యాప్నగరం

‘ఇంటింటి గృహలక్ష్మి’ ట్విస్ట్! నందు లాస్యలకు తులసి స్ట్రాంగ్ వార్నింగ్.. ‘ఇద్దర్నీ వదలను’

‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ రోజు రోజుకి ఆసక్తిగా మారుతోంది. ఈ తరుణంలో తులసి విషయంలో నందు తప్పుడు నిర్ణయం తీసుకున్నానని మెల్లమెల్లగా నందు అర్థం చేసుకుంటున్నాడు. సరిగ్గా అదే టైమ్‌కి దివ్య ఆత్మహత్యయత్నం చెయ్యడం కథను మరో మలుపు తిప్పింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 1 Nov 2020, 2:34 pm
తులసి నుంచి నందుని దివ్యని దూరం చెయ్యడంలో లాస్య గెలిచింది. విడాకులు కూడా అప్లై చెయ్యడంతో కథ ఉత్కంఠగా మారింది. ఈ తరుణంలో మరో ట్విస్ట్.. తులసి గుండెల్లో అగ్నిపర్వతాన్ని రగిల్చింది. అదే దివ్య ఆత్మహత్యాయత్నం. నేటి(అక్టోబర్ 31) ఎపిసోడ్‌లో దివ్య చాలా బాధకు, మానసిక వ్యథకు లోనవుతుంది. దానికి కారణం లాస్య కూడా కావడంతో పాటు.. దివ్య తన తల్లి తులసిని తప్పుగా అర్థం చేసుకోవడం కూడా.
Samayam Telugu ‘ఇంటింటి గృహలక్ష్మి’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
Intinti Gruhalakshmi Promo


దివ్య చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం.. నందు చూసి దివ్యని హాస్పెటల్‌లో పెట్టడం.. తులసికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో తులసి తన ఇద్దరు కొడుకుల్ని సాయం తీసుకుని హాస్పెటల్‌కి బయలుదేరడం నేటి ఎపిసోడ్‌లో హైలైట్స్.. అయితే హాస్పెటల్‌లో నందుని ఓదార్చడానికి ప్రయత్నించిన లాస్యను.. ‘నా దివ్యకు ఏమైనా కావాలి.. అప్పుడు ఉంటుంది’ అంటూ నందు ఫైర్ కావడంతో లాస్య కూడా రివర్స్ అవుతుంది. ‘ఇదంతా నావల్లే జరిగిందంటావా నందు?’ అంటూ కోపం తెచ్చుకుంటుంది లాస్య. అయితే ఇప్పటికే లాస్య, నందుల మధ్య వచ్చిన గ్యాప్‌కి దివ్య ఆత్మహత్యాయత్నం మరింత ఆథ్యంపోసినట్లే అనుకోవచ్చు.
Read also: ‘ఇంటింటి గృహలక్ష్మి’ అక్టోబర్ 31 ఎపిసోడ్! షాకింగ్ ట్విస్ట్! దివ్య ఆత్మహత్యాయత్నం.. లాస్యకి మూడింది..

ప్రోమో హైలైట్స్..
సోమవారం రాబోయే కమింగ్ అప్‌లో తులసి హాస్పెటల్‌కి వస్తుంది. బెడ్ మీద చికిత్స పొందుతున్న దివ్యని చూసి.. ‘అయ్యో దివ్యా’ అంటూ బాగా ఏడుస్తుంది. బయటికి వచ్చి లాస్యతో.. ‘లాస్య ఆంటీ ఇంట్లో సంతోషంగా ఉంటాను.. అక్కడ హాయిగా ఉంటాను అని చెప్పి నీ దగ్గరకు వచ్చింది.. తనని ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావ్’ అంటూ లాస్యని నిలదీస్తుంది తులసి. దాంతో ‘నేనేదో దగ్గరుండి ఆత్మహత్యప్రయత్నం చేయించినట్లు అలా మాట్లాడతావేంటీ..’ అంటూ రివర్స్ అవుతుంది. ‘ఇప్పుడు దివ్యని ఏం చేద్దాం అని ప్లాన్ చేశావో ఎవరికి తెలుసు?’ అంటూ ప్రేమ్ కూడా లాస్య మీద ఫైర్ అవుతాడు. ఇంతలో తులసి ఆవేశంగా.. ‘దివ్యకి ఏమైనా అవ్వాలి మీ ఇద్దర్ని వదలను..’ అంటూ నందు, లాస్యలకు ఇద్దరికీ కలిపి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది తులసి. మొత్తానికి దివ్య ఇకనైనా తల్లి గొప్పతనం తెలుసుకుంటే కథ మరింత ఆసక్తిగా మారుతుంది.
Read also: ‘కార్తీకదీపం’ సూపర్ ట్విస్ట్! ‘దీప ఏ తప్పు చెయ్యలేదు అంతా మౌనితే చేసింది’ కార్తీక్ ముందు నిజం..
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.