యాప్నగరం

Guppedantha Manasu Today: ‘ఇక నన్ను ఈ జన్మలో క్షమించవేమో వసు’ నిజం తెలిసి అల్లాడిపోయిన జగతి

Guppedantha Manasu today : జగతికి నిజం తెలిసింది. వసు ఇంటికి వెళ్లిన జగతి.. నిజం తెలుసుకుంది. ఈ క్రమంలోనే ఈ సీన్ హైలైట్‌గా నిలిచింది. నేటి కథనంలో రిషి ఉన్న చోటకి వసు వెళ్లడం.. వసు స్వరం రిషి చెవిన పడటంతో రిషి పరుగులు తీయడం.. అంతా ఉత్కంఠగా సాగిన సంగతి తెలిసిందే. అయితే నేటి కథనంలో మరో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే జగతి వసు ఇంటికి వెళ్లడమే. అక్కడేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 7 Jun 2023, 11:14 am
అవును.. జగతి వసు ఇంటికి వెళ్లింది. అనంతగిరిలో వసు ఇంటికి వెళ్లిన జగతి ఇంటికి తాళం వేసి ఉండటం చూసి.. అల్లాడిపోతుంది. ‘ఇక్కడికి ఎప్పుడొచ్చినా తాళం వేసే ఉంటుందేంటీ? వసు వాళ్లు ఎక్కడుంటున్నారు?’ అనుకుంటూ బాధగా గుమ్మం దాటి.. ఇంటి బయటికి వస్తుంది జగతి. అక్కడున్న ఒకామెని పిలిచి.. ‘వసుధార ఇంటికి తాళం వేసి ఉందేంటండి.. వాళ్లు ఎక్కడికి వెళ్లారు?’ అని అడుగుతుంది.
Samayam Telugu Guppedantha Manasu today
‘గుప్పెడంత మనసు’ (photo courtesy by star maa and disney+ hotstar)


Read also: ‘గుప్పెడంత మనసు’ జూన్ 7: వసు పిలుపుకు ఉలికిపడిన రిషి.. క్షణం ఆగలేక పరుగులు.. గడగడలాడించిన రౌడీ మురుగన్

దాంతో ఆ పక్కింటామె.. ‘వాళ్లు ఈ ఇంట్లో ఉండటం లేదమ్మా..’ అంటుంది జగతితో. ‘ఎక్కడుంటున్నారు?’ అని అడుగుతుంది జగతి. ‘అది నాకు తెలియదమ్మా..’ అంటుంది ఆ పక్కింటామె. ‘ఏదైనా ప్రాబ్లమ్ అయ్యిందా?’ అంటుంది జగతి అయోమయంగా చూస్తూ. ‘ప్రాబ్లమ్ అంటారేంటమ్మా..? వసుధార వాళ్ల అమ్మ చనిపోయారు కదా?’ అంటుంది ఆమె. దాంతో జగతి గుండె ముక్కలైపోతుంది. ‘చనిపోయారా?’ అంటుంది షాక్ అవుతూ.

‘అవునమ్మా.. సుమిత్ర గారు చనిపోయారు. ఈ విషయం మీకు తెలియదా?’ అంటుంది ఆ పక్కింటామె. ‘మరి నేను వచ్చినప్పుడు ఎప్పుడూ మీరు ఈ మాట నాతో చెప్పలేదు?’ అంటుంది జగతి కంగారుగా. ‘మీరు వాళ్ల బంధువే కదా తెలుసు అనుకున్నాను. ఇంత వరకూ మీకు తెలియదా?’ అంటుంది ఆ పక్కింటావిడ. ‘లేదు.. చనిపోయి ఎంత కాలం అవుతుంది?’ అంటుంది జగతి కంగారుగా. ‘చాలా కాలం అవుతుందమ్మా..’ అంటుంది ఆమె. ‘ఎలా జరిగింది?’ అని అడుగుతుంది జగతి. ‘గుండెనొప్పితో..’ అంటుంది ఆ పక్కింటామె. ‘హార్ట్ ఎటాక్‌తోనా?’ అంటుంది జగతి కంగారుగా.

‘అవునమ్మా.. వసుధార.. ఉన్నట్టుండి అత్తగారి ఇంటి నుంచి ఇంటికి వచ్చింది.. తను ఏం చెప్పిందో ఏమో వెంటనే సుమిత్ర గారికి గుండె నొప్పి వచ్చింది. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.. అక్కడే ప్రాణం పోయింది.. కొన్ని రోజులు వసుధార, చక్రపాణీ గారు అసలు మనుషులు కాలేదమ్మా.. ఆ తర్వాత ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా వాళ్లు ఈ ఇంటికి రాలేదు..’ అంటూ జరిగింది మొత్తం జగతికి చెబుతుంది ఆవిడ. దాంతో జగతికి విషయం అర్థమవుతుంది.

‘నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఇంత ఘోరం జరిగిందా? దేవుడా ఎంత పని చేశావయ్యా.. వసు ఎక్కడున్నావమ్మా.. ఇక నన్ను ఈ జన్మలో క్షమించవేమో? నా వల్లే మీ అమ్మ చనిపోయింది.. అందరి కన్నీళ్లకూ నేనే కారణం.. నేనే బాధ్యురాలిని..’ అని కుమిలికుమిలి ఏడుస్తూ మనసులోనే రోదిస్తుంది జగతి. మరి వసుని జగతి కలిసి క్షమాపణలు కోరుతుందా? గురుశిష్యుల బంధం తిరిగి నిలబడుతుందా? అనేది చూడాలి. (photo courtesy by star maa and disney+ hotstar)
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.