వామ్మో వామ్మో.. ఎంతపనిచేశావ్రా కార్తీకదీపం డైరెక్టరూ నీ జిమ్మడిపోనూ.. సీరియల్ని బాగుచేయరా నాయనా అంటే ఏకంగా మా దీప, డాక్టర్ బాబుని చంపేస్తావా? పాఫం పసిది అని కూడా చూడకుండా హిమని కూడా చంపేస్తావా? అంటూ కార్తీకదీపం సీరియల్ ఫ్యాన్స్ టీవీల ముందు కూర్చుని తలలు బాదుకునేట్టు చేశారు. ఆ డైరెక్టర్కి శాపనార్థాలు పెడుతున్నారు.
గత కొన్ని నెలలుగా గాడితప్పి... నడి సంద్రంలో వదిలేసిన నావలా ఎటు గాలివేస్తే అటు అన్నట్టుగా కార్తీకదీపం సీరియల్ సాగుతూ వస్తోంది. ఎప్పుడైతే వంటలక్క-డాక్టర్ బాబులు కలిశారో అప్పటి నుంచి ఈ సీరియల్ గాడి తప్పింది. కొత్త కొత్త క్యారెక్టర్లను తీసుకుని వచ్చి సరికొత్త ట్రాక్తో సీరియల్ని నడిపిద్దాం అనుకున్నారు కానీ.. ప్రేక్షకులు దేకలేదు.
దీంతో మళ్లీ పాత కథలోకి వచ్చేశారు. మళ్లీ దీప, కార్తీక్, మోనిత, హిమ, సౌర్య, సౌందర్య ఈ క్యారెక్టర్లతోనే ట్రాక్ ఎక్కించడానికి గానూ కథలో మార్పులు చేశారు. అయితే ఈ మార్పులు ఎంత భారీగా అంటే.. డాక్టర్ బాబు, దీప లాంటి లీడ్ రోల్స్ని చంపేసేటంతగా.. ‘కార్తీకదీపం’ అంటే డాక్టర్ బాబు, వంటలక్కే.. వీళ్లతో పాటు హిమని కూడా చంపేసి.. సౌర్య ఒక్కదాన్నే వదిలేశారు.
మంగళవారం నాటి ఎపిసోడ్లో ఈ భారీ ట్విస్ట్ని రివీల్ చేశారు. దీప, కార్తీక్, హిమల ఫొటోలకు దండవేసేశారు. కారు ప్రమాదంలో ఈ ముగ్గురు పోయినట్టుగా చూపించారు. కారు లోయలో పడి బ్లాస్ అయినట్టుగా చూపించారు.
గత కొన్నాళ్లుగా వీళ్లకి ఏదో జరగబోతుందనే హింట్స్ ఇస్తూనే ఉన్నారు. దీప, కార్తీక్లు ఎక్కడైతే విడిపోయారో మళ్లీ అదే ప్లేస్ చిక్ మంగళూర్లో కథ మొదలుపెట్టి.. వీళ్లు చనిపోబోతున్నారనే హింట్స్ ఇస్తూనే ఉన్నారు. గుడిలో పంతులు సౌందర్యతో కీడు సంభవించబోతుందని చెప్పడం.. సౌందర్య వెంటనే చిక్ మంగళూర్ బయలుదేరడం.. ఇంతలోనే కార్తీక్, దీప, హిమ ఫొటోలకు దండ పడిపోవడంతో కార్తీకదీపం సీరియల్కి ఇది కీలకమైన ట్విస్ట్ అనే చెప్పొచ్చు.
అసలు ఈ సీరియల్లో కార్తీక్, దీపలను చంపేస్తే.. అసలు సీరియల్ ఎలా నడుస్తుంది. దీప, కార్తీక్లతో పాటు హిమ కూడా మళ్లీ జన్మిస్తుందా? మరి సౌర్యని మాత్రమే ఎందుకు వదిలేశారు? దర్శకుడు ముందుగా ఏం చెప్పారంటే.. ఈ సీరియల్ని ఫ్యామిలీ ట్రీలా చేసే ఉద్దేశం లేదని.. అంటే పిల్లలు పెద్దవాళ్లు అయినట్టుగా కానీ.. దీప, కార్తీక్లు ముసలివాళ్లు అయినట్టుగా చూపించబోమని చెప్పారు.
నిజానికి అతని అభిప్రాయమూ కరెక్టే.. ఎందుకంటే.. దీప, కార్తీక్లకు ముసలిగెటప్ వేసినా ఓకే కానీ.. పిల్లలు పెద్దవాళ్లు అయినట్టు అయితే.. సౌర్య, హిమ క్యారెక్టర్లను తీసేయాలి. అంటే వాళ్లు ఇక సీరియల్లో కనిపించరు. ఇప్పటికే హిమ, సౌర్య క్యారెక్టర్లను ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు కాబట్టి వాళ్లు లేకపోతే బాగోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైగా దీప, కార్తీక్లు ముసలి వాళ్లు అయినట్టుగా చూపిస్తే ఆడియన్స్ సరిగా రిసీవ్ చేసుకోలేరని.. అందుకే కథలో మరో కోణంలో ముందుకు నడిపించబోతున్నట్టు చెప్పకనే చెప్పారు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర.
ఈ పరిస్థితుల్లో అసలు కథని ఎలా ముందుకు నడిపించబోతున్నారు? దీప, కార్తీక్లు మళ్లీ పుడతారా? లేదంటే గతం మర్చిపోవడం చేసి మళ్లీ బతికిస్తారా? లేదంటే నిజంగానే చంపేసి.. సీరియల్ని ఎండ్ చేయబోతున్నారా? అనే అనేకనేక సందేహాలు ఆడియన్స్ నుంచి వస్తున్నాయి.
నిజానికి సీరియల్ను ముందుకి నడిపించగలిగే స్టఫ్ అయితే ముందే రెడీ చేసిపెట్టుకున్నారు దర్శకుడు. కార్తీక్ అక్క కొడుకుల్ని అంతకు ముందే కథలోకి తీసుకుని వచ్చారు. సౌర్య, హిమలకు జోడీలుగా తీసుకుని రాబోతున్నట్టు ఇంతకు ముందు హింట్ ఇచ్చారు. ఆ ఇద్దరిలో ఒకర్ని కార్తీక్గా పరిచయం చేయొచ్చు. మరి దీప పరిస్థితి ఏంటి? అంటే.. చనిపోయిన ఈ బతికి ఉన్న సౌర్యే దీపగా చూపించవచ్చు. మొత్తానికైతే.. కార్తీకదీపం సీరియల్లో విషయం ఏం లేదబ్బా తేలిపోయింది అనుకున్న టైంలో ఇప్పుడిప్పుడే లేపుతున్నారు. రేటింగ్స్ పరంగా కూడా గాడిఎక్కింది. ఇలాంటి టైంలో కార్తీక్, దీపలను చంపేసి.. కథను మలుపు తిప్పారు. కథనాన్ని ఆసక్తికరంగా మార్చేశారు.
Read Also: ‘కార్తీకదీపం’ మార్చి 8 ఎపిసోడ్: చనిపోయిన కార్తీక్, దీప, హిమ.. షాక్లో సౌర్య
గత కొన్ని నెలలుగా గాడితప్పి... నడి సంద్రంలో వదిలేసిన నావలా ఎటు గాలివేస్తే అటు అన్నట్టుగా కార్తీకదీపం సీరియల్ సాగుతూ వస్తోంది. ఎప్పుడైతే వంటలక్క-డాక్టర్ బాబులు కలిశారో అప్పటి నుంచి ఈ సీరియల్ గాడి తప్పింది. కొత్త కొత్త క్యారెక్టర్లను తీసుకుని వచ్చి సరికొత్త ట్రాక్తో సీరియల్ని నడిపిద్దాం అనుకున్నారు కానీ.. ప్రేక్షకులు దేకలేదు.
దీంతో మళ్లీ పాత కథలోకి వచ్చేశారు. మళ్లీ దీప, కార్తీక్, మోనిత, హిమ, సౌర్య, సౌందర్య ఈ క్యారెక్టర్లతోనే ట్రాక్ ఎక్కించడానికి గానూ కథలో మార్పులు చేశారు. అయితే ఈ మార్పులు ఎంత భారీగా అంటే.. డాక్టర్ బాబు, దీప లాంటి లీడ్ రోల్స్ని చంపేసేటంతగా.. ‘కార్తీకదీపం’ అంటే డాక్టర్ బాబు, వంటలక్కే.. వీళ్లతో పాటు హిమని కూడా చంపేసి.. సౌర్య ఒక్కదాన్నే వదిలేశారు.
మంగళవారం నాటి ఎపిసోడ్లో ఈ భారీ ట్విస్ట్ని రివీల్ చేశారు. దీప, కార్తీక్, హిమల ఫొటోలకు దండవేసేశారు. కారు ప్రమాదంలో ఈ ముగ్గురు పోయినట్టుగా చూపించారు. కారు లోయలో పడి బ్లాస్ అయినట్టుగా చూపించారు.
గత కొన్నాళ్లుగా వీళ్లకి ఏదో జరగబోతుందనే హింట్స్ ఇస్తూనే ఉన్నారు. దీప, కార్తీక్లు ఎక్కడైతే విడిపోయారో మళ్లీ అదే ప్లేస్ చిక్ మంగళూర్లో కథ మొదలుపెట్టి.. వీళ్లు చనిపోబోతున్నారనే హింట్స్ ఇస్తూనే ఉన్నారు. గుడిలో పంతులు సౌందర్యతో కీడు సంభవించబోతుందని చెప్పడం.. సౌందర్య వెంటనే చిక్ మంగళూర్ బయలుదేరడం.. ఇంతలోనే కార్తీక్, దీప, హిమ ఫొటోలకు దండ పడిపోవడంతో కార్తీకదీపం సీరియల్కి ఇది కీలకమైన ట్విస్ట్ అనే చెప్పొచ్చు.
అసలు ఈ సీరియల్లో కార్తీక్, దీపలను చంపేస్తే.. అసలు సీరియల్ ఎలా నడుస్తుంది. దీప, కార్తీక్లతో పాటు హిమ కూడా మళ్లీ జన్మిస్తుందా? మరి సౌర్యని మాత్రమే ఎందుకు వదిలేశారు? దర్శకుడు ముందుగా ఏం చెప్పారంటే.. ఈ సీరియల్ని ఫ్యామిలీ ట్రీలా చేసే ఉద్దేశం లేదని.. అంటే పిల్లలు పెద్దవాళ్లు అయినట్టుగా కానీ.. దీప, కార్తీక్లు ముసలివాళ్లు అయినట్టుగా చూపించబోమని చెప్పారు.
నిజానికి అతని అభిప్రాయమూ కరెక్టే.. ఎందుకంటే.. దీప, కార్తీక్లకు ముసలిగెటప్ వేసినా ఓకే కానీ.. పిల్లలు పెద్దవాళ్లు అయినట్టు అయితే.. సౌర్య, హిమ క్యారెక్టర్లను తీసేయాలి. అంటే వాళ్లు ఇక సీరియల్లో కనిపించరు. ఇప్పటికే హిమ, సౌర్య క్యారెక్టర్లను ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు కాబట్టి వాళ్లు లేకపోతే బాగోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైగా దీప, కార్తీక్లు ముసలి వాళ్లు అయినట్టుగా చూపిస్తే ఆడియన్స్ సరిగా రిసీవ్ చేసుకోలేరని.. అందుకే కథలో మరో కోణంలో ముందుకు నడిపించబోతున్నట్టు చెప్పకనే చెప్పారు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర.
ఈ పరిస్థితుల్లో అసలు కథని ఎలా ముందుకు నడిపించబోతున్నారు? దీప, కార్తీక్లు మళ్లీ పుడతారా? లేదంటే గతం మర్చిపోవడం చేసి మళ్లీ బతికిస్తారా? లేదంటే నిజంగానే చంపేసి.. సీరియల్ని ఎండ్ చేయబోతున్నారా? అనే అనేకనేక సందేహాలు ఆడియన్స్ నుంచి వస్తున్నాయి.
నిజానికి సీరియల్ను ముందుకి నడిపించగలిగే స్టఫ్ అయితే ముందే రెడీ చేసిపెట్టుకున్నారు దర్శకుడు. కార్తీక్ అక్క కొడుకుల్ని అంతకు ముందే కథలోకి తీసుకుని వచ్చారు. సౌర్య, హిమలకు జోడీలుగా తీసుకుని రాబోతున్నట్టు ఇంతకు ముందు హింట్ ఇచ్చారు. ఆ ఇద్దరిలో ఒకర్ని కార్తీక్గా పరిచయం చేయొచ్చు. మరి దీప పరిస్థితి ఏంటి? అంటే.. చనిపోయిన ఈ బతికి ఉన్న సౌర్యే దీపగా చూపించవచ్చు. మొత్తానికైతే.. కార్తీకదీపం సీరియల్లో విషయం ఏం లేదబ్బా తేలిపోయింది అనుకున్న టైంలో ఇప్పుడిప్పుడే లేపుతున్నారు. రేటింగ్స్ పరంగా కూడా గాడిఎక్కింది. ఇలాంటి టైంలో కార్తీక్, దీపలను చంపేసి.. కథను మలుపు తిప్పారు. కథనాన్ని ఆసక్తికరంగా మార్చేశారు.
Read Also: ‘కార్తీకదీపం’ మార్చి 8 ఎపిసోడ్: చనిపోయిన కార్తీక్, దీప, హిమ.. షాక్లో సౌర్య