యాప్నగరం

Guppedantha Manasu సెప్టెంబర్ 15 ఎపిసోడ్: కుమిలి కుమిలి ఏడ్చేసిన ధరణి.. శిరీష్ ఎంట్రీతో కథ అడ్డం

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 సెప్టెంబర్ 15)న 243 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Guppedantha Manasu September 15 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 15 Sep 2021, 11:02 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 సెప్టెంబర్ 15)న 243 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ సెప్టెంబర్ 15 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu September 15 episode


243వ ఎపిసోడ్‌ హైలైట్స్..
రిషి బెడ్ మీద పడుకుని వసు గురించే ఆలోచిస్తూ ఉంటే.. దేవయాని మాత్రం ధరణి దగ్గరకు వచ్చి.. ‘ఈరోజు ఆ వసుధరతో ఊరంతా తిరిగి వచ్చాడట.. రిషి.. విషయం ఏంటో అడిగి తెలుసుకో’ అంటుంది కోపంగా. దాంతో ‘అది సంస్కారం కాదు కదా అత్తయ్యా’ అనేసరికి.. ‘దద్దమ్మా.. దద్దమ్మా.. అందుకే కదా నీ కొడుకు నిన్ను దూరం పెట్టేది.. నీ మొహం కూడా చూడటం లేదు’ అంటూ అవమానిస్తుంది. కళ్లల్లో నీళ్లు తిరిగిపోతాయి ధరణికి. ఏడవడం చూసిన దేవయాని.. ‘ఏదైనా అంటే ఏడుస్తావ్.. చీచీ.. అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది కోపంగా. సరిగ్గా అప్పుడే మెట్లు దిగిన రిషి ధరణి ఏడవడం చూసి ‘వదినకు ఏం అయ్యింది’ అనుకుంటాడు మనసులో.

కాసేపు ఆగి.. ధరణి దగ్గరకు వెళ్లి.. ‘కన్నీళ్లు కార్చే కష్టం ఏం వచ్చింది వదినా..? ఏం అయ్యిందో చెప్పండి.. లేదంటే పెద్దమ్మని పిలుస్తాను’ అంటాడు. దాంతో ‘వద్దు రిషి.. వదిలెయ్ ప్లీజ్’ అంటుంది ధరణి. ఇంతలో మహేంద్ర వచ్చి.. ధరణి ఏడుస్తుందని అర్థం చేసుకుని.. ‘తను ఇప్పుడు చెప్పడం లేదంటే ఆ బాధ ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకుందాం రిషి.. పదా..’ అంటాడు. వెంటనే ‘నువ్వు ఈ ఇంట్లో ఎన్ని కష్టాలు మాటలు పడుతున్నావో నాకు తెలుసు.. అంటాడు మహేంద్ర. రిషి పదా కాసేపు తనని ఒంటరిగా వదిలేద్దాం’ అంటూ రిషిని అక్కడ నుంచి తీసుకుని వెళ్తాడు.

ఇక పక్కకు వచ్చిన తర్వాత.. ‘ఈరోజు చాలా అద్భుతంగా గడిచిందట కదా? వసుధర శిరీష్‌కి..’ అంటూ మహేంద్ర పూర్తిగా చెప్పకముందే.. ‘అందరికీ టామ్ టామ్ చేసిందా? ఈ యూత్ ఐకాన్‌కి బుద్ధి ఉండక్కర్లేదా? అంటూ రగిలిపోతాడు. కోపంగా పైకి వెళ్లిపోతాడు. మరునాడు ఉదయాన్నే వసు రావడమే ‘శిరీష్‌కి ఎందుకు చెప్పావ్ అంటూ చడామడా తిట్టిపోతాడు. ఇక అటుగా వచ్చిన జగతిని ఆపి మరీ.. ‘శిరీష్‌కి ఎక్కువ వెయిట్ ఇస్తున్నారు.. వసుధరకు ఏది చెప్పొచ్చు చెప్పొద్దు అని నేర్పించరా మీరు?’ అంటూ క్లాస్ పీకుతుంటాడు.

కమింగ్ అప్‌లో..
శిరీష్‌ వసుకి కాల్ చేసి.. అర్జెంట్ పని అని చెప్పి వసుని తీసుకుని వెళ్లిపోతాడు. రిషి వసుకి కాల్ చేస్తే శిరీష్ కట్ చేస్తాడు. అయితే మెషిన్ ఎడ్యుకేషన్ మీటింగ్‌కి వసు రాలేదని మిస్టర్ ఇగో మీటింగ్ ఆపేసి మరీ.. జగతికి క్లాస్ తీసుకుంటాడు. ‘వసుధర బయటికి వెళ్లినప్పుడు మీ పర్మీషన్ తీసుకుందా? అలా ఎలా పంపించారు’ అంటూ రెచ్చిపోతుంటాడు. మొత్తానికి జగతి ఇరుక్కుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.