యాప్నగరం

Devatha మే 21 ఎపిసోడ్: ఫలించిన మాధవ పన్నాగం.. దేవుడమ్మ పట్టరాని ఆనందం

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘దేవత’ సీరియల్.. నేడు(2022 మే 21)న 550 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Devatha May 21 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 21 May 2022, 12:18 pm
గత ఎపిసోడ్‌లో దేవి తల్లిని రాధమ్మ అని పిలివడంతో రాధ విలవిలాడిపోతుంది. నువ్వు నా బి ఈ క్రమంలోనే నేటి కథనం మరింత కీలకంగా మారింది. మరోవైపు దేవుడమ్మ ఇంటికి వచ్చేయడం, భాగ్యమ్మ.. కమల, బాషాలతో మాట్లాడిన మాటలు విని షాక్ అయిపోతుంది.
Samayam Telugu ‘దేవత’ మే 21 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Devatha May 21 episode


550వ ఎపిసోడ్‌ హైలైట్స్..
నేటి కథనంలో మాధవ కావాలనే.. దేవి వినేలా ఓ కబోర్డ్ ముందు నిలబడి మాట్లాడతాడు. ‘మన బిడ్డకు ఆ రాధ తల్లి అయ్యింది. నువ్వే తల్లివి అని నేను చెప్పలేకపోతున్నాను.. బిడ్డల్ని ఆ రాధ నుంచి దగ్గర చేసుకోలేకపోతున్నా’ అంటూ ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్తాడు. వెంటనే దేవి ఆ కబోర్డ్ తలుపు తీసి.. అందులో దండేసి ఉన్న మాధవ మొదటి ఫొటోని చూసి షాక్ అవుతుంది. ఈవిడ మా అమ్మా అని మనసులోనే మథనడపడుతుంది. అప్పుడే మాధవ రెండు అడుగులు వెనక్కి వేసి దేవి ఎక్స్‌ప్రెషన్స్ చూసి.. మనసులోనే నవ్వుకుంటాడు. మొత్తానికీ దేవి మనసు పూర్తిగా మారిపోయింది. రాధ తన తల్లి కాదు అని తను నమ్ముతుంది.

ఇక దేవుడమ్మ సత్యను ఆసుపత్రికి తీసుకుని వెళ్తాను అంటుంది. అది విన్న ఆదిత్య వద్దు అంటాడు. దాంతో దేవుడమ్మ తనొక గొప్ప సిద్ధాంతిని కలిశాను అని చెబుతూ జరిగింది చెబుతుంది. అతడు ‘మీ బిడ్డ ఆదిత్య జాతకంలో సంతానం రాసి ఉంది. అలాగే రుక్మిణీ చనిపోలేదు.. పూర్ణ ఆయుష్కురాలు.. అంటూ చెప్పాడు. నాకు నమ్మకం కలిగింది అంటూ.. జరిగింది చెబుతుంది. దాంతో సత్య తనకు పిల్లలు పుడతారు అని ఆనందిస్తుంటే.. ఆదిత్య మాత్రం.. ‘రుక్మిణీ బతికే ఉందమ్మా.. కానీ తను మరొకరి భార్యగా ఉందని చెప్పలేక నీతో చెప్పలేకపోతున్నాను’ అంటూ అల్లాడిపోతాడు.

మరోవైపు భాగ్యమ్మ.. అన్న మాటల గురించి దేవుడమ్మ మనసులోనే మథనడపుతుంది.(భాగ్యమ్మ ఆదిత్యకు బిడ్డలు ఉన్నారు. వస్తారు.. మీరు మీ బిడ్డని ఇవ్వడానికి వీల్లేదు అంటూ కమల, బాషాలతో వాదిస్తుంది) అలా ఎందుకు మాట్లాడిందో అర్థం కావట్లేదు అంటూ.. రాజ్యమ్మతో చెప్పుకుని బాధపడుతుంది. ఈ క్రమంలో కథనం ఉత్కంఠగా మారింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! devatha కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.