కామెడీ చేసే క్రమంలో ఎందరో కమెడియన్లు చేయకూడని పనులు చేసి.. చిక్కుల్లోపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా కమెడియన్లు వివాదంలో చిక్కుకోవడంలో ఏ ఇండస్ట్రీ కూడా మినహాయింపు కాదు. కొన్ని సందర్భాల్లో అయితే.. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ.. కొన్ని సంఘాలకు చెందిన వాళ్లు దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వాళ్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం.. లేదా తాము చేసిన ఆ స్కిట్లు లేదా సీన్లు తొలగించడం జరిగింది. ఇక జాతీయస్థాయిలో పాపులారిటీ సాధించిన.. ‘ది కపిల్ శర్మ షో’కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.
సోనీ టీవీలో ప్రసారమయ్యే ఈ షోపై తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లా కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అందుకు బలమైన కారణం కూడా ఉంది. ఈ ఏప్రిల్లో ప్రసారమైన ఓ ఎపిసోడ్లో ఈ షోలో చేసే ఓ పాత్రధారి కోర్టు రూమ్ సన్నివేశంలో మందు తాగుతున్నట్లు చిత్రీకరించాు. దీంతో దీన్ని కోర్టును అవమానించడమే అని భావించిన లాయర్ సురేష్ ధాఖడ్ ఈ షోపై సెక్షన్ 356/3 కింద శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కచ్చితంగా కోర్టును అవమానించడమే అని ఆయన మండిపడ్డారు. ఈ షోని వెంటనే నిలిపివేయాలి అని ఆయన అన్నారు.
ఈ షోలో కేవలం ఇది ఒకటే కాదు అని.. చాలా విషయాలు అభ్యంతరకరంగా ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. ఈ షోలో మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు, కామెంట్లు చేస్తుంటారు అని ఆయన అన్నారు. ఇలాంటి షోలు ప్రసారం కావడం వల్ల ప్రజలకు తప్పుడు సందేశాలు చేరుతాయి అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ షోలో వ్యాఖ్యాతగా కపిల్ శర్మ వ్యవహరిస్తుండగా.. సుమోనా చక్రవర్తి, భారతి సింగ్, కృష్ణ అభిషేక్, సుదేశ్ లేహ్రీ తదితరులు నటీనటులుగా చేస్తున్నారు. మరి ఈ ఎఫ్ఆర్ఐపై సోనీ టీవీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.
సోనీ టీవీలో ప్రసారమయ్యే ఈ షోపై తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లా కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అందుకు బలమైన కారణం కూడా ఉంది. ఈ ఏప్రిల్లో ప్రసారమైన ఓ ఎపిసోడ్లో ఈ షోలో చేసే ఓ పాత్రధారి కోర్టు రూమ్ సన్నివేశంలో మందు తాగుతున్నట్లు చిత్రీకరించాు. దీంతో దీన్ని కోర్టును అవమానించడమే అని భావించిన లాయర్ సురేష్ ధాఖడ్ ఈ షోపై సెక్షన్ 356/3 కింద శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కచ్చితంగా కోర్టును అవమానించడమే అని ఆయన మండిపడ్డారు. ఈ షోని వెంటనే నిలిపివేయాలి అని ఆయన అన్నారు.
ఈ షోలో కేవలం ఇది ఒకటే కాదు అని.. చాలా విషయాలు అభ్యంతరకరంగా ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. ఈ షోలో మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు, కామెంట్లు చేస్తుంటారు అని ఆయన అన్నారు. ఇలాంటి షోలు ప్రసారం కావడం వల్ల ప్రజలకు తప్పుడు సందేశాలు చేరుతాయి అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ షోలో వ్యాఖ్యాతగా కపిల్ శర్మ వ్యవహరిస్తుండగా.. సుమోనా చక్రవర్తి, భారతి సింగ్, కృష్ణ అభిషేక్, సుదేశ్ లేహ్రీ తదితరులు నటీనటులుగా చేస్తున్నారు. మరి ఈ ఎఫ్ఆర్ఐపై సోనీ టీవీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.