యాప్నగరం

Janaki Kalaganaledu జూలై 22 (ఈరోజు) ఎపిసోడ్: జానకి రహస్యాన్ని పసిగట్టేసిన జ్ఞానాంబ.. ఫోన్ సంభాషణ వినేసింది

జానకి ఐపీఎస్ కలను నెరవేర్చడం కోసం రామా కీలక నిర్ణయం తీసుకోవడంతో ‘జానకి కలగనలేదు’ సీరియల్‌ ఉత్కంఠగా మారింది. నేటి (జూలై 22) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే..

Samayam Telugu 22 Jul 2021, 3:26 pm
ఎట్టకేలకు ‘జానకి కలగనలేదు’ అసలు కథ మొదలైంది. ఇన్నాళ్లూ రామా దగ్గర తన చదువు, సాధించాలనుకున్న కలను సీక్రెట్‌గా ఉంచిన జానకి.. అసలు విషయం బయటకు వచ్చేయడంతో ఆమెకు అండగా నిలిచాడు రామా.
Samayam Telugu జానకి కలగనలేదు photo courtesy star maa and hotstar
Janaki Kalaganaledu 89 Episode


జానకిని ఐపీఎస్ చేసే బాధ్యత నాది అంటూ.. పోలీస్ కావడం తన కల అని.. అయితే కుటుంబ బాధ్యతల వల్ల తన కలను నెరవేర్చుకోలేకపోయానని అయితే ఒంటిపైకి రాని ఖాకీని తన భార్య ఒంటిపైకి వచ్చేలా చేస్తానని చెప్పాడు రామా.

ఇక నేటి (జూలై 22) ఎపిసోడ్‌లో.. తన కుటుంబం కోసం రామా చేసిన త్యాగం గురించి జానకితో చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది జ్ఞానాంబ. రామా పోలీస్ కావాలనుకున్న కల వచ్చే జన్మలో అయినా తీరాలని కోరుకుంటూ భావోద్వేగానికి గురౌతుంది జ్ఞానాంబ.

ఇక జానకి తన ఐపీఎస్ చదువు ముందుకు సాగడంపై ఆలోచనలో పడుతుంది. అత్తయ్య గారికి చదువు అంటే ఇష్టం ఉండదు.. కానీ ఆయన నన్ను ఐపీఎస్ చదివిస్తానని అంటున్నారు.. ఈ విషయంలో తల్లికొడుకుల మధ్య ఖచ్చితంగా గొడవ జరుగుతుందని భయపడుతుంది.

ఇంతలో జ్ఞానాంబ వచ్చి.. బాధపడుతూ ఉన్న కోడల్ని చూసి ఆందోళన చెందుతుంది. ఎందుకు అలా ఉంటుందని ఆలోచనలో పడుతుంది. జానకి ఇంకా భోజనం చేయలేదని గిన్నెలు చూసి తెలుసుకున్న జ్ఞానాంబ.. ఇంకా భోజనం చేయలేదెందుకు? రామా షాప్ ఇంకా రాకపోవడం ఏంటి? అని అంటుండగా.. ఇంతలో రామా వస్తాడు. కొడుక్కి భోజనం పెట్టి.. జానకి ఇంకా ఏదో ఆలోచనలో ఉండటాన్ని గమనిస్తుంది. తరువాత కొడుకుతో పాటు కోడలికి కూడా వడ్డిస్తుంది జ్ఞానాంబ.

అప్పటికీ జానకి ఆందోళనగా ఉండటంతో.. ‘నిన్న గమనిస్తూనే ఉన్నా.. పిల్లల మనసు తల్లికి తెలియదా.. నీ మనసులో ఏదో దిగులు ఉంది.. ఎందుకు అలా ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు.. ఇంతకీ ఏమైంది రామా.. అని అడుగుతుంది జ్ఞానాంబ.

భార్యభర్తలు అనుబంధం పెరగాలంటే భార్యని అర్థం చేసుకోవాలి.. నీ భార్య దిగులుకి కారణం తెలుసుకో.. ఆ సమస్యని పరిష్కరించి బాధను పోగొట్టు.. పొరపాటున కూడా నీ భార్య కంట నీళ్లు రాకుండా చూసుకో అని రామాకి చెప్తుంది జ్ఞానాంబ.

‘మీరు ఎందుకు బాధపడుతున్నారండీ’.. అని అడుగుతాడు రామా. దీంతో జానకి.. ‘నేను ఐపీఎస్ చదవనని చెప్తుంది’. ఎందుకు చదవరని రామా అడగడంతో.. ‘నా కల మీ కుటుంబంలో కలహాలకు కారణం కాకూడదు.. అత్తయ్య దృష్టిలో మీరు గొప్ప కొడుకు.. నమ్మకానికి మరోపేరు.. అలాంటిది అత్తయ్య గారికి తెలియకుండా మీరు నన్ను చదివిస్తున్నారని తెలిస్తే ఆమె తట్టుకోలేదు.. ఆ బాధను భరించే శక్తి అత్తయ్యకి ఉండదు.. నా కారణంగా తల్లీకొడుకుల మధ్య మనస్పర్ధలు రాకూడదు. అందుకే.. ఈ నిర్ణయం తీసుకున్నా.. వీటన్నింటికీ పరిష్కారం నా ఐపీఎస్ కలను చంపేసుకోవడమే అని చెప్తుంది జానకి.

దీంతో షాకైన రామా.. ‘మా అమ్మ.. నా కంటే ఎక్కువ చదువుకున్న కోడలు రాకూడదు అనుకోవడానికి బలమైన కారణం ఉంది.. అదేంటో మీకు తరువాత చెప్తానని అంటాడు. ఇక జానకి తన వదినతో ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘నేను 24 గంటలు కష్టపడతా.. నేను అనుకున్నది సాధిస్తా’ అని చెప్తుండగా.. వెనకనుంచి జ్ఞానాంబ వినేస్తుంది. ఆ తరువాత ఏమైందన్నది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.