యాప్నగరం

Green India Challenge: జబర్దస్త్ రాకేష్ సవాల్‌పై రియాక్ట్ అయిన కమెడియన్స్ అవినాష్, నేహంత్

రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హవా నడుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో ఎంతోమంది భాగస్వాములు కాగా, తాజాగా జబర్దస్త్ కమెడియన్స్ అవినాష్, నేహంత్ మొక్కలు నాటి చెరో ముగ్గురిని నామినేట్ చేశారు.

Samayam Telugu 10 Jul 2020, 4:09 pm
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా సాగిపోతోంది. ఇందులో భాగంగా జబర్దస్త్ రాకేష్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు నానక్ రామ్ గూడలో మొక్కలు నాటారు జబర్దస్త్ కమెడియన్స్ ముక్కు అవినాష్, నేహంత్.
Samayam Telugu జబర్దస్త్ రాకేష్ సవాల్_పై రియాక్ట్ అయిన కమెడియన్స్ అవినాష్, నేహంత్
Avinash Nehanth Green india challenge


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. మొక్కలు నాటడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు హైదరాబాదులో ఎక్కడ చెట్టు కనిపించేది కాదని.. కానీ ఈ రోజు ఎక్కడ చూసినా కూడా పచ్చని చెట్ల తోనే కనిపిస్తుందని చెప్పారు.

Also Read: బిచాణా సర్దేసిన బిత్తిరి సత్తి.. మరో ఛానెల్ లోకి ఎంట్రీ.. స్వాగతం పలికిన యాజమాన్యం

ముఖ్యమంత్రి గారు చేపట్టిన హరితహారం స్ఫూర్తితో ఈ రోజు నగరమంతా పచ్చగా మారిపోయిందని, మనందరం మంచి ఆరోగ్యంతో ఉండాలంటే మంచి వాతావరణం అవసరం కాబట్టి దీన్ని అందరూ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ యాంకర్ రాధ V6 ,ఆదిరే అభి ,కెవ్వు కార్తిక్ లను మొక్కలు నాటాలని సవాల్ విసిరాడు అవినాష్.

అలాగే నేహంత్ మరో ముగ్గురిని నామినేట్ చేశాడు. నీహారిక కొణిదెల, యోద, యానీ మాస్టర్‌లకు ఛాలెంజ్ విసిరాడు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.