‘ఇంటింటి గృహలక్ష్మి’(gruhalakshmi) సీరియల్ రోజుకో ట్విస్ట్తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 241 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. 243 ఎపిసోడ్కి నేడు(2021 ఫిబ్రవరి 15)న ఎంటర్ అయ్యింది.
243 ఎపిసోడ్ హైలైట్స్..
లాస్య ఇంటర్వ్యూకి వెళ్లి తిరిగి రావడమే.. నిరాశగా రగిలిపోతూ కనిపిస్తుంది. అనసూయ ‘సెలక్ట్ అయిపోయావా?’ అని అడిగితే.. లేదు.. బ్యాడ్ లక్ అని చెప్పేసరికి.. అనసూయ లాస్యని ఓదారుస్తుంది. సరిగ్గా అప్పుడే తులసి వస్తుంది. తులసి రాగానే తులసి మామగారు సంతోషంగా.. ‘వచ్చావా అమ్మా.. ఆఫీస్ మొదటి రోజు ఎలా ఉంది? ఎలా గడిచింది?’ అని అడగడంతో.. తులసి నవ్వుతూ.. ‘అంతా బాగానే ఉంది మావయ్యా.. నేను భయపడినట్లుగా ఏం లేదు..’ అంటుంది.
ఇంతలో దివ్య, అభి, ప్రేమ్, అంకిత.. ఇలా పిల్లలంతా అంతా వచ్చి.. తులసిని చుట్టేస్తూ సంతోషంగా.. ‘మొదటి రోజు ఎలా ఉంది? మాకు ఏం తెచ్చారు?’ అని సంబరంగా అడగడంతో.. తులసి తన చేతిలోని పిజ్జా, బర్గర్స్ దివ్య చేతిలో పెట్టి.. ‘మీకు ఇవే ఇష్టం కదా.. అందుకే తెచ్చాను..’ అంటుంది. దాంతో అనసూయ ఆవేశంగా.. ‘మీ మావయ్య నీకు ఇచ్చిన ఫెక్షన్ డబ్బుని ఇలా వాడేస్తున్నావా.. వృధా చేస్తున్నావా.. మనకు డబ్బు ఎంత అవసరమో తెలుసుకదా?’ అంటూ నిందలు, మాటలతో తులసిని బాధపెడుతుంది.
దాంతో తులసి కోపంగా.. ‘ఇవి నా కష్టార్జితం అత్తయ్యా.. మావయ్యగారి డబ్బుని నేను ఎందుకు వృధా చేస్తాను?’ అని తిరగబడి అడగడంతో.. అనసూయ మరింత రెచ్చిపోతుంది. ‘మాంచి ఉద్యోగం వచ్చేసరికి మాటల్లో మార్పు వస్తోందే? మీ, నా అని ఎంత వేరు చేసి మాట్లాడుతున్నావ్? ఎంత పొగరు నీకు?’ అంటూ మరింతగా అవమానిస్తుంది తులసిని. సరిగ్గా అప్పుడే నందు రావడంతో.. ‘చూశావారా నందు.. నీ భార్య ఎంత స్వార్థపరురాలో’ అంటూ అరుస్తుంది. అయితే నందు తులసి తన డబ్బుతోనే పిల్లలకు పిజ్జాలు తెచ్చిందని తెలసుకుని తులసికే సపోర్ట్గా మాట్లాడతాడు. ‘అందులో తప్పు ఏం ఉందమ్మా.. తులసి ఏదొకటి అనాల్సిందే అన్నట్లుగా మాట్లాడొద్దమ్మా’ అని తిట్టి వెళ్లిపోతాడు. నందు మాటలకు లాస్య షాక్ అవుతుంది. కోపంగా లోపలికి వెళ్లిపోతుంది.
మరునాడు ఉదయం రోహిత్ తులసికి ఫోన్ చేసి.. ‘తులసి పది నిమిషాల్లో బయట ఉంటాను.. నువ్వు వచ్చెయ్.. ఈ రోజు కారు డ్రైవర్ సెలవు పెట్టాడు. వెళ్తూ వెళ్తూ నిన్ను పికప్ చేసుకుంటాను’ అనడంతో తులసి హడావుడిగా బయలుదేరుతుంది. అయితే తులసికి ఎదురుగా 20 లక్షలు ఇచ్చిన సేటు.. కోపంగా నిలబడి.. ‘నా డబ్బు నాకు ఇప్పుడు ఇస్తారా చస్తారా?’ అని కూర్చోవడంతో.. నందు తులసిని మళ్లీ ఆ డబ్బు ఏం చేశావ్ అని నిలదీస్తాడు. దాంతో ప్రేమ్ బాధగా.. ‘అమ్మకి సపోర్ట్ చేయకుండా అలా మాట్లాడతారేంటీ నాన్నా?’ అనేసరికి రోహిత్ లోపలికి వస్తాడు. ఆ రచ్చంతా చూసి ఏం అయ్యింది అని అడిగి అంతా తెలుసుకుంటాడు. వెంటనే 20 లక్షల చెక్ రాసి.. తులసికి ఇస్తుంటే తులసి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ‘నేను అలా తీసుకోలేను రోహిత్.. అది నా వల్ల కాదు’ అంటుంది తులసి. నందు రగిలిపోతూ ఉంటాడు.
కమింగ్ అప్లో..
నందు, లాస్య, అనసూయ ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు. ‘ఏదో పది రూపాయలు నోటి తీసి ఇచ్చినట్లు 20 లక్షలు చెక్ రాసి ఇచ్చాడేంట్రా?’ అంటుంది అనసూయ అయోమయంగా. ‘అసలు తులసి దగ్గర ఏం ఉందని? గొప్పగా చదువుకోలేదు..పది కంపెనీల్లో పని చేసిన అనుభవమూ లేదు.. అయినా పెద్ద ఉద్యోగం ఇచ్చాడు.. ఇదంతా చూస్తుంటే ఆయన ఉధారస్వభావం అనుకోవాలో తెలియట్లేదు.. ఇంకేమైనా ఉద్దేశాలు ఉన్నాయో తెలయట్లేదు..’ అంటూ నందుకు ఎక్కిస్తుంది లాస్య. అదంతా దివ్య వింటుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘ఇంటింటి గృహలక్ష్మి’ కొనసాగుతోంది.
Read also: ‘వదినమ్మ’ ఫిబ్రవరి 13 ఎపిసోడ్: సీత ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ.. రఘురాం తల్లికి భాస్కర్ ఇంట్లో అవమానం..(vadinamma serial)
Read also: ‘కార్తీకదీపం’ ఫిబ్రవరి 15 ఎపిసోడ్: మరో ఆధారం సిద్ధం.. ‘ఇదే నిజం నూటికి నూరుపాళ్లు దీప కాపురాన్ని నిలబడుతుంది’ కన్నీళ్లతో విహారీ భార్య(karthika deepam serial)
243 ఎపిసోడ్ హైలైట్స్..
లాస్య ఇంటర్వ్యూకి వెళ్లి తిరిగి రావడమే.. నిరాశగా రగిలిపోతూ కనిపిస్తుంది. అనసూయ ‘సెలక్ట్ అయిపోయావా?’ అని అడిగితే.. లేదు.. బ్యాడ్ లక్ అని చెప్పేసరికి.. అనసూయ లాస్యని ఓదారుస్తుంది. సరిగ్గా అప్పుడే తులసి వస్తుంది. తులసి రాగానే తులసి మామగారు సంతోషంగా.. ‘వచ్చావా అమ్మా.. ఆఫీస్ మొదటి రోజు ఎలా ఉంది? ఎలా గడిచింది?’ అని అడగడంతో.. తులసి నవ్వుతూ.. ‘అంతా బాగానే ఉంది మావయ్యా.. నేను భయపడినట్లుగా ఏం లేదు..’ అంటుంది.
ఇంతలో దివ్య, అభి, ప్రేమ్, అంకిత.. ఇలా పిల్లలంతా అంతా వచ్చి.. తులసిని చుట్టేస్తూ సంతోషంగా.. ‘మొదటి రోజు ఎలా ఉంది? మాకు ఏం తెచ్చారు?’ అని సంబరంగా అడగడంతో.. తులసి తన చేతిలోని పిజ్జా, బర్గర్స్ దివ్య చేతిలో పెట్టి.. ‘మీకు ఇవే ఇష్టం కదా.. అందుకే తెచ్చాను..’ అంటుంది. దాంతో అనసూయ ఆవేశంగా.. ‘మీ మావయ్య నీకు ఇచ్చిన ఫెక్షన్ డబ్బుని ఇలా వాడేస్తున్నావా.. వృధా చేస్తున్నావా.. మనకు డబ్బు ఎంత అవసరమో తెలుసుకదా?’ అంటూ నిందలు, మాటలతో తులసిని బాధపెడుతుంది.
దాంతో తులసి కోపంగా.. ‘ఇవి నా కష్టార్జితం అత్తయ్యా.. మావయ్యగారి డబ్బుని నేను ఎందుకు వృధా చేస్తాను?’ అని తిరగబడి అడగడంతో.. అనసూయ మరింత రెచ్చిపోతుంది. ‘మాంచి ఉద్యోగం వచ్చేసరికి మాటల్లో మార్పు వస్తోందే? మీ, నా అని ఎంత వేరు చేసి మాట్లాడుతున్నావ్? ఎంత పొగరు నీకు?’ అంటూ మరింతగా అవమానిస్తుంది తులసిని. సరిగ్గా అప్పుడే నందు రావడంతో.. ‘చూశావారా నందు.. నీ భార్య ఎంత స్వార్థపరురాలో’ అంటూ అరుస్తుంది. అయితే నందు తులసి తన డబ్బుతోనే పిల్లలకు పిజ్జాలు తెచ్చిందని తెలసుకుని తులసికే సపోర్ట్గా మాట్లాడతాడు. ‘అందులో తప్పు ఏం ఉందమ్మా.. తులసి ఏదొకటి అనాల్సిందే అన్నట్లుగా మాట్లాడొద్దమ్మా’ అని తిట్టి వెళ్లిపోతాడు. నందు మాటలకు లాస్య షాక్ అవుతుంది. కోపంగా లోపలికి వెళ్లిపోతుంది.
మరునాడు ఉదయం రోహిత్ తులసికి ఫోన్ చేసి.. ‘తులసి పది నిమిషాల్లో బయట ఉంటాను.. నువ్వు వచ్చెయ్.. ఈ రోజు కారు డ్రైవర్ సెలవు పెట్టాడు. వెళ్తూ వెళ్తూ నిన్ను పికప్ చేసుకుంటాను’ అనడంతో తులసి హడావుడిగా బయలుదేరుతుంది. అయితే తులసికి ఎదురుగా 20 లక్షలు ఇచ్చిన సేటు.. కోపంగా నిలబడి.. ‘నా డబ్బు నాకు ఇప్పుడు ఇస్తారా చస్తారా?’ అని కూర్చోవడంతో.. నందు తులసిని మళ్లీ ఆ డబ్బు ఏం చేశావ్ అని నిలదీస్తాడు. దాంతో ప్రేమ్ బాధగా.. ‘అమ్మకి సపోర్ట్ చేయకుండా అలా మాట్లాడతారేంటీ నాన్నా?’ అనేసరికి రోహిత్ లోపలికి వస్తాడు. ఆ రచ్చంతా చూసి ఏం అయ్యింది అని అడిగి అంతా తెలుసుకుంటాడు. వెంటనే 20 లక్షల చెక్ రాసి.. తులసికి ఇస్తుంటే తులసి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ‘నేను అలా తీసుకోలేను రోహిత్.. అది నా వల్ల కాదు’ అంటుంది తులసి. నందు రగిలిపోతూ ఉంటాడు.
కమింగ్ అప్లో..
నందు, లాస్య, అనసూయ ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు. ‘ఏదో పది రూపాయలు నోటి తీసి ఇచ్చినట్లు 20 లక్షలు చెక్ రాసి ఇచ్చాడేంట్రా?’ అంటుంది అనసూయ అయోమయంగా. ‘అసలు తులసి దగ్గర ఏం ఉందని? గొప్పగా చదువుకోలేదు..పది కంపెనీల్లో పని చేసిన అనుభవమూ లేదు.. అయినా పెద్ద ఉద్యోగం ఇచ్చాడు.. ఇదంతా చూస్తుంటే ఆయన ఉధారస్వభావం అనుకోవాలో తెలియట్లేదు.. ఇంకేమైనా ఉద్దేశాలు ఉన్నాయో తెలయట్లేదు..’ అంటూ నందుకు ఎక్కిస్తుంది లాస్య. అదంతా దివ్య వింటుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘ఇంటింటి గృహలక్ష్మి’ కొనసాగుతోంది.
Read also: ‘వదినమ్మ’ ఫిబ్రవరి 13 ఎపిసోడ్: సీత ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ.. రఘురాం తల్లికి భాస్కర్ ఇంట్లో అవమానం..(vadinamma serial)
Read also: ‘కార్తీకదీపం’ ఫిబ్రవరి 15 ఎపిసోడ్: మరో ఆధారం సిద్ధం.. ‘ఇదే నిజం నూటికి నూరుపాళ్లు దీప కాపురాన్ని నిలబడుతుంది’ కన్నీళ్లతో విహారీ భార్య(karthika deepam serial)