యాప్నగరం

Guppedantha Manasu ఆగష్టు 11: వసు ఆఖరి మెసేజ్! ‘ఒక్కసారి మిమ్మల్ని చూడాలి సార్’ రిషి పరుగులు

Guppedantha Manasu today August 11 Episode: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2022 ఆగష్టు 11)న 524 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Guppedantha Manasu August 11 Episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 11 Aug 2022, 10:28 am
గత ఎపిసోడ్‌లో సాక్షీ వసు మీద రగిలిపోవడం.. రిషి తలుపు తీయ్యగానే సాక్షీ ఆవేశంగా వెళ్లిపోవడం తెలిసిందే కదా. మరోవైపు జగతి, మహేంద్రలు రిషి నిర్ణయం గురించి బాధపడుతూ ఉంటారు. అదే సీన్ నేటి కథనంలో కంటిన్యూ అయ్యింది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ 2022 ఆగష్టు 11 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu 2022 August 11 Episode


524 ఎపిసోడ్‌ హైలైట్స్..
‘రిషి తొందరపడతాడు కానీ.. తప్పు చేయడు. కచ్చితంగా ఈ పెళ్లి జరగదు అని నాకు అనిపిస్తోంది మహేంద్రా’ అంటుంది జగతి. మహేంద్ర మాత్రం.. ‘అది నీ భ్రమ’ అంటాడు మహేంద్ర. ఇక రిషి ఓ చోట నిలబడి.. సాక్షీ వసుని అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో సాక్షీ వచ్చి.. ‘థాంక్యూ రిషి.. పిలవగానే వచ్చావ్’ అంటుంది. ‘నువ్వు పిలిస్తే నేను రాలేదు.. నేను రావాలి అనుకున్నాను గనుకే వచ్చాను’ అంటాడు రిషి. ‘రెండింటికీ పెద్ద తేడా ఏముంది?’ అంటుంది సాక్షీ. ‘తేడా అందరికీ తెలియదులే కానీ.. అన్నీ బెదిరింపులతో అవ్వవని తెలుసుకో.. వసుధర గురించి ఆలోచించడం మానెయ్.. ఇది చెప్పడానికే వచ్చాను.. ఇది మాత్రమే చెప్పడానికి వచ్చాను’ అని వెళ్లిపోతాడు రిషి. సాక్షీరగిలిపోతుంది.

దాంతో దేవయానికి కాల్ చేస్తుంది సాక్షీ. ‘అసలు రిషీ ఏంటీ..? ఎప్పుడు వసుధారా అంటాడేంటీ?’ అంటూ రగిలిపోతుంది. దాంతో దేవయాని.. ‘అది కాదు సాక్షీ.. కొంచెం ఓపిక పట్టు.. రిషి నీ మెడలో తాళి కట్టేస్తే ఆ వసుధార ఎవరో ఈ రిషి ఎవరో.. మొత్తం మారిపోతుంది కదా’ అంటూ ధైర్యం చెబుతుంది. వెంటనే జగతి.. దేవయాని చేతిలోంచి ఫోన్ లాక్కుని.. ‘‘నేను కూడా సాక్షీతో ఒక మాట చెప్పాలి అక్కయ్యా..’ అంటూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటుంది. ‘సాక్షీ ఏం జరిగినా నువ్వు అనుకున్నది జరగదు సాక్షీ..’ అంటుంది జగతి. దాంతో ‘ఏంటి ఆంటీ భయపెడుతున్నారా..? అన్నీ జరుగుతున్నాయి మీరు చూస్తూ ఉండండి, వచ్చి అక్షింతలు వేస్తే అయిపోతుంది.. బై ఆంటీ’ అని ఫోన్ పెట్టేస్తుంది సాక్షీ. ‘ఏంటి జగతీ ఏం మాట్లాడుతున్నావ్..’ అంటుంది దేవయాని కోపంగా జగతీతో. ‘ప్రపంచంలో చిన్న పక్షి కూడా తన పిల్లల్ని కాపాడుకుంటుంది. నా కొడుకుని ఎలాగైనా సాక్షీ నుంచి రక్షించుకుంటాను..’ అని దేవయాని ఫోన్ దేవయాని చేతిలో పెట్టి వెళ్లిపోతుంది జగతి.

ఇక ఇంట్లో వసు గురించి ఆలోచిస్తున్న రిషి దగ్గరకు ధరణి వస్తుంది. ‘సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు సాక్షీని పెళ్లి చేసుకోవడం ఏంటీ?’ అంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది కానీ.. సూటిగా సమాధానం ఇవ్వకుండా ఏదేదో మాట్లాడతాడు రిషి. దాంతో ధరణీ వెనుదిరుగుతుంది. అప్పుడే వసు నుంచి మెసేజ్ వస్తుంది రిషికి. ‘ఆఖరి సారిగా మిమ్మల్ని ఒకేసారి చూడాలని ఉంది.. రాగలరా?’అని మెసేజ్ చేస్తుంది వసు. అది చూసి వెంటనే కాల్ ట్రై చేస్తాడు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వెంటనే పరుగుతీస్తాడు. ‘రిషి ఎక్కడికి’ అని ధరణీ అడిగినా.. నిజం చెప్పడు. పని ఉంది వదినా అని పరుగుతీస్తాడు.

కారు వేగంగా వసు బస్తీవైపు పోనిస్తూ.. తనలో తనే అల్లాడిపోతాడు. ‘అసలు ఏం అనుకుంటోంది.. ఆఖరి సారిగా చూడాలి అనుకోవడం ఏంటీ.. వసుధార ఇంత పిరికిది అనుకోలేదు..’ అని కారు డైరెక్ట్‌గా వసు ఇంటి ముందు ఆపుతాడు. తలుపు తోసుకుని బయటికి వెళ్తాడు. ఇంట్లో వసు ఉండదు. మొత్తం చూస్తాడు. ఎదురుగా తనతో గడిపిన జ్ఞాపకాలన్నీ కనిపిస్తాడు. గోలీల డబ్బా.. నెమలి ఈక అన్నీ చూసి.. ఇంకా భయపడతాడు. మళ్లీ ఫోన్ ట్రై చేేస్తూ ఉంటాడు. కలవదు. దాంతో అంతా పిచ్చివాడిలా వెతుకుతూ ఉంటాడు.

వసు మాత్రం కూల్‌గా ఓ బెంచ్ మీద కూర్చుని ఆకాశంలో చంద్రుడితో మాట్లాడుతుంది. కాసేపటికి రిషి అక్కడికి వస్తాడు. వసు కూల్‌గా కూర్చోవడం చూసి.. వసుధారా అని గట్టిగా అరుస్తాడు. వేగంగా వచ్చి ఒక్కటి పీకబోయి ఆగుతాడు. కొడతాడేమో అని చేతులు అడ్డం పెట్టుకుంటుంది వసు. ‘ఏంటి మెసేజ్.. ఇక్కడేం చేస్తున్నావ్? అసలు ఏం అనుకుంటున్నావ్’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలతో ఫైర్ అవుతాడు.

‘నా బాధని చెప్పుకుంటున్నాను.. మీ కథే చెబుతున్నాను సార్.. అంటే.. నేను చెబితే మీరు వినరు కదా.. అందుకే విశాలమైన ఆకాశానికి చెబుతున్నాను..’ అంటుంది వసు కూల్‌గా. ‘ఆ మెసేజ్‌లు ఏంటీ? ఆఖరి సారి అంటే ఏంటీ? నేనెంత భయపడ్డానో తెలుసా?’ అంటాడు రిషి ఆవేదనగా. ‘భయమెందుకు సార్? నేను చనిపోతా అనుకున్నారా? నిజానికి నాకు మీతో మాట్లాడాలని అనిపించింది. మీరు ఎటు రారని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను..’ అంటుంది వసు. ‘నేను రాను అని నువ్వు ఎలా డిసైడ్ అవుతావ్’ అంటాడు రిషి కోపంగా. ‘మీరు అంతకుముందు రిషి సార్ కాదు సార్.. మీరు మారిపోయారు..’ అంటుంది వసు బుంగమూతి పెట్టి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.