యాప్నగరం

Karthika Deepam మే 22 ఎపిసోడ్: ‘మమ్మీ నేను తప్పు చేశా.. నువ్వెంత చెప్పినా వినకుండా దీపకు నరకం చూపించా’

కుమిలి కుమిలి ఏడ్చి.. క్షమాపణలు చెప్పడానికి కార్తీక్ దీప దగ్గరకు బయలుదేరాడు. బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 మే 22)న 1046 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 24 May 2021, 8:17 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 మే 22)న 1046 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.
Samayam Telugu ‘కార్తీకదీపం’ మే 22 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam serial today


1046వ ఎపిసోడ్‌ హైలైట్స్..
సౌందర్య పిల్లపై కోపపడుతుంది. ‘నా కొడుకు మిమ్మల్ని వదిలి వెళ్లిపోతాడని ఎలా అనుకున్నారే..’ అంటూ తిట్టిపోస్తుంది. దాంతో పిల్లలు సారీ చెబుతారు. దాంతో సౌందర్య.. ‘పిల్లలితో కార్తీక్ మంచి తనం, దీప గొప్పతనం గురించి చాలా వివరంగా.. జరిగిన కథనంతా పిల్లల భాషలో చెబుతుంది. దాంతో పిల్లలు.. ‘అమ్మా నాన్న ఇంత గొప్పవాళ్లా అంటూ ఎమోషనల్ అవుతారు. ‘మీ అమ్మకు నాన్నకు మధ్యలో కాలుష్యం ఉంది.. అది తొలగిపోతే అంతా సంతోషమే’ అని కూడా చెబుతుంది. తర్వాత పిల్లల్ని గుండెలకు హత్తుకుని.. ‘మీ అమ్మని ఎంత ఖర్చు అయినా సరే బతికించుకుని తీరాలి’ అని తనలో తనే కుమిలిపోయే సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.

సీన్ కట్ చేస్తే కార్తీక్ కారు డ్రైవ్ చేస్తూ వెళ్తూ.. డాక్టర్ చెప్పిన నిజం గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. ‘మీరు అబద్దం అనేది నిజం.. మీరు నిజం అనుకునేదే అబద్దం.. ఈ నిజానికి అబద్దానికి మధ్య ఉన్న తేడా చెరిగిపోవాలంటే కావాల్సింది నా మీద నమ్మకం..’ అని దీప వాదించిన మాటలు.. ‘దీప నిప్పురా.. విహారీకి పిల్లలే పుట్టరని తెలిశాక ఇక దీప తప్పు లేనట్లే..’ అంటూ సౌందర్య చెప్పిన మాటలు.. తలుచుకుంటూ.. సడన్‌గా కారు ఆపేస్తాడు. దీప ఇల్లు వదిలి వెళ్లిపోవడం తలుచుకుంటాడు. ‘మనకి కవలలు పుట్టారు డాక్టర్ బాబు.. అబద్దాన్ని నమ్మి.. మీ కన్నబిడ్డల్ని అనాధలుగా మార్చకండీ..’ అని దీప కుమిలి కుమిలి ఏడ్చిన సీన్, ‘నీతి మాలిన దానా.. పో అవతలికి’ అని కాలితో తన్నిన సీన్.. తలుచుకుంటూ ఏడుస్తాడు.

‘మమ్మీ నేను తప్పు చేశాను మమ్మీ.. నువ్వు ఎంత చెప్పినా నమ్మకుండా దీపకు నరకం చూపించాను మమ్మీ.. చిత్రవధ చేశాను.. గాయపడిన మనసుని మళ్లీ మళ్లీ ఎన్నో సార్లు గాయం చేశాను.. నిజంగా దీపా భూదేవి లాంటిదే మమ్మీ.. అది దీప కాబట్టి.. ఇంకా ఇంకా ఇంకా నన్ను ప్రేమిస్తోనే ఉంది. మారతానన్న నమ్మకంతోనే ఉంది..’ అని ఏడుస్తూ చాలా మదనపడతాడు. ‘ఎంతో మంది పతివ్రతలు శీల పరీక్ష కోసం అగ్ని ప్రవేశం చేశారు.. కానీ ఒక్కసారే.. నేను పదేళ్లగా అగ్ని ప్రవేశం చేస్తూనే ఉన్నా డాక్టర బాబు’ అని దీప అన్న మాటల్ని తలుచుకుని ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతాడు.

‘దీపా.. దీపా.. ఎప్పటికైనా మీకు నిజం తెలుస్తుందని.. ఆ రోజు నీకంటే నేనే ఎక్కువ బాధపడతానని ఎన్నో సార్లు అన్నావ్.. అది నిజం దీపా.. నాకు నిజం తెలిసింది. కానీ ఈ నిజం నిప్పులా నా గుండెల్ని కాల్చేస్తుంది. నా అహంకారాన్ని బూడిద చేస్తోంది. నేను తప్పు చేశాను.. పొరపాటు చేశాను.. నేరం చేశాను.. ఘోరమైన పాపం చేశాను.. అమానుషంగా ప్రవర్తించాను.. నిన్నే కాదు.. మన బిడ్డల్ని కూడా పరాయివాళ్లలా చూశాను.. నీ మాతృత్వాన్ని చాలా అవమానించాను.. ఏం చేస్తే.. ఈ పాపనికి ప్రాయిశ్చిత్తం దొరుకుతుంది? ఏం చేస్తే ఈ పాపానికి ప్రాయిశ్చిత్తం దొరకుతుంది..? ఏం చేస్తే నీ ముందు నేనొక మనిషిలా నిలబడగలుగుతాను? ఏమీ చెయ్యలేను.. ఏమీ చెప్పలేను.. నాకు ఎలాంటి అర్హతా లేదు.. నా చదువు, నా సంస్కారం, నా సర్వస్వం ఇవన్నీ ఎందుకు పనికి రాకుండా పోయాయి.. నన్ను పేదవాడ్ని చేశాయి.. ఉత్త చేతులతో నీ ముందు నిలబడతాను.. వస్తున్నాను దీపా.. వస్తున్నాను.. నీ దగ్గరకు వస్తున్నాను.. వస్తున్నాను దీపా..’ అంటూ కారు తీసుకుని కార్తీక్ బయలుదేరతాడు. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.

కమింగ్
అప్‌లో..
దీప.. ‘అత్తయ్యా.. ఆయన ఆయన నేను చచ్చిపోతే మోనితని చేసుకుంటాడా? నేను సవతి తల్లి దగ్గర పెరిగి నరకం చూశాను అత్తయ్యా.. నా బిడ్డలకి ఆ నరకం వద్దు’ అని ఏడుస్తూ సోఫాలో కుప్పకూలిపోతుంది. సౌందర్య దీపా దీపా అని అరవడంతో.. పిల్లలు కంగారుగా దీపని లేపే ప్రయత్నం చేస్తారు. కానీ దీప లేవదు. మురళీ కృష్ణ, కార్తీక్‌లు కలిసి దీప ఇంటికి వచ్చేసరికి.. దీపకోసం సౌందర్య, పిల్లలు కంగారుపడతుంటారు. దాంతో కార్తీక్ లోపలకి పరుగుతీస్తాడు. దీపా దీపా.. అని గుండెలపై జారేసుకుని అరుస్తూనే ఉంటాడు. సౌందర్య తెచ్చిన వాటర్ దీపకు తాగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ దీప గొంతులోకి నీళ్లు పోకుండా బయటికి కారిపోతాయి. అది చూసి దీప చచ్చిపోయినట్లు ప్రేక్షకులకు క్లారిటీ వస్తుంది. కార్తీక్‌ షాక్‌లో ఉంటాడు. మరి డైరెక్టర్‌గారు దీపని బతికిస్తారా..? అంతా ఊహించినట్లే చంపేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. వంటలక్క లాంటి మహానటి లేకుండా సీరియల్‌ని నడిపించడం కష్టమే మరి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘కార్తీకదీపం’ కొనసాగుతోంది.
Premi Viswanath: కన్నుమూసిన దీప, ముగిసిన పాత్ర.. ఊహించని ట్విస్ట్‌తో ఫ్యాన్స్‌లో ఆందోళనguppedantha manasu today Guppedantha Manasu మే 22 ఎపిసోడ్: వసుధరకు సూపర్ సర్పైజ్ ఇచ్చిన రిషి.. మనసుల్ని గెలుస్తున్న క్యూట్ కపుల్vadinamma serial today episode ‘వదినమ్మ’ మే 22 ఎపిసోడ్: ఉత్కంఠగా మారిన కథనం, మనసుల్ని మెలిపెట్టే సీన్intinti gruhalakshmi today episode
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.