Mounaragam Telugu Serial Written Update 19 February 2020; Joseph Helps Ammulu
‘మౌనరాగం’ సీరియల్ : ‘అంకిత్ ఇక లేడు!’ ఒంటరిదైన అమ్ములు..?
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మౌనరాగం’ సీరియల్ 446 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. నేటికి 447 ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న మౌనరాగం (ఫిబ్రవరి 19) ఎపిసోడ్ హైలైట్స్లో ఏం జరిగిందో మీ సమయంలో మీకోసం.
Samayam Telugu12 Apr 2021, 11:14 pm
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మౌనరాగం’ సీరియల్ 446 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. నేటికి 447 ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న మౌనరాగం (ఫిబ్రవరి 19) ఎపిసోడ్ హైలైట్స్లో ఏం జరిగిందో మీ సమయంలో మీకోసం.
జరిగిన కథ..
చక్రీ తోసెయ్యడంతో కాంతమ్మకు పెద్ద దెబ్బ తగటడం, ఆపరేషన్కి లక్షకావాలని డాక్టర్లు చెప్పుడంతో.. సీనయ్య లక్ష తెచ్చి ఇంట్లో పెడతాడు. అందులో 50 వేలు ధనుష్(సీనయ్య పెద్ద అల్లుడు) దొంగలిస్తాడు. అయితే అంకిత్కి 50 వేలు అవసరం అంటే.. వేరే చోటు తీసుకొచ్చి.. 50 వేలు ఇస్తే.. దాన్ని ధనుష్ వీడియో తీసి.. సీనయ్య తెచ్చిన 50 వేలు దొంగతనం చేసింది అమ్ములేనని ఇంట్లో వాళ్లందరినీ నమ్మిస్తాడు. దాంతో సీనయ్య అమ్ముల్ని అసహించుకోవడం మొదలుపెడతాడు.
photo courtesy star maa and hotstar
ధనుష్ బెదిరింపులతో..
అయితే ఆ డబ్బులు దొంగలించింది తన బావ ధనుషేనని తెలుసుకున్న అమ్ములు ఇంట్లో అందరికీ చెబుతానని బయలుదేరుతుంది. కానీ ధనుష్ అమ్ములున్ని మరో నిజం అందరికీ చెబుతానని బెదిరిస్తాడు. ‘మీ నాన్నమ్మకి ఇంత దెబ్బ తగలడానికి కారణం మీ తమ్ముడనే నిజాన్ని మీ నాన్నకు చెబుతాను. ఇప్పటికీ చాలా దూరమైన ఆ తండ్రి కొడుకులు శాశ్వతంగా దూరం అయిపోతారు’ అని బెదిరిస్తాడు. దాంతో అమ్ములు వెనక్కి తగ్గుతుంది. photo courtesy star maa and hotstar
భరత్తో పెళ్లి సంబంధం ఆగిపోయి..
అయితే అమ్ములు కచ్చితంగా తప్పు చేసి ఉండదని లక్కీ నమ్ముతుంది. ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరగడంతో భరత్ తాతయ్య వచ్చి.. బాగా అవమానించి.. ‘భరత్కి అమ్ముల్ని ఇచ్చి పెళ్లి చేసేదే లేదుని. ఇక మీకు మాకు బంధుత్వం లేదని తెగేసి చెప్పి వెళ్లిపోతాడు. దాంతో మరోసారి అమ్ముల్ని బాగా తిడతాడు సీనయ్య. విషయం తెలుసుకున్న అంకిత్.. తన వల్లే అమ్ములు అవమానాలు పడుతుందని బాధపడతాడు. photo courtesy star maa and hotstar
అంకిత్ అమ్ములు కలిసిపోయారని చూసి..
తను వేసిన టెండర్ రావడంతో.. చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అమ్ములికి తిరిగి 50 వేలు అందిస్తాడు.అయితే అమ్ములు మాత్రం దోషిలానే ఉండిపోతుంది. ఇంతలో అమ్ములు అంకిత్ తన తల్లితో బెట్ కట్టి వచ్చానని, నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందామని వేడుకోవడంతో చివరికి అమ్ములు ఓకే అంటుంది. తన మనసులోని ప్రేమని బయపెడుతుంది. అయితే గోదావరి ఒడ్డున వాళ్లు ప్రేమతో కౌగలించుకోవడం చూసిన విష్ణు.. అమ్ముల్ని చంపెయ్యడానికి మనుషిని మాట్లాడతాడు. photo courtesy star maa and hotstar
అంకిత్ని కత్తితో పొడిచి..
అయితే గోదావరి అవతల ఉన్న గుడికి వెళ్లాలని అమ్ములు, అంకిత్లు అనుకుంటారు. నందినికి కాల్ చేసి.. ‘నువ్వు రేవు దగ్గరకు రామ్మా.. నీకు ఓ సర్పైజ్’ అని అంకిత్ పిలుస్తాడు. అమ్ములు, అంకిత్లు పడవలో అవతలవైపుకి వెళ్తుంటారు. దారిలో పడవలో ఉన్న.. ఆ రౌడీ అమ్ములు మీద దాడి చేస్తుంటే.. అంకిత్ అడ్డు రావడంతో ఆ రౌడీ అంకిత్ని పొడిచి గోదావరిలో పడేస్తాడు. తర్వాత అమ్ములు కూడా గోదావరిలో పడిపోతుంది. photo courtesy star maa and hotstar
అమ్ములు ఆవేదన..
అమ్ముల్ని ఓ వ్యక్తి కాపాడతాడు. అప్పటికే నందిని అమ్ముల్ని వెతుక్కుంటూ గోదావరి దగ్గరకు వెళ్లడంతో.. అమ్ముల్ని చూసి ఏడుస్తూ.. అమ్ముల్ని లేపుతుంది. పైకి లేచిన అమ్ములు.. అంకిత్ కోసం ఏడుస్తూ ఉంటుంది. చుట్టూ వెతుకుతుంది. తల్లికి సైగ చేస్తున్నా అర్థం కాదు. అయితే అమ్ములు ఏడుస్తూ ఉండగా.. నందిని అక్కడికి వస్తుంది. ‘అంకిత్ని చంపి గోదావరిలో పడేశారని’ సైగ చేసి చెప్పడంతో నందినీ కంగారు పడుతుంది. photo courtesy star maa and hotstar
సరయూ కంప్లైట్..
నీలవేణి అమ్ముల్ని బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్లాలని ప్రయత్నిస్తుంది. చివరికి విష్ణు అక్కడికి వచ్చి.. ‘అంటే దీన్ని చంపాలనుకుంటే వాడు బలైపోయాడా?’ అనుకుంటూ విషయం అర్థం చేసుకుని బాడీ వెతికించే పనుల్లో పడతాడు. తన బావ అంకిత్ కనిపించకపోవడానికి కారణం అమ్ములే అని.. సరయూ కంప్లైట్ ఇవ్వడంతో.. పోలీసులు అమ్ముల్ని స్టేషన్కి తీసుకుని వెళ్లి విచారిస్తారు. అయితే జ్యోసఫ్ వచ్చి..పోలీసులకి వార్నింగ్ ఇచ్చి అమ్ముల్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. photo courtesy star maa and hotstar
అంకిత్ కోసం గాలింపులు..
అమ్ములు పిచ్చిదానిలా ఏడుస్తూనే ఉంటుంది. ధీనంగా శూన్యంలోకి చూస్తూ ఓ మూలకు వెళ్లి కూర్చుంటుంది. అయితే మొత్తానికి ఓ శవం దొరుకుతుంది. అది అంకిత్దేని పోలీసులు నిర్దారించడంతో నందిని అల్లాడిపోతుంది. లక్కీ మాత్రం అమ్ముల్ని నమ్ముతుంది. అమ్ములు చాలా పిచ్చి దానిలా శవం దొరికే దాకా ఎన్ని సార్లు బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్లినా.. వెనక్కి వెళ్లి అంకిత్ కోసం ఏడుస్తూనే ఉంటుంది. photo courtesy star maa and hotstar
పగబట్టిన నందిని..
చివరికి అంకిత్ శవం దొరకడం, తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు కూడా అన్ని అయిపోతాయి. అయితే నందిని అమ్ములు కుటుంబం మీద పగపడుతుంది. ఏం చేసి అయినా సరే ఆ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని నందిని విష్ణుని అడగడంతో విష్ణు సరేనంటాడు. గతంలో వేసిన కేసుని తిరిగి బుకాయించి లాయర్ని తీసుకుని ఇంటికి వస్తాడు. 24 గంటల్లో ఇళ్లు ఖాళీ చెయ్యాలని, లేదంటా కుదరదనీ లాయర్ చెప్పి వెళ్లడంతో సీనయ్య ఫ్యామిలీ దు:ఖంతో అల్లాడుతుంది. photo courtesy star maa and hotstar
ఇల్లు ఖాళీ చెయ్యాలి..
సీనయ్య ఆవేశంతో అరుస్తాడు. ‘నువ్వు ఏం చెయ్యలేవురా’ అంటూ విష్ణు మీద రగిలిపోతాడు. అయితే విష్ణు మాత్రం చాలా కూల్గా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అదంతా అమ్ములు మౌనంగా చూస్తూ ఉంటుంది. ఒక పక్క అంకిత్ చనిపోయిన బాధ, మరో పక్క ఇల్లు వదులుకోవాల్సిన పరిస్థితి వీటన్నింటినీ అమ్ములు ఎలా అదిగమిస్తుందో ఎదురు చూడాల్సిందే. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. మౌనరాగం కొనసాగుతోంది.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.