొక్కు?’ అంటుంది దీప వెంటనే. కార్తీక్ బిత్తర మొహం వేస్తాడు.

‘మొక్కుకున్నది నేనే.. వాడికేం తెలుసు? రమ్మంటే వస్తున్నాడు అంతే.. అంతే కదరా..’ అంటుంది సౌందర్య కాస్త ఇరకాటంలో పడినట్లుగా చూస్తూ.. ‘హా అంతే దీపా’ అంటాడు కార్తీక్. వెంటనే దీప మనసులో.. ‘వీళ్లు కావాలనే నన్ను వద్దు అంటున్నారు’అనుకుంటుంది. పదా వెళ్దాం అని సౌందర్య, కార్తీక్‌లు మోనిత ఉన్న హాస్పెటల్‌కి మోనిత భర్తగా కార్తీక్ సంతకం చెయ్యడానికి వెళ్తారు. సీన్ కట్ చేస్తే ఇక దీప బాల్కనీలో ఒంటరిగా నిలబడి ధీనంగా ఆలోచిస్తూ ‘అత్తయ్య చెబుతున్నది అబద్దం అని తెలుస్తోంది.. ఎందుకు ఇలా చేస్తున్నారు’ అంటూ దీప మథనపడుతుంది. మోనితకి భర్తగా కార్తీక్ సంతకం పెడితే.. మోనిత బిడ్డ పుట్టాకా ఊరికే వదిలేస్తుందా? కచ్చిత్తంగా వదిలిపెట్టదు. దాంతో దీప మరోసారి పిల్లల్ని తీసుకుని గడప దాటే అవకాశాలు లేకపోలేదు. చూద్దాం ఏం జరగనుందో.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.