యాప్నగరం

మానవత్వాన్నిరేప్ చేశారు: యాంకర్ రష్మి ఎమోషనల్ పోస్ట్

అత్యంత జుగుప్సాకరమైన ఈ ఘటనను సామాన్య ప్రజానికమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఖండిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు సన్ని లియోన్, అభిషేక్ బచ్చన్, రవీనా టండన్, సిద్దార్థ్ మల్హోత్రా తదితరులు తమ స్పందనల్ని తెలియజేయగా.. టాలీవుడ్ నుండి యాంకర్ రష్మి రియాక్ట్ అవుతూ.. ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Samayam Telugu 8 Jun 2019, 7:24 pm
మానవత్వం మంటగలిసింది.. ముక్కుపచ్చలారని రెండేళ్ల చిన్నారి ట్వింకిల్ శర్వను పదివేల అప్పుకోసం అత్యంత పాశవికంగా కనుగుడ్లు పేకేసి గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని తీసుకెళ్లి చెత్తకుప్పల్లో పడేశారు. ఆ చిన్నారి శరీరాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. అత్యంత దారుణమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ ప్రాంతంలో జరగగా.. నిందితుడు మహ్మద్ జాహిద్‌ను బహిరంగంగా ఉరితీయాలని సోషల్ మీడియాలో #JusticeforTwinkleSharma హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్లు స్పందనలు తెలియజేస్తున్నారు.
Samayam Telugu Justice for Twinkle Sharma


అత్యంత జుగుప్సాకరమైన ఈ ఘటనను సామాన్య ప్రజానికమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఖండిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు సన్ని లియోన్, అభిషేక్ బచ్చన్, రవీనా టండన్, సిద్దార్థ్ మల్హోత్రా తదితరులు తమ స్పందనల్ని తెలియజేయగా.. టాలీవుడ్ నుండి యాంకర్ రష్మి రియాక్ట్ అవుతూ.. ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

‘ట్వింకిల్.. ట్వింకిల్.. లిటిల్ స్టార్.. హౌ వుయ్ వండర్ హౌ యు ఆర్. కఠినమైన చట్టాలు రావడానికి ఇంకా ఎంత మంది బలవ్వాలి. మానవత్వాన్ని రేప్ చేస్తున్నారు’ అంటూ ‘జస్టిస్ ఫర్ ట్వింకిల్’ హ్యాష్‌ ట్యాగ్‌తో భావోద్వేగ ట్వీట్‌ను షేర్ చేశారు రష్మి.

యాంకర్ రష్మి ట్వీట్‌పై నెటిజన్ల నుండి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి వాళ్లకు బహిరంగంగా ఉరితీయాలని చాలా మంది స్పందనలు తెలియజేస్తుండగా.. కఠినమైన చట్టాలు వస్తాయన్న నమ్మకం మాకైతే లేదు. మీరు నమ్ముతున్నారా? అంటూ మరో నెటిజన్ స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.