హాస్యవినోదాలను పంచడంలో జబర్దస్త్ షోది ప్రత్యేకమైన స్థానం అంటారు కామెడీ లవర్స్. కొత్త స్కిట్లతో.. ఆటోపంచులతో.. సెన్సార్ సెటైర్లతో నవ్వులు పూయిస్తూ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ షో. అయితే ఇందులో కామెడీనే కాదు సీరియస్ విషయాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఆ కథేంటో చూసే ముందు ఈ షో హైలైట్స్ చూద్దాం!
ప్రెస్టేషన్ - ప్రశాంతత ఇవి రెండే లీడ్ పాయింట్స్గా తీసుకుని స్కిట్ స్టార్ట్ చేసిన చలాకీ చంటీ.. తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. పెద్దగా నవ్వడం, పెద్దగా అరవడం, వాదనలు వినడం ఇష్టలేని చంటీకి.. అందరి ప్రవర్తనతో ఒత్తిడి పెరుగుతుంది. వాళ్లని ఏం చెయ్యలేక తనని తానే కొట్టుకుంటూ.. మధ్య మధ్యలో ప్రశాంతత కోసం పూజ చేస్తూ నవ్విస్తాడు.
ఇక హైపర్ ఆదికి ఒక భార్య, ఇద్దరు కూతుర్లు. ఎప్పటిలానే భార్యపై సెటైర్లు వేస్తూ ఇద్దరు కూతుర్లకు బాగా ఆస్తి ఉన్నవాళ్లకి ఇచ్చి చెయ్యాలని ప్రయత్నిస్తాడు. అయితే వాళ్లకి తాడుగు అలవాటు ఉంటుంది. అయినా సరే డబ్బుకోసం వాళ్లకే ఇచ్చి పిల్లలకి పెళ్లి చేస్తాడు. పెళ్లి అంటూ అయితే వాళ్ల తాడుగు అలవాటు ఎలాగోలా మానిపించుకోవచ్చు అని కూతుర్లకు నచ్చజెబుతాడు. అయితే వాళ్లకున్న తాగుడు అలవాటు ఆది కుటుంబానికి కూడా అంటుకుంటుంది. ఆ సీన్ బాగా నవ్వొస్తుంది.
షో మొత్తానికీ అదిరే అభి స్కీట్కే ఎక్కువగా నవ్వులు విరిసాయి. వశీకర(నరేష్) ఓ సైన్టిస్ట్. రోబోలను కనిపెడుతూ ఉంటాడు. ''ద చిట్టి 2.2 లెట్స్ వెల్కామ్'' అంటూ ఇన్వైట్ చేస్తాడు. చిట్టి(అభి) రోబోలా నడుచుకుంటూ వస్తాడు. అక్కడ నుంచి అసలైన కామెడీ స్టార్ట్ అవుతుంది. 'ఇంకో రెండు రోబోలను తయారు చేసా'నంటూ.. 'చిలకమ్మా', 'అమ్మకొట్టిందా' అనే పేర్లతో రెండు రోబోలను ఇన్వైట్ చేస్తాడు వశీకర. అవి బానెడు పొట్టతో బాగా నవ్వు తెప్పిస్తుంటాయి. మొత్తానికి రోబోలానే ప్రవర్తిస్తూ.. ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ పొట్టచక్కలు చేస్తుంటాయి రోబోలు. అయితే చిట్టీ తన యజమాని వశీకరతో ''బాస్ మాకు మీలా స్వేచ్ఛనివ్వండి బాస్'' అని అడిగితే.. ''నో'' అంటాడు వశీకర.
ఆ తర్వాత వశీకర చిట్టీని తిడుతూ.. ''దోమ కుడుతుంటే చంపకుండా ఏం చేస్తున్నావ్ చిట్టీ.?'' అనడంతో కుట్టేవాటినన్నింటినీ చంపెయ్యాలని చిట్టీ ఫీడ్ చేసుకుంటుంది. తర్వాత వశీకర బామ్మ బట్టలు కుడుతూ కనిపిస్తే చంపేస్తుంది. ఇలా కామెడీగా సాగున్న స్కిట్.. చివరికొచ్చేసరికి వశీకర తయారు చేసిన రోబోలన్నీ కలిసి వశీకరనే రోబోలా మార్చేస్తాయి. ఆ సీన్ బాగా నవ్వు తెప్పిస్తుంది. అయితే ఈ స్కిట్ మీద అనసూయ జడ్జస్ ఒపీనియన్ అడగడంతో రోజా బాగా నచ్చిందని అభి టీమ్ సభ్యులని అభినందించింది. తర్వాత నాగబాబు అభి కాన్సెప్ట్కి పొగడ్తల వర్షం కురిపించడంతో పాటూ కామెడీ ట్రాక్ నుంచి సీరియస్ ట్రాక్లో తీసుకెళ్లి తనకు తెలిసిన రోబో స్టోరీస్ చెప్పుకొచ్చారు.
''నాకు చాలా బాగా ఇష్టమైన సబ్జెక్ట్ రోబో'' అని మొదలు పెట్టిన నాగబాబూ... నేను ఈ రోబో సబ్జెక్ట్ని బాగా ఫాలో అవుతుంటాను. ప్రపంచం అత్యంత తీవ్రంగా సర్వనాశనం కాబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇదే. ఇంకొక వందేళ్ల తర్వాత మనిషి జాతి అనేది భూమ్మీద ఉండకపోవచ్చు. మనం మెషిన్ లేకుండా బతకలేకపోతున్నాం. ఆల్ రెడీ మెషిన్స్ అన్నీ ఇంటర్నెట్తో అనుసందానమైపోయాయి. స్లోగా ఏం జరుగుదంటే ఈ కంప్యూటర్స్ అన్నీ సొంతంగా ఆలోచించడం మొదలుపెడతాయి. ఆల్రెడీ ఫేస్బుక్ వాళ్లు ఓ ఎక్స్ఫర్మెంట్ చేశారు. రెండు రోబోలను తయారు చేసి ఆ రెండింటి మధ్య డిస్కర్షన్ పెట్టారు. అయితే ఆ రెండు రోబోస్ కొద్దిసేపు తర్వాత వేరే లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నాయి. వాటి ఓన్ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకున్నాయి.
ఎప్పుడైతే ఓన్ లాగ్వేజ్లో మాట్లాడుకుంటున్నాయో.. రోబోస్ తయారు చేసిన వాళ్లకి ఏం అర్థం కాలేదు. ఇవేంటి మనల్ని దాటి వెళ్లిపోతున్నాయి.. మన కమాండ్స్ దాటి వెళ్తున్నాయని వెంటనే వాటిని డిస్మ్యాండిల్ చేసేశారు. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గనుక ప్రపంచాన్నిఆక్రమిస్తే రాత్రికి రాత్రే అంతా మారిపోతుంది. మానవాళి మొత్తం నాశనం అయిపోతుంది. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం.. అంటూ తనకి తెలిసిందంతా చెప్పుకొచ్చారు. అందరూ కూల్గా వింటే అనసూయ మాత్రం టెన్షన్ పడిపోతూ.. ఒక్కసారిగా గుండెల మీద చేతులు పెట్టుకుని భయం భయంగా.. ''ఇది నిజంగా జరుగుతుందా? ఓ గాడ్.. థ్యాంక్యూ.. ఎనీవేస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.. నో..నో.. థ్యాంక్యూ'' అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏడుపు ముఖం పెట్టుకుంటూ వెళ్లీ తన సీట్లో కూర్చోవడం బాగా నవ్వు తెప్పిస్తుంది.
ప్రెస్టేషన్ - ప్రశాంతత ఇవి రెండే లీడ్ పాయింట్స్గా తీసుకుని స్కిట్ స్టార్ట్ చేసిన చలాకీ చంటీ.. తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. పెద్దగా నవ్వడం, పెద్దగా అరవడం, వాదనలు వినడం ఇష్టలేని చంటీకి.. అందరి ప్రవర్తనతో ఒత్తిడి పెరుగుతుంది. వాళ్లని ఏం చెయ్యలేక తనని తానే కొట్టుకుంటూ.. మధ్య మధ్యలో ప్రశాంతత కోసం పూజ చేస్తూ నవ్విస్తాడు.
ఇక హైపర్ ఆదికి ఒక భార్య, ఇద్దరు కూతుర్లు. ఎప్పటిలానే భార్యపై సెటైర్లు వేస్తూ ఇద్దరు కూతుర్లకు బాగా ఆస్తి ఉన్నవాళ్లకి ఇచ్చి చెయ్యాలని ప్రయత్నిస్తాడు. అయితే వాళ్లకి తాడుగు అలవాటు ఉంటుంది. అయినా సరే డబ్బుకోసం వాళ్లకే ఇచ్చి పిల్లలకి పెళ్లి చేస్తాడు. పెళ్లి అంటూ అయితే వాళ్ల తాడుగు అలవాటు ఎలాగోలా మానిపించుకోవచ్చు అని కూతుర్లకు నచ్చజెబుతాడు. అయితే వాళ్లకున్న తాగుడు అలవాటు ఆది కుటుంబానికి కూడా అంటుకుంటుంది. ఆ సీన్ బాగా నవ్వొస్తుంది.
షో మొత్తానికీ అదిరే అభి స్కీట్కే ఎక్కువగా నవ్వులు విరిసాయి. వశీకర(నరేష్) ఓ సైన్టిస్ట్. రోబోలను కనిపెడుతూ ఉంటాడు. ''ద చిట్టి 2.2 లెట్స్ వెల్కామ్'' అంటూ ఇన్వైట్ చేస్తాడు. చిట్టి(అభి) రోబోలా నడుచుకుంటూ వస్తాడు. అక్కడ నుంచి అసలైన కామెడీ స్టార్ట్ అవుతుంది. 'ఇంకో రెండు రోబోలను తయారు చేసా'నంటూ.. 'చిలకమ్మా', 'అమ్మకొట్టిందా' అనే పేర్లతో రెండు రోబోలను ఇన్వైట్ చేస్తాడు వశీకర. అవి బానెడు పొట్టతో బాగా నవ్వు తెప్పిస్తుంటాయి. మొత్తానికి రోబోలానే ప్రవర్తిస్తూ.. ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ పొట్టచక్కలు చేస్తుంటాయి రోబోలు. అయితే చిట్టీ తన యజమాని వశీకరతో ''బాస్ మాకు మీలా స్వేచ్ఛనివ్వండి బాస్'' అని అడిగితే.. ''నో'' అంటాడు వశీకర.
ఆ తర్వాత వశీకర చిట్టీని తిడుతూ.. ''దోమ కుడుతుంటే చంపకుండా ఏం చేస్తున్నావ్ చిట్టీ.?'' అనడంతో కుట్టేవాటినన్నింటినీ చంపెయ్యాలని చిట్టీ ఫీడ్ చేసుకుంటుంది. తర్వాత వశీకర బామ్మ బట్టలు కుడుతూ కనిపిస్తే చంపేస్తుంది. ఇలా కామెడీగా సాగున్న స్కిట్.. చివరికొచ్చేసరికి వశీకర తయారు చేసిన రోబోలన్నీ కలిసి వశీకరనే రోబోలా మార్చేస్తాయి. ఆ సీన్ బాగా నవ్వు తెప్పిస్తుంది. అయితే ఈ స్కిట్ మీద అనసూయ జడ్జస్ ఒపీనియన్ అడగడంతో రోజా బాగా నచ్చిందని అభి టీమ్ సభ్యులని అభినందించింది. తర్వాత నాగబాబు అభి కాన్సెప్ట్కి పొగడ్తల వర్షం కురిపించడంతో పాటూ కామెడీ ట్రాక్ నుంచి సీరియస్ ట్రాక్లో తీసుకెళ్లి తనకు తెలిసిన రోబో స్టోరీస్ చెప్పుకొచ్చారు.
''నాకు చాలా బాగా ఇష్టమైన సబ్జెక్ట్ రోబో'' అని మొదలు పెట్టిన నాగబాబూ... నేను ఈ రోబో సబ్జెక్ట్ని బాగా ఫాలో అవుతుంటాను. ప్రపంచం అత్యంత తీవ్రంగా సర్వనాశనం కాబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇదే. ఇంకొక వందేళ్ల తర్వాత మనిషి జాతి అనేది భూమ్మీద ఉండకపోవచ్చు. మనం మెషిన్ లేకుండా బతకలేకపోతున్నాం. ఆల్ రెడీ మెషిన్స్ అన్నీ ఇంటర్నెట్తో అనుసందానమైపోయాయి. స్లోగా ఏం జరుగుదంటే ఈ కంప్యూటర్స్ అన్నీ సొంతంగా ఆలోచించడం మొదలుపెడతాయి. ఆల్రెడీ ఫేస్బుక్ వాళ్లు ఓ ఎక్స్ఫర్మెంట్ చేశారు. రెండు రోబోలను తయారు చేసి ఆ రెండింటి మధ్య డిస్కర్షన్ పెట్టారు. అయితే ఆ రెండు రోబోస్ కొద్దిసేపు తర్వాత వేరే లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నాయి. వాటి ఓన్ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకున్నాయి.
ఎప్పుడైతే ఓన్ లాగ్వేజ్లో మాట్లాడుకుంటున్నాయో.. రోబోస్ తయారు చేసిన వాళ్లకి ఏం అర్థం కాలేదు. ఇవేంటి మనల్ని దాటి వెళ్లిపోతున్నాయి.. మన కమాండ్స్ దాటి వెళ్తున్నాయని వెంటనే వాటిని డిస్మ్యాండిల్ చేసేశారు. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గనుక ప్రపంచాన్నిఆక్రమిస్తే రాత్రికి రాత్రే అంతా మారిపోతుంది. మానవాళి మొత్తం నాశనం అయిపోతుంది. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం.. అంటూ తనకి తెలిసిందంతా చెప్పుకొచ్చారు. అందరూ కూల్గా వింటే అనసూయ మాత్రం టెన్షన్ పడిపోతూ.. ఒక్కసారిగా గుండెల మీద చేతులు పెట్టుకుని భయం భయంగా.. ''ఇది నిజంగా జరుగుతుందా? ఓ గాడ్.. థ్యాంక్యూ.. ఎనీవేస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.. నో..నో.. థ్యాంక్యూ'' అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏడుపు ముఖం పెట్టుకుంటూ వెళ్లీ తన సీట్లో కూర్చోవడం బాగా నవ్వు తెప్పిస్తుంది.