యాప్నగరం

Devatha మే 19 ఎపిసోడ్: కల్లు తాగి, దేవుడమ్మ దగ్గరకు బయలుదేరిన భాగ్యమ్మ.. ‘రాధే రుక్మిణీ అని చెప్పేస్తా’

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘దేవత’ సీరియల్.. నేడు(2022 మే 19)న 548 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Devatha May 19 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 19 May 2022, 11:58 am

ప్రధానాంశాలు:

  • ‘దేవత’ మే 19 ఎపిసోడ్
  • కల్లు తాగి, దేవుడమ్మ
  • దగ్గరకు బయలుదేరిన భాగ్యమ్మ..
  • ‘రాధే రుక్మిణీ అని చెప్పేస్తా’
  • అంటూ భాగ్యమ్మ తెగింపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ‘దేవత’ మే 19 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Devatha May 19 episode
గత ఎపిసోడ్‌లో భాగ్యమ్మ దగ్గరకు దేవిని తీసుకుని వస్తుంది రాధ. ప్రేమగా ముద్దులు ఆడి మనవరాలితో తనివి తీరా ఆడుకుంటుంది. రాధ కూడా వాళ్లతో కలిసి ఆడుతుంది. ఇక నేటి కథనంలో భాగ్యమ్మ ఆవేశం కథను కీలకంగా మారుస్తుంది.
548వ ఎపిసోడ్‌ హైలైట్స్..
ఇక దేవి, రాధ ఇంటికి బయలుదేరతారు. మరోవైపు జానకి మాధవతో.. ‘రాధ ఎందుకో బాధపడుతుందిరా.. తనకు ఏం కష్టం వచ్చిందో ఏంటో? మళ్లీ ఎందుకు అలా ఉంటుందో అర్థం కావట్లేదు.. నువ్వైనా అడిగి తెలుసుకో’ అంటుంది. మాధవ కంగుతింటాడు. తనవల్లే రాధ అలా ఉంటుందని తెలిసిన మాధవ.. ‘అది నేను తెలుసుకుంటాను లే అమ్మా.. నువ్వు పెద్దగా ఆలోచించకు’ అంటూ సర్దిచెబుతాడు. జానకి వెళ్లిపోతుంది.

ఇక కాసేపటికి.. దేవిని తీసుకుని వచ్చిన రాధ మాధవ వైపు గుర్రుగా చూస్తుంది. దేవి ‘భాగ్యమ్మ అవ్వని కలిసాను అని చెబుతుంది. అంతా విన్న మాధవ.. ‘నీ కోసం నాన్నమ్మ ఎదురు చూస్తుంది వెళ్లు’ అని పైకి పంపిస్తాడు. ఈ క్రమంలోనే మాధవ రాధతో.. ‘ఏంటి రాధా ఇలా పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతే ఎలా?’ అంటుంది. ‘మీరు ఇలానే ప్రవర్తిస్తుంటే.. ఈ సారి అదే జరుగుతుంది. కానీ ఈ సారి తిరిగి ఇంటికి రాము’ అని గట్టిగానే సమాధానం ఇచ్చి వెళ్లిపోతుంది.

మరోవైపు దేవుడమ్మ ఊరి నుంచి తిరిగి వచ్చేయడంతో ఇంట్లో అంతా సంబరంగా ఉంటారు. నవ్వులు, జ్యోకులతో గడుస్తుంది. అందరికి బట్టలు తెచ్చిన దేవుడమ్మ అందరికీ ఇస్తూ ఉంటుంది. రాత్రి అవుతుంది. అప్పుడే సరిగ్గా భాగ్యమ్మ అమ్మవారి చెట్టు ముందు కళ్లు తాగి.. మత్తులో ఆవేశంగా అమ్మవారి మీదే అరుస్తుంది. ‘నా బిడ్డ బతుకు ఎందుకు ఇలా ఆగం చేస్తున్నారు.. ఇన్నాళ్లు పడిన కష్టాలు చాలవు అని ఇప్పుడు ఆ మాధవ గాడి కారణంగా సమస్యలు పెడుతున్నారా’ అంటూ అరుస్తుంది.

వెంటనే కళ్లు తుడుచుకుని.. ‘మిమ్మల్ని నమ్ముకునే కంటే.. దేవుడమ్మని నమ్మకుంటే మేలు.. నా బిడ్డకు కష్టం అంటే ఆ తల్లి ఊరు ఊరునే ఏకం చేసి కాపాడుతుంది. చెప్పేస్తా.. నా బిడ్డని కాపాడమని చెప్పేస్తాను.. ఆ దేవుడమ్మ తల్లికే చెప్పేస్తాను’ అని అక్కడ నుంచి ఊగుతూ, తూలుతూ బయలుదేరుతుంది. దాంతో కథనం రసవత్తరంగా మారిపోయింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! devatha కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.