యాప్నగరం

Guppedantha Manasu: తల్లి ప్రేమని గుర్తించిన రిషి! ‘మీరుండగా నాకేం కాదు’ అంటూ క్లారిటీ

Guppedantha Manasu 2023 May 9 Episode: ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. చాలా ఆసక్తిగా సాగుతోంది. ఓవైపు జగతీకి నిజం తెలిసింది. దేవయాని, శైలేంద్రలు ఎంతటి దుర్మార్గులో స్పష్టమైంది. పైగా వాళ్లు రివర్స్‌లో జగతీనే బ్లాక్ మెయిల్ చేయడంతో కథనం ఉత్కంఠగా మారిపోయింది. ఇప్పుడు ‘ఈ విషయం ఎవరికి చెప్పినా ముగ్గురినీ(వసు, మహేంద్ర, రిషీలని) చంపేస్తాం’ అంటూ దేవయానీ, శైలేంద్రలు చెప్పేశారు. దాంతో పాపం జగతీ అల్లాడిపోతుంది. (photo courtesy by star maa and disney+ hotstar)

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 9 May 2023, 11:41 am
Guppedantha Manasu 2023 May 9 Episode: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ మంచి రసపట్టులో ఉంది.. శైలేంద్ర ఎంట్రీతో ఆదిపత్య పోరు మొదలైపోయింది. రిషిని దొంగ దెబ్బ తీయడానికి శైలేంద్ర, దేవయానిలు పన్నిన, పన్నుతున్న కుట్రలు జగతికి తెలియడంతో.. కొడుక్కి ఏమౌతుందో అని కన్నపేగు విలవిల్లాడుతుంది.
Samayam Telugu Guppedantha Manasu 2023 May 9 Episode
‘గుప్పెడంత మనసు’ 2023 మే 9 ఎపిసోడ్(photo courtesy by star maa and disney+ hotstar)

Read also: ‘గుప్పెడంత మనసు’: కన్నపేగును కదిలించే సీన్.. ‘రిషి నా కళ్లముందు ఉండకూడదు పిన్నీ.. ఎలా కాపాడుకుంటావో నీ ఇష్టం’ శైలేంద్ర వార్నింగ్

ఇక ఈ సీరియల్‌ స్టార్ మా ఛానల్‌లో రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుండగా.. ఉదయాన్నే 6 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే నేటి ఎపిసోడ్‌‌ని ఇంకా స్ట్రీమింగ్ చేయలేకపోవడంతో ‘గుప్పెడంత మనసు’ ప్రేక్షకులు హాట్ స్టార్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సీరియల్ అభిమానులు.. రాత్రి వరకూ ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఉంటుందనే ఉద్దేశంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ని వందల రూపాయిలు చెల్లించి యాక్టివేట్ చేసుకుంటున్నారు. అయితే ప్రతిరోజు ఏదో ఒకటి లేదా రెండు మెయిన్ టాప్ రేటింగ్ సీరియల్స్‌ని స్ట్రీమింగ్ చేయకుండా ఆలస్యంగా చేస్తుండటంతో సబ్‌స్ట్రైబ్ చేసుకున్న ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కథలోకి వెళ్తే.. జగతీ ఒంటరిగా కూర్చుని.. శైలేంద్ర, దేవయానీల మాటల్ని తలుచుకుని అల్లాడిపోతూ ఉంటుంది. ఇటు రిషి, వసు, మహేంద్రలకు నిజం చెప్పలేదు.. అలా అని, అటు రిషిని కాలేజ్‌కి దూరం చేసి.. శైలేంద్ర వాళ్లు చెప్పినట్లు ఆడలేదు. అందుకే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే జగతీ కోసం వెతుకుతున్న వసు, మహేంద్రలు పైకి వెళ్లి జగతీ ఒక్కర్తే కూర్చుని ఏడవడం చూసి షాక్ అవుతారు. పరుగున వెళ్లి.. ‘ఏమైంది మేడమ్?’ అని వసు.. ‘ఏమైంది జగతీ ఎందుకు ఏడుస్తున్నావ్?’ అని మహేంద్ర.. అల్లాడిపోతూ ఆరా తీస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే పైకి రిషి వస్తాడు. దూరం నుంచి జగతీ ఏడవడం, వసు, మహేంద్రలు కంగారు పడటం చూసి షాక్ అవుతాడు. పరుగున వాళ్ల దగ్గరకు వెళ్లి.. ‘మేడ..మ్?’ అంటాడు ఏం అయ్యింది అనే స్వరంలో.

వెంటనే జగతీ పైకి లేచి.. రిషిని హత్తుకుని.. ‘రిషీ..’ అంటూ పెద్దగా ఏడ్చేస్తుంది. ఆ సీన్ చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే ఆ తర్వాత ప్రోమో హైలైట్స్‌ని బట్టి.. జగతీ ఏడుస్తూ ఉంటే.. రిషి కూల్‌గా.. ‘మేడమ్ ఎందుకు ఇంతగా ఏడుస్తున్నారు? ఏ విషయం అయినా నాతో చెప్పొచ్చు.. ఏం జరిగిందో చెప్పండి’ అని నమ్మకాన్ని ఇస్తూ ప్రశ్నిస్తాడు. వసు, మహేంద్రలు కూడా చెప్పమని రిక్వస్ట్ చేయడంతో.. జగతీ ఏదో చెబుతుంది. బహుశా నిజం చెప్పలేదు కనుక.. ‘శత్రువులు ఎక్కువ అవుతున్నారు కాబట్టి.. ఎమ్‌డీ పదవిని వదిలిపెట్టాలి’ అని రిషిని ఏడుస్తూనే రిక్వస్ట్ చేసి ఉండొచ్చు. అందుకే రిషి జగతీ చెప్పేది అంత సీరియస్‌గా వింటున్నట్లు ప్రోమోలో చూపించారు.

ఏది ఏమైనా.. రిషి అంతా విన్నాక ఓ మాట అంటాడు. ‘మీరు ఉండగా నన్నుఎవరూ టచ్ చేయలేరు’ అని. అంటే రిషికి తల్లి మీద ఎంత నమ్మకం ఉందో ఆ మాటతో స్పష్టమవుతుంది. తల్లి మీద గౌరవం, అభిమానం, నమ్మకం అన్నీ ఉన్నాయి రిషికి. గుండెల నిండా ప్రేమ కూడా ఉంది. కానీ చిన్నప్పుడు వదిలిపోయిందనే కోపం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అది తగ్గాలంటే.. దానికి కారణం దేవయానీ అనే నిజం రిషికి తెలియాలి. అది తెలిసిన రోజు.. కచ్చితంగా రిషి.. జగతీని ‘అమ్మా..’ అని పిలుస్తాడు.

మొత్తానికీ జగతీ.. శత్రువులకు అడ్డంగా దొరికేసింది కాబట్టి.. ఇక మీదట కథ మొత్తం జగతీ చుట్టూనే తిరగబోతుంది. కొడుకుని ఎలా కాపాడుకుంటుంది? రిషిని కాపాడే క్రమంలో మళ్లీ దోషిగా మారి.. కొడుకుకి దూరం అవుతుందా? లేక శత్రువులకు చెక్ పెడుతుందా? చూడాలి మరి. (photo courtesy by star maa and disney+ hotstar and youtube)

Also Read: 'రాధకు నీవేరా ప్రాణం' లేటెస్ట్ ఎపిసోడ్: రాధికకు హారతిచ్చి ఆహ్వానించిన ధర్మావతి.. ఫొటోలో అమ్మాయిని ఎదురుగా చూసి ఓం బాబు షాక్.. రసవత్తరంగా ఎపిసోడ్!
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.