యాప్నగరం

Karthika Deepam Serial ట్విస్ట్: దీప, కార్తీక్‌లకు మనశ్శాంతి లేకుండా చేసేసిన మోనిత.. శిక్షపడినా నో యూజ్

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 సెప్టెంబర్ 20)న 1149 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే సోమవారం రాబోయే ట్విస్ట్ అదిరిపోయింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 20 Sep 2021, 12:13 pm
‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 సెప్టెంబర్ 20)న 1149 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే నేటి కథనంలో మోనితకి జైలు శిక్షపడటంతో సీరియల్ ఉత్కంఠగా మారిపోయింది. పోలీసులు లాక్కెళ్లే సీన్, మీడియాకి మోనిత ఇచ్చే సమాధానం నేటి ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఆ సీన్స్ కోసం కింద లింక్ క్లిక్ చేయండి.
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam serial promo

‘కార్తీకదీపం’ సెప్టెంబర్ 20 ఎపిసోడ్: మోనితకి జరిమానా, జైలు శిక్ష.. మీడియాకిచ్చిన సమాధానం ఏదైతే ఉందో..

ప్రోమో హైలైట్స్..
‘నా జీవితం నా చేతుల్లోంచి జారిపోయింది.. పారేసుకున్నాను..’ అంటూ కార్తీక్ కుమిలిపోయే సీన్ కథను ఆసక్తిగా మార్చింది. కార్తీక్ తల్లి సౌందర్య, తండ్రి ఆనందరావు, భార్య దీపలతో.. తన మనసులోని బాధ చెప్పుకుని బాధపడటంతో.. దీప ‘ఇప్పటికైనా దాని పీడ విరగడైందిగా.. దాన్ని అసలు మనసులోంచే తీసెయ్యండి..’ అంటుంది బాధగా.

‘మరిచిపోవడానికి అది అంత చిన్న విషయమా దీపా?’ అంటాడు కార్తీక్ మరింత బాధతో.. దీప బాధగా చూస్తూ ఉంటుంది. సౌందర్య, ఆనందరావులు కూడా ధీనంగా కార్తీక్ మాటలని వింటూ ఉంటారు. ‘అది జైల్‌కి ఒంటరిగా వెళ్లి ఉంటే.. నువ్వు చెప్పినట్లుగానే అన్నీ మరిచిపోయి.. హూషారుగా మీ అందరితో కబుర్లు చెప్పుకుంటూ.. ఆనందంగా గడిపేవాడ్ని.. కడుపుతో బిడ్డతో వెళ్లింది.. కడుపులో ఒక అనుబాంబుని మోసుకెళ్లింది.. ఆ బాంబ్ ఎప్పుడు ఎలా పేలుతుందో.. అది ఎంత బలమైందో.. మనలో ఎంత మంది బలైపోతారోనని ఊహించుకోవడానికే భయంగా ఉంది..’ అంటాడు కార్తీక్ టెన్షన్‌గా.. సౌందర్య, ఆనందరావులు కార్తీక్‌ని ఓదారుస్తుంటే.. దీప ఆలోచిస్తూ, బాధపడుతూ వాళ్ల నుంచి దూరంగా ముందుకు నడవడంతో దీప ఏం నిర్ణయం తీసుకుంటుంది? కార్తీక్‌ని ఎలా మళ్లీ మామూలు మనిషిని చేస్తుంది అనేది రసవత్తరంగా మారింది. మొత్తానికి మోనిత శిక్షపడి జైలుకి వెళ్లినా.. దీప, కార్తీక్‌లకు మనశ్శాంతి లేకుండా చేసేసింది. చూద్దాం ఏం జరగనుందో.
‘గుప్పెడంత మనసు’ సెప్టెంబర్ 20 ఎపిసోడ్: రిషికి మహేంద్ర వార్నింగ్.. వసు వెంటే మిస్టర్ ఇగో
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.