యాప్నగరం

Guppedantha Manasu నవంబర్ 22 ఎపిసోడ్: వసుని అవమానించిన జగతి.. ఒకే ఇంట్లో రిషితో మిస్ పొగరు

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 నవంబర్ 22)న 298 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Guppedantha Manasu november 22 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 22 Nov 2021, 8:58 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 నవంబర్ 22)న 298 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ నవంబర్ 22 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu november 22 episode


298వ ఎపిసోడ్‌ హైలైట్స్..
వసు జగతి ఇంట్లో బాధతో ఉంటే.. రిషి రావడం.. తెలిసిందే. అయితే రిషిని హగ్ చేసుకుని ఏడ్చిన వసుధర.. ‘మీరు నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను’ అంటూ వసు చెప్పడంతో రిషి మరింత దగ్గరకి తీసుకోవడం అదంతా వసు ఊహ. తేరుకుని సార్ ఒక్కనిమిషం అంటూ కిచెన్‌లోకి వెళ్తుంది వసు. అయితే రిషి కాలేజ్‌కి వెళ్లాడా లేదా ఎక్కడికైనా వెళ్లాడా? రెండు రోజులు నుంచి అదోలా ఎందుకు ఉంటున్నాడు అని అనుమానం వచ్చిన దేవయాని.. ధరణి ఫోన్ నుంచి రిషికి కాల్ చేయించి.. ఫోన్ అందుకుంటుంది. అయితే రిషి మాట్లాడుతూ ఉండగా.. ‘ఎక్కడున్నావ్ నాన్నా.. తిన్నావా ఏదైనా’ అంటూ ప్రేమగా నటిస్తూ మాట్లాడుతుంది. ఇంతలో వసు కిచెన్ నుంచి.. ‘సార్ కాఫీనా టీనా’ అని అరుస్తుంది. అది విని దేవయాని.. ‘ఎక్కడున్నావ్ నాన్నా’ అంటుంది కానీ.. ‘పెద్దమ్మా నేను మళ్లీ మాట్లాడతా’ అంటూ కట్ చేస్తాడు. దేవయానికి అనుమానం మరింత బలపడుతుంది.

ధరణితో ‘ఆ వాయిస్ ఎవరిది అయ్యి ఉంటుంది’ అనడంతో.. ‘బహుశా కాలేజ్‌లో అమ్మాయిది ఎవరైనా అయ్యుండొచ్చు అత్తయ్యా’ అంటుంది ధరణి. అయితే అనుమానం తీరని దేవయాని ధరణి ఫోన్‌తో జగతికి కాల్ చేయిస్తుంది. అడుగు అడుగు రిషి కాలేజ్‌లో ఉన్నాడో లేదు అడుగు అంటూ నెమ్మదిగా చెప్పి స్పీకర్ ఆన్ చేస్తుంది. దాంతో ధరణి అడుగుతుంది. ‘లేదు ధరణి రిషి ఇంకా రాలేదు..’ అనడంతో దేవయానికి ఓ క్లారిటీ వచ్చింది రిషి కాలేజ్‌కి వెళ్లలేదని. దాంతో ‘తెలుసుకుంటాను కథ ఎటు పోతుందో’ అంటూ నిర్ణయం తీసుకుని వెళ్లిపోతుంది.

ఇక వసు అయితే రిషి ఆకలి అనడంతో వంట చేస్తూ ఉంటుంది. పప్పు అప్పడం, నెయ్యి వంటి వంటకాలు కావాలని రిషి అడగడంతో అవే వండిపెడుతుంది. రా కూర్చో.. నువ్వు తిను అంటూ రిషినే వసుకి దగ్గరుండి వడ్డిస్తాడు. వసు పొంగిపోతుంది. ఇద్దరూ చాలా హ్యాపీగా తింటాడు. అయితే రిషి మీటింగ్‌కి కూడా రాకుండా ఎక్కడికి వెళ్లినట్లు అని జగతి, మహేంద్ర అనుకుంటూనే ఉంటారు. జగతి, మహేంద్ర ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు చాలా సేపటికి. ఇక భోజనం చేసి బయలుదేరుతున్న రిషితో.. ‘సార్ చాలా హ్యాపీగా ఉంది.. మీరు జగతి మేడమ్ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లడం చాలా హ్యాపీ’ అంటుంది వసు. రిషికి జగతి పేరు వినపడగానే కోపం వస్తుంది. (అయితే మాటల మధ్యలో వసు చేతికి ఉన్న రింగ్ జగతి ఇచ్చిందని కూడా తెలుసుకుంటాడు)

ఇక కమింగ్ అప్‌లో వసు జగతి రాగానే.. కంచాలు ప్లేట్స్ చూసి ఏంటిది అని అడగడంతో.. ‘మేడమ్ రిషి సార్ వచ్చారు భోజనం చేసి వెళ్లారు.. గెస్ట్‌గా వచ్చి తిన్నారు’ అంటూ వసు సంబరంగా చెబుతుంటే.. ఉన్నట్టుండి జగతి సీరియస్ అవుతుంది. ‘వాట్.. నువ్వే ఈ ఇంట్లో ఓ గెస్ట్‌వి.. నువ్వు మళ్లీ గెస్ట్‌ని పిలిచి ట్రీట్ ఇస్తావా?’ అంటుంది. ‘వచ్చింది రిషి సారే కదా మేడమ్’ అని వసు బాధగా అడిగితే.. ‘రిషిసార్ వస్తే.. మీ అంతట మీరు వంట చేసుకుంటారు.. వెళ్తారు.. నేను వచ్చి కంచాలు చూసి గుర్తుపట్టి అడగాలా’ అంటూ అరుస్తుంది జగతి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.