యాప్నగరం

డ్రామా జూనియర్స్ ‘బాలయ్య’ గోకుల్ కన్నుమూత

జూనియర్ బాలకృష్ణగా గుర్తింపు తెచ్చుకున్న ‘డ్రామా జూనియర్స్’ బాల నటుడు గోకుల్ సాయికృష్ణ మృతిచెందాడు. డెంగ్యూతో బాధపడుతూ తుదిశ్వాస విడిచాడు.

Samayam Telugu 18 Oct 2019, 3:41 pm
జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ షోలో నందమూరి బాలకృష్ణగా మెప్పించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాల నటుడు గోకుల్ సాయికృష్ణ కన్నుమూశాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతోన్న గోకుల్ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
Samayam Telugu Gokul_Sai
గోకుల్ సాయికృష్ణ


చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన గోకుల్ డ్రామా జూనియర్స్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సింహా’ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగులను అవలీలగా చెప్పేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాలకృష్ణ మేనరిజంతో ఆకట్టుకున్నాడు. జూనియర్ బాలయ్యగా పేరు తెచ్చుకున్నాడు. ఆఖరికి ఆ నటసింహా నందమూరి బాలకృష్ణనూ కలిశాడు.

Also Read: గోకుల్ మృతి నా మనసును కలచివేసింది: బాలకృష్ణ

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరై మంచి భవిష్యత్తు ఉన్న బాల నటుడు గోకుల్‌ను విధి వెక్కిరించింది. గోకుల్ మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలకృష్ణ అభిమానులు కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు. గోకుల్ మృతికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.