యాప్నగరం

Guppedantha Manasu ఆగష్టు 26 ఎపిసోడ్: ఏకాంతంలో మనసు విప్పిన రిషి.. జగతి మదిలో మరో అనుమానం

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 ఆగష్టు 26)న 224 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. guppedantha manasu serial today august 26 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 27 Aug 2021, 9:24 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 ఆగష్టు 26)న 224 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ ఆగష్టు 26 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu August 26 episode


223వ ఎపిసోడ్‌ హైలైట్స్..
మహేంద్ర, రిషి ఇంటికి రాలేదని భోజనం చెయ్యకుండా ఫణేంద్ర, దేవయాని వాళ్లు ఎదురు చూస్తూ ఉంటారు. సీన్ కట్ చేస్తే.. నైట్ చాలా సమయం అయ్యిన తర్వాత.. జగతి రిషి ఫొటోస్ చూసుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. అది చూసిన వసు.. పాపం జగతి మేడమ్ అనుకుంటూ.. ఫొటోస్ తీసి పక్కన పెట్టి.. తలుపు జారేసి.. రిషి గురించి ఆలోచిస్తుంది. ‘ఏం మాట్లాడుకుండా అందరినీ చూసి వెళ్లేరేంటీ? అనుకుంటూ రిషికి కాల్ చేస్తుంది. అప్పటికే మిస్టర్ ఇగో నిద్రలో ఉండి.. ‘ఈ పొగరు నన్ను నిద్రకూడా పోనివ్వదా’ అనుకుంటూ గుడ్ నైట్ అని వాయిస్ మెసేజ్ పెట్టి పడుకుంటాడు. అది చూసిన వసుకి మరింత టెన్షన్ మొదలవుతుంది. వెంటనే శిరీష్‌కి కాల్ చేసి.. ‘నాకు రిషీ సార్ కోపం గురించి టెన్షన్‌గా ఉంది..’ అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో జగతి వాటర్ కోసం నిద్రలేచి.. హాల్‌లోకి రాగానే.. వసు నిద్రపోకుండా ఫోన్ మాట్లాడటం చూసి షాక్ అవుతుంది.

మాట్లాడేది శిరీష్‌తో అని తెలిసి.. మనసులో అనుమాన పడుతుంది. వాళ్లది స్నేహమేనా లేక ఇంకేదైనానా అని రిషితో వసుని ప్రేమిస్తున్నావ్ అని తనే చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది. మనసులో కాస్త బాధపడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ఉదయానే వసు జగతి చీర ఇస్త్రీ చేస్తూ ఉంటే. ‘నా చీర ఇస్త్రీ చెయ్యొద్దు.. ఎవరి పని వారిది.. కలుగజేసుకోకు’ అన్నట్లుగా కాస్త గట్టిగానే మందలిస్తుంది. . ఆ సమయంలో కూడా శిరీష్‌తో నైట్ మాట్లాడాను నిద్రపట్టలేదు అందుకే మాట్లాడాను అని వసు చెప్పడం చూసి.. జగతి అనుమానం బలపడుతుంది.

ఇక మిస్టర్ ఇగో కాలేజ్‌కి వచ్చేసమయానికి పుష్పతో.. వసు.. ‘రిషి సార్ అంటే భయం దేనికీ? గౌరవం ఉంటే సరిపోతుంది.. అయినా ఈ మధ్య ఆ జంటిల్‌మెన్‌కి కోపం ఎక్కువే అవుతుంది’ అంటూ నోరు జారుతుంది. రిషి వినేస్తాడు. వెంటనే.. ‘హలో.. అన్నీ నీకే తెలుసు అనుకోకు’ అంటూ వసుకి వినిపించేలా ఫోన్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. వసు వాళ్ల దగ్గరకు వచ్చి.. పుష్పా నువ్వు వెళ్లు అంటాడు. వెంటనే వసువైపు కోపంగా చూస్తూ.. ‘జంటిల్ మెన్ అని బిరుదు ఇస్తున్నావా.. నేనంటే భయం లేదా నీకు’ అంటాడు .అంతా వినేశారా అనుకుంటూ వసు సారీ చెబితే.. ‘రేపు నీకో విషయం చెబుతాను. నీతో మాట్లాడాలి.. ఇప్పుడు క్లాస్‌కి వెళ్లు అంటారు.

ఇక సీన్ కట్ చేస్తే జగతి.. రిషి ఇచ్చి వాడిన పువ్వుల్ని పుస్తకాల మధ్యలో తెరిచి చూసుకుంటూ మురిసిపోతుంటే.. డీజీపీ భార్యతో కలిసి శిరీష్ జగతి ఇంటికి వస్తారు. శిరీష్ ఆ పువ్వుల్ని అనుమానంగా చూస్తూ ముట్టుకోబోతుంటే.. జగతి వెంటనే లాక్కుని దాచిపెట్టేస్తుంది. ఇక కమింగ్ అప్‌లో.. మిస్టర్ ఇగో వసుని ఎక్కడికో ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్లి మాట్లాడకుండా నసుగుతాడు. ‘ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.. నీకు నా మీద ఉన్న అభిప్రాయం ఏంటీ’ అంటాడు. వసుకి ఏం అర్థం కాదు. మిస్టర్ ఇగో ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాడో ఏమో.? మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.

Read Also: ‘దేవత’ ఆగష్టు 26 (ఈరోజు) ఎపిసోడ్: దేవి తల్లి రాధే.. మీపేరుతో అర్చన చేయించింది.. ఆదిత్యతో పంతులు
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.