యాప్నగరం

Premi Viswanath: ప్చ్.. ‘కార్తీకదీపం’లో సౌందర్య చనిపోతుందా? దీప క్లారిటీ

Karthika Deepam Serial Soundarya: కార్తీక్, దీపలను కలపడం కోసం త్యాగం చేయడానికి సౌందర్య సిద్ధపడిందా? కోడలు కాపురం నిలబడటం కోసం అత్త చనిపోవడానికి నిర్ణయించుకుందా? కార్తీకదీపం సీరియల్‌లో సౌందర్య చనిపోతుందా? నెటిజన్ల ప్రశ్నలపై దీప రియాక్షన్ ఇదీ.

Samayam Telugu 4 Sep 2019, 12:48 pm
కార్తీకదీపం.. ఇప్పుడు బుల్లితెరపై ఈ సీరియల్ పెద్ద సంచలనం. బిగ్ బాస్, జబర్దస్త్ లాంటి టాప్ రేటింగ్ ప్రోగ్రామ్స్‌ని సైతం వెనక్కి నెట్టి ప్రతివారం టీఆర్పీ రేటింగ్స్‌లో టాప్‌లో ఉంటుంది ‘కార్తీకదీపం’. మనిషంటే అందం, అభినయం కాదు ఆత్మాభిమానం, ఆత్మసౌందర్యం అన్నట్లుగా ఉంటుంది ఈ సీరియల్‌లో దీప క్యారెక్టర్.
Samayam Telugu Karthika Deepam Soundarya


నల్లగా, కేవలం అందాన్ని మాత్రమే ప్రేమించేవాళ్లకి అసహ్యంగా కనిపించే దీప ప్రేక్షకుల గుండేల్లో మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానాన్నే సంపాదించుకుంది. ఆత్మాభిమానమే వ్యక్తిత్వంగా బతికే ఓ అమ్మాయి కథ ఇది. స్వచ్ఛమైన మనసు, స్వార్థం తెలియని మాటతీరు, తనని తాను తగ్గించుకోలేని ఆత్మాభిమానం ఈ కథలోని కథానాయిక దీప (ప్రేమి విశ్వనాథ్) క్యారెక్టర్‌.

Read Also:

‘కార్తీకదీపం’ సెప్టెంబర్ 4 ఎపిసోడ్ : మారినట్లే నటిస్తూ ఫిటింగ్ పెట్టిన కార్తీక్

మారినట్లే నటిస్తూ ఫిటింగ్ పెట్టిన కార్తీక్

దీప భర్తగా కార్తీక్ పాత్రలో నిరుపమ్ పరితాలా నటించగా.. దీప అత్త సౌందర్య పాత్రలో అర్చన అనంత్ నటించారు. స్టార్ మాలో ప్రతి రోజు రాత్రి 7.30 ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం ఇప్పటికి 589 ఎపిసోడ్‌లను పూర్తి చేసి నేటితో 590 ఎపిసోడ్‌‌కి ఎంటర్ అయ్యింది.

ప్రతి ఇంటిలోనూ కార్తీకదీపం సీరియల్‌పై చర్చ నడుస్తోంది అంటే.. ఇందులోని పాత్రలు ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అయ్యాయో అర్ధం చేసుకోవచ్చు. దీప, కార్తీక్ పాత్రలకు తిరుగే లేదు. ఇక కీలకమైన సౌందర్య పాత్ర ఈ సీరియల్‌లో మోస్ట్ పవర్ ఫుల్. కొడుకు, కోడలిని కలపాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

Read Also: కార్తీకదీపం సీరియల్ ఆసక్తికర కథనాలకు క్లిక్ చేయండి..

అయితే కార్తీకదీపం సీరియల్‌లో కీలకమైన ఘట్టానికి చేరుకుంది. దీప ఎలాగైనా భర్త కార్తీక్‌కు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంటే.. కార్తీక్ మాత్రం ఆమెకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు. విడాకుల కోసం కోర్ట్‌కి వెళ్లగా కొన్నాళ్ల పాటు ఇద్దరూ కలిసి ఉండాలని ఆ తరువాత విడిపోవాలనుకుంటే అప్పుడు విడాకులు మంజూరు చేస్తామంది. మరోవైపు కార్తీక్ తల్లి సౌందర్య ఎలాగైనా కొడుకు, కోడలను కలపాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. కార్తీక్ మాత్రం దీపతో కాపురం చేసేది లేదని తెగేసి చెప్పేశాడు.

ఈ సందర్భంలో కొడుకు, కోడలను ఏకం చేయడానికి సౌందర్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది? సౌందర్య చనిపోవడానికి నిర్ణయించుకుందా? ఆఖరి కోరికగా కొడుకు కార్తీక్‌ని కోడలు దీపతో ఉండాలని కోరుతుందా? ఇలాంటి ప్రశ్నలు ప్రేక్షకుల్లో తలెత్తుతున్నాయి.

అయితే ఈ సీరియల్‌లో సౌందర్యది చాలా పవర్ ఫుల్ పాత్ర.. ఆ పాత్ర చనిపోతే పెద్ద లోటే అవుతుంది. ఆ పాత్రను చంపేయవద్దు అంటూ సోషల్ మీడియా కార్తీకదీపం హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్‌(దీప)కు రిక్వెస్ట్ పెడుతున్నారు ఫ్యాన్స్. అంతే కాదు నిజంగానే సౌందర్య చనిపోతుందా? అని ఆమె ఫేస్ బుక్‌లో ప్రశ్నించారు నెటిజన్లు.

అయితే వీటిపై క్లారిటీ ఇచ్చి.. ప్రేక్షకుల్లో ఉన్న టెన్షన్‌ని తొలగించింది దీప. కార్తీకదీపం సీరియల్‌లో సౌందర్య చనిపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని అవి ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది వంటలక్క.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.