యాప్నగరం

Ennenno Janmala Bandham నవంబర్ 28: నేరాన్ని అంగీకరించిన మాళవిక! వేదాని ఆపద నుంచి కాపాడిన యష్!

Ennenno Janmala Bandham november 28 episode: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్.. నేడు(2022 నవంబర్ 28)న 291 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Ennenno Janmala Bandham november 28 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 28 Nov 2022, 11:53 am
‘ఎన్నెన్నో జన్మల బంధం’ ఉత్కంఠగా సాగింది. వేదా, యష్‌లు కోర్టుకు చేరుకున్నారు. ‘ఈ కేసు కారణంగా మన బంధంలో ఎలాంటి మార్పు రాదు అని నాకు మాటివ్వండి’ అంటూ కోర్టు ముందే వేదా యష్‌ని కోరుతుంది. అదే సీన్ నేటి కథనంలో కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు ఆ హైలైట్స్ చూద్దాం.
Samayam Telugu Ennenno Janmala Bandham november 28 episode
‘ఎన్నెన్నో జన్మల బంధం’ నవంబర్ 28 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)


291 ఎపిసోడ్‌ హైలైట్స్..
‘మన మధ్య మూడో వ్యక్తి రావడమనేది జరగదు వేదా’ అంటూ మాట ఇవ్వబోతుంటే.. మాళవిక ఎంట్రీ ఇస్తుంది. ‘యష్’ అని పిలవగానే.. అటు చూస్తూ తన చేతిని వేదా చేతి మీద నుంచి వెనక్కి తీసుకుని.. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ క్రమంలోనే వేదాతో.. మాళవిక పొగరుగా.. ‘నేనే గెలుస్తాను.. ఇంతకు ముందే ఖుషీ విషయం గెలిచావంటే.. అప్పుడే యష్ నీవైపు ఉన్నాడు. కానీ ఇప్పుడు యష్ నావైపు ఉన్నాడు.. నేనే గెలుస్తాను’ అంటూ వేదాని బాధపెట్టి వెళ్తుంది.

ఇక ఖుషీ.. స్కూల్లో వినాయకుడి ముందు నిలబడి. .మా వేదమ్మే గెలవాలి అని మొక్కుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య అదే వినాయకుడి దగ్గరకు వచ్చి.. ‘మా మాళవిక అమ్మే గెలవాలి’ అని మొక్కుకుంటూ పక్కనే ఉన్న ఖుషీని చూస్తాడు. అప్పుడు ఖుషీ.. మా వేదా అమ్మే గెలుస్తుంది అన్నయ్యా అనగానే.. ‘ఆ ఆంటీ మంచిది కాదు.. నీతో మాట్లాడను’ అనేసి వెళ్లిపోతాడు. మరోవైపు మాళవిక మాటలకు అల్లాడిపోతున్న వేదాకు.. ఓవైపు మాలనీ, మరోవైపు లాయర్ ఝాన్సీ ధైర్యం చెబుతారు.

ఇక కోర్టు‌లోకి వచ్చిన వేదా, మాలనీ, సులోచన, చిత్రా అంతా ఒకవేపు కూర్చుంటారు. మాళవిక మరోవైపు కూర్చుంటుంది. వెనుకే వచ్చిన యష్.. ఎటు వెళ్లాలో తెలియక అల్లాడుతుంటే.. మాళవిక ‘యష్ ఇటురా’ అని పిలుస్తుంది. చేసేది లేక యష్ అక్కడికి వెళ్లే కూర్చుంటాడు. ఇక వాదన మొదలవుతుంది. లాయర్ ఝాన్సీ.. కేసుని మాళవిక మెడకు చుట్టుకునేలా మాట్లాడుతుంటే.. సడన్‌గా పైకి లేచిన మాలవిక.. ‘జడ్జ్ గారు.. నేరం నేనే చేశాను అని.. ఎవ్వరూ నిరూపించాల్సిన అవసరం లేదు.. నేనే ఒప్పుకుంటున్నాను’ అనేస్తుంది. ఆ మాటలకు యష్‌తో సహా అంతా షాక్ అవుతారు.

కమింగ్ అప్‌లో.. తీర్పు వచ్చిందో? వాయిదా పడిందో తెలియదు కానీ.. వేదా బయటికి వచ్చేసింది. యష్ కూడా బయటే ఉన్నాడు. ‘ఎక్కడికి వెళ్తున్నావ్ వేదా.. ఇంటికా క్లినిక్‌కా? నేను వదిలిపెడతాను చెప్పు’ అంటాడు. ‘మీరు నన్ను ఎప్పుడో వదిలేశారు కదా’ అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది వేదా. అప్పుడే అడ్డుపతాడు కైలాష్.. ‘వేదా రా నేను డ్రాప్ చేస్తాను’ అంటూ చేయి పట్టుకుని లాగబోతాడు. వెంటనే యష్.. వాడి చేతిని ఆపుతాడు. ఆ సీన్ అదిరిపోయింది. తరువాయి భాగంలో చూడాలి.. యష్ ఆ కైలాష్‌కి ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడో? మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Ennenno Janmala Bandham కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.