యాప్నగరం

‘మాస్క్ వేసుకోమన్నావ్ సరే.. మరి నీకు ప్యాంట్ ఏదీ..’ అనసూయపై మరోసారి నెటిజన్ల దాడి

‘బబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రస్తుతం తన లేటెస్ట్ సినిమా ‘థాంక్యూ బ్రదర్’ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాలంటూ.. ఆమె ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఓ ఫోటోషూట్ పిక్స్ కూడా పెట్టింది. ఆ పిక్స్‌ చూసిన నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు.

Samayam Telugu 2 May 2021, 3:10 pm
‘జబర్దస్త్’ టీవీ షోతో జబర్దస్త్ బ్యూటీ అనసూయ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. షోలో తన అందచందాలను చూపిస్తూ.. కుర్రకారు మతిపోగొట్టింది ఈ భామ. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్లీ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా టీవీ షోలు, ఈవెంట్లతో బిజీ అయిపోయింది. ఓవైపు బుల్లితెరపై దూసుకుపోతూనే వెండితెరపై ఛాన్స్‌ల కోసం ట్రై చేసింది. రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త అనే పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసింది.
Samayam Telugu అనసూయ భరద్వాజ్
Anasuya Bharadwaj


ఇక అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్‌లు చేస్తూ.. అందాల విందు ఇస్తూ ఉంటుంది. అనసూయ ఫోటోలు పెట్టిందంటే చాలు యువత ఆ ఫోటోలను చూస్తూ ఉండిపోతారు. అంతలా ప్రభావం చూపిస్తుంది ఆమె. అయితే తన ఫోటోలపై ఎన్ని ప్రశంసలు వస్తాయో అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయ.. నడుము ఎక్స్‌పోజ్ చేయడం, పొట్టి గౌన్లు ధరించడం తదితర అంశాలపై ఇప్పటికే ఆమె చాలాసార్లు నెటిజన్లు ఆగ్రహాన్ని ఎదురుకుంది.

నెటిజన్ల నుంచి ఇలాంటివి ఎదురైన ప్రతీసారి అనసూయ వాళ్లకి ధీటుగా జవాబు ఇచ్చింది. దుస్తులు ధరించడం అనేది తన వ్యక్తిగత అంశంమని.. ఇందులో ఎవరి సలహా తీసుకొనే అవసరం తనకి లేదంటూ పేర్కొంది. అయితే తాజాగా మరోసారి అనసూయపై నెటిజన్లు కామెంట్లతో దాడి చేస్తున్నారు. ఇందుకు కారణం కూడా ఆమె లేటెస్ట్ సోషల్‌మీడియా పోస్టులే.

అనసూయ లేటెస్ట్ చిత్రం ‘థాంక్యూ బ్రదర్’. ఈ సినిమా మే 7న ఓటీటీలో విడుదలకానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది అనసూయ. ఈ క్రమంలో ఆమె తరచూ హాట్ లుక్స్‌తో ఫోటోలు అప్‌లోడ్ చేస్తోంది. లేటెస్ట్‌గా ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలంటూ ఆమె ఓ వీడియో పెట్టింది. ఆడవాళ్లతో మాట్లడటం తెలియవాళ్లు అంటూ కొందరిని ఉద్దేశిస్తూ.. ఈ వీడియో ప్రారంభించిన అనసూయ.. మాస్క్ లేకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడింది. ఇలాంటి వాళ్ల వల్లే చైనాలో పుట్టిన వైరస్ భారత్‌లో ఇంతా వ్యాప్తి చెందుతోంది అంటూ పేర్కొంది. ఇలా చెబుతూనే.. తన సినిమాని ప్రతీ ఒక్కరు చూడాలి అంటూ చివర్లో చెప్పింది.
View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

ఇంతవరకూ బాగానే ఉంది. దీని తర్వాత అనసూయ ‘థాంక్యూ బ్రదర్’ ప్రమోషన్లకు వెళ్తున్న ఫోటోలు కొన్ని పోస్ట్ చేసింది. ఇందులో బ్లాక్‌ రంగు గౌను ధరించి.. తనదైన స్టైల్‌లో హాట్‌గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. అంతే ఇంకేముంది.. ఆమెపై నెటిజన్లు ఫైర్ అవ్వడం ప్రారంభించారు. ‘మాకు మాస్క్ వేసుకోమని చెప్పడం కాదు.. ముందు నీ ఓవరాక్షన్ తగ్గించు’.. ‘మాకు మాస్క్ వేసుకోమని చెప్పావ్ సరే.. మరి నువ్వు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా’ అంటూ కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కామెంట్లపై అనసూయ ఏలా రియాక్ట్ అవుతుందో మరీ..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.