యాప్నగరం

Guppedantha Manasu జూన్ 21 ఎపిసోడ్: జగతి సాక్షిగా వసుపై రిషీ ప్రేమ! మహేంద్రలోనూ అదే అనుమానం

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 జూన్ 21)న 168 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Guppedantha Manasu Serial Today June 21 Episode హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 21 Jun 2021, 10:34 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 జూన్ 21)న 168 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ జూన్ 21 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu June 21 episode


168వ ఎపిసోడ్‌ హైలైట్స్..
వసుకి తన కారణంగానే జ్వరం వచ్చిందని అనుకుంటున్న రిషీ.. పాపం దారిలో కనిపించిన అమ్మవారి దగ్గర తన బాధని చెప్పుకుని బాధపడుతూ ఉంటాడు. వసుకి ఎలాగైనా తగ్గించమ్మా.. అని మొక్కకుంటాడు. దీప వెలిగించి దన్నంపెట్టుకుంటాడు. ఇంటికి వెళ్లి ధరణితో.. ‘వదినా.. మంచి జరగాలంటే.. ఉపవాసం చేస్తారట కదా.. నిజమేనా’ అంటాడు. ‘అవును రిషీ నేను విన్నాను.. తినడం మానేసి స్వచ్ఛమైన మనసుతో మొక్కితే నిజం అవుతాయట’ అంటుంది. సరే వదినా నేను ఉపవాసం చేస్తాను’ అని చెప్పి.. ఎవరి గురించి రిషీ అంటే మాత్రం.. ‘నా గురించే వదినా’ అని అబద్దం చెబుతాడు.

మొత్తానికీ వసు కోలుకుంటుంది. తన లేచి జ్యూస్ తాగుతున్న సమయంలో రిషి కాల్ చేసి.. డాడీ.. వసుకి ఎలా ఉంది.. జ్యూసులు ఇస్తున్నారా.. పాలు ఇచ్చారా’ అంటూ ఆరాలమీద ఆరాలు తీస్తాడు. వెంటనే.. ‘డాడ్.. తను పోగొట్టుకున్న డబ్బు గురించి తనని ఆలోచించొద్దని చెప్పండి.. దాని గురించి మనిద్దరం ఆలోచిద్దాం’ అంటాడు. దాంతో మహేంద్ర షాక్ అవుతాడు. రిషి ఫోన్ పెట్టేశాక.. వసు డబ్బు పోయిన విషయం రిషీకి ఎలా తెలుసు అని ఆలోచనలో పడతాడు. అయితే రిషి వచ్చి వెళ్లాడని తెలుసుకున్న వసు షాక్ అవుతుంది. ‘రిషీ సార్ నన్ను చూడటానికి వచ్చారా’ అని ఆశ్చర్యపోతుంది.

ఇక దేవయానీ ‘రిషీ ఏం తినట్లేదని.. తన భర్తకు చెబుతుంది. అప్పుడే సంజూ వచ్చి.. ‘పెద్దమ్మా నీకు తెలియదా.. రిషీ అన్నయ్యా ఉపవాస దీక్ష చేస్తున్నాడట’ అంటుంది. దాంతో ఆమె షాక్ అవుతుంది. ధరణి అక్కడే ఉంటుంది. అయితే ‘నీతో రిషీ ఏం చెప్పినా నాకు చెప్పాలి’ అని ధరణికి దేవయానీ వార్నింగ్ ఇచ్చినప్పటికీ.. ధరణీ మాత్రం ఈ విషయం ఆమెకు చెప్పలేదు. మరి ముందే ధరణీకి ఈ విషయం తెలుసు అంటే దేవయాని ఏం చేస్తుందో ఏంటో..? ఇక కమింగ్ అప్‌లో రిషీ వసుని చూడటానికి జగతి ఇంటికి రావడం చాలా ఉత్కంఠగా మారింది.

కమింగ్ అప్‌లో..వసు బయటికి వచ్చి.. ‘సార్’ అంటూ తూలిపడబోతుంది. రిషీ కంగారుపడతాడు. జగతి పట్టుకుని సోఫాలో కూర్చెబెడుతుంది. జగతిని ఉద్దేశించి.. ‘నీరసంగా కనిపిస్తుంది కదా.. జ్యూస్ ఇవ్వచ్చుకదా’ అంటాడు. జ్యూస్ ఇప్పుడే తాగాను కదా మేడమ్’అంటుంది వసుధర రిషీ సమాధానం చెప్పకుండా. ‘జ్యూస్ తాగితే.. ఇప్పుడు పాలు ఇవ్వచ్చు కదా’ అంటాడు రిషీ. ‘పాలు నా నోటికి రుచించడం లేదని చెప్పాను కదా మేడమ్ మీకు..’ అంటుంది వసు. ‘నన్ను ఇక్కడ ఓ సాధనంగా చూసుకుని ఇద్దరూ భలే మాట్లాడుకుంటున్నారే’ అనుకుంటుంది జగతి మనసులో. ‘పొగరు మనుషుల మీద చూపించాలి. జ్వరం మీద కాదు.. రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది’ అంటాడు రిషి. ‘ఈ మాత్రం మంచి మాటలు ఫోన్‌లో కూడా చెప్పు కదా మేడమ్’ అంటుంది వసు. మొత్తానికి సీన్ చూస్తుంటే.. రిషీ గారి ప్రేమ సంగతి.. జగతికి అర్థమయ్యేలానే ఉంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘గుప్పెడంత మనసు’ కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.